AP News:‘కొవిడ్ అల’..లా
రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. వారం రోజుల్లోనే పాజిటివిటీ రేటు 11 శాతంపైగా వృద్ధి చెందింది. ఈనెల పదో తేదీన 4.05% ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 15.22 శాతానికి చేరింది. చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.
వారంలో 11%పైగా పెరిగిన పాజిటివిటీ
కొత్తగా 4,570 మందికి వైరస్
చిత్తూరు, విశాఖ జిల్లాల్లో అత్యధికం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. వారం రోజుల్లోనే పాజిటివిటీ రేటు 11 శాతంపైగా వృద్ధి చెందింది. ఈనెల పదో తేదీన 4.05% ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 15.22 శాతానికి చేరింది. చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 30,022 మందికి పరీక్షలు చేయగా.. 4,570 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో 1,124, విశాఖపట్నంలో 1,028, గుంటూరులో 368, అనంతపురం జిల్లాలో 347 కేసులు నమోదయ్యాయి. కొవిడ్తో చిత్తూరు జిల్లాలో ఒకరు మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం 26,770 మంది కొవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 6,080 మంది, విశాఖపట్నం జిల్లాలో 5,619 మంది ఉన్నారు. గత ఇరవై నాలుగు గంటల్లో 660 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
అయిదు వేలకు చేరువ...
శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల మధ్య 35,673 మందికి పరీక్షలు చేయగా 4,955 మందికి కొవిడ్గా నిర్ధారించారు. అంటే పాజిటివిటీ రేటు 13.89 శాతంగా ఉంది. ఒమిక్రాన్ ప్రభావం మొదలయ్యాక... కేసుల సంఖ్య 5వేలకు చేరువకావడం గమనార్హం. అత్యధికంగా విశాఖపట్నంలో 1,103, చిత్తూరు జిల్లాలో 1,039 మందికి కొవిడ్ సోకింది. అధిక శాతం జిల్లాల్లో కేసుల సంఖ్య 300 పైనే ఉంది. వైరస్తో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు. 24 గంటల్లో కొవిడ్ నుంచి 397 మంది కోలుకున్నారు. 22,870 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కరోనా
గిద్దలూరు పట్టణం, న్యూస్టుడే: ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు కరోనా బారినపడ్డారు. శనివారం జ్వరం రావడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్లో ఉన్నట్లు తెలిపారు.
అంబటి రాంబాబుకు మూడోసారి కొవిడ్
సత్తెనపల్లి, న్యూస్టుడే: గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మూడోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆదివారం ఆయన సెల్ఫీ వీడియో ద్వారా ధ్రువీకరించారు. జలుబు, ఒంటి నొప్పులు ఉండటంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా తేలిందన్నారు. స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈనెల 12 నుంచి నియోజకవర్గంలో భారీ జనసందోహంతో చేపట్టిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత సత్తెనపల్లి నుంచి గుంటూరు వెళ్లారని ఎమ్మెల్యే సన్నిహితులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు. -
ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయం
కోర్టుల్లో పేరుకుపోతున్న కేసుల పరిష్కారంతో పాటు సత్వర న్యాయానికి మధ్యవర్తిత్వం దోహదపడుతుందని ఏపీ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి పేర్కొన్నారు.