Azadi Ka Amrit Mahotsav: తెల్లవారు కాళ్లావేళ్లా పడ్డ వేళ...
ఆంగ్లేయులు భారత్లో 200 ఏళ్ల పాటు ఆధిపత్యం చెలాయించటమేగాదు... తప్పైపోయిందని... కాళ్లు పట్టుకొని ప్రాధేయపడ్డ సందర్భాలూ ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది... తొలినాళ్లలో జరిగిన చైల్డ్స్ వార్! తమకు మాయని మచ్చగా నిలిచిన
ఆంగ్లేయులు భారత్లో 200 ఏళ్ల పాటు ఆధిపత్యం చెలాయించటమేగాదు... తప్పైపోయిందని... కాళ్లు పట్టుకొని ప్రాధేయపడ్డ సందర్భాలూ ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది... తొలినాళ్లలో జరిగిన చైల్డ్స్ వార్! తమకు మాయని మచ్చగా నిలిచిన ఈ తొలి ఆంగ్లో-ఇండియన్ యుద్ధాన్ని తెల్లవారు తెలివిగా చరిత్ర పుటల్లో మరుగున పడేలా చేశారు.
పదిహేడో శతాబ్ది తొలినాళ్ల సమయమది. మొఘల్ సామ్రాజ్యం బలహీన పడుతున్న దశ. అప్పటికే... డచ్, ఫ్రెంచ్, పోర్చుగీసులు భారత్లో, చుట్టుపక్కల సముద్రజలాల్లో వాణిజ్యంపై పట్టుకు ప్రయత్నిస్తున్నారు. వీరందరి తర్వాత ఆలస్యంగా వచ్చిన ఆంగ్లేయులు పశ్చిమ ప్రాంతాల్లో కొన్ని చోట్లకే పరిమితమయ్యారు. అదీ మొఘల్ రాజుల కనుసన్నల్లో! తూర్పుతీరంలో ముఖ్యంగా హుగ్లీ (బెంగాల్) వైపు పోర్చుగీసు వాణిజ్యం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతుండటంతో... ఆంగ్లేయులకు కన్నుకుట్టింది. అక్కడా తాము కాలుమోపాలనుకొని... ఈస్టిండియా కంపెనీ ప్రతినిధి విలియమ్ హెడ్జెస్ను 1682లో బెంగాల్ (మొఘల్)రాజు షాయిస్తాఖాన్ వద్దకు పంపించారు. మొఘల్ పాలనలోని అన్ని ప్రాంతాల్లో తాము వ్యాపారం చేసుకోవటానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. దీనికి తోడు తమ వస్తువులపై ఎగుమతి సుంకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆంగ్లేయులు అడిగే పద్ధతి నచ్చని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఇందుకు నిరాకరించాడు. చర్చలు విఫలమయ్యాయి. ఆ సమయంలో ఈస్టిండియా కంపెనీ ముంబయి గవర్నర్గా ఉన్న సర్ జోసియా చైల్డ్... ఆగ్రహంతో ఔరంగజేబుపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. మొఘల్ల వాణిజ్య ఓడలను తెల్లవారు అటకాయించి దోచుకోవటం ఆరంభించారు. అంతేగాకుండా మక్కా పర్యటనకు వెళుతున్న ఓడలను కూడా దోపిడీ చేశారు. చిట్టగాంగ్ను (ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది) చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్రమించుకొని బంగాళాఖాతంలో వాణిజ్యంపై పట్టుబిగించాలని వ్యూహం రచించారు. ఈ మేరకు 1685లో అడ్మిరల్ నికోల్సన్ 12 పడవల్లో వెయ్యిమంది సైనికులతో చిట్టగాంగ్పై దాడికి వచ్చాడు. కానీ... దారితప్పి హుగ్లికి చేరుకున్నాడు. అక్కడ మొఘల్ అధికారులకు, ఆంగ్లేయులకు మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. ఒకవైపు ఇలా మొఘల్లను ఇబ్బంది పెడుతూనే... మరోవైపు చర్చలు సాగదీశారు ఆంగ్లేయులు. కారణం మరింత సైన్యాన్ని కూడగట్టు కోవటం కోసమే. 1688లో మద్రాసు నుంచి కెప్టెన్ హీత్ ఆధ్వర్యంలో సైన్యం బాలాసోర్, చిట్టగాంగ్లపై విరుచుకుపడింది. కానీ అనుకున్నంతగా విజయం సాధించలేక మద్రాసుకు తిరుగుముఖం పట్టింది.
ఈ సంఘటనలన్నింటితో ఆగ్రహించిన ఔరంగజేబు... భారత్లో ఈస్టిండియా కంపెనీ ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీచేశాడు. ఫలితంగా.. ముంబయి, మద్రాసు తప్పిస్తే... అన్ని చోట్లా కంపెనీ ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. సిబ్బందిని, వారి సైనికులను నిర్బంధించారు. చేశారు. 1689లో మొఘల్ సైన్యాధిపతి సిది యాకుబ్ సారథ్యంలోని నౌకాదళం ముంబయిలోని ఈస్టిండియా కంపెనీపైనా దాడి చేసింది. ఆంగ్లేయులు తీవ్రంగా ప్రతిఘటించినా అదే సమయంలో వచ్చిన క్షామం దెబ్బతీసింది. ఫలితంగా... ఈస్టిండియా కంపెనీ లొంగిపోయింది. తప్పైందని... క్షమించమని కోరుతూ... 1690లో ఔరంగజేబు ముందు ప్రాధేయపడింది. తమ ఆస్తులను విడిచిపెట్టాలని... వాణిజ్యం చేసుకునేందుకు తిరిగి అనుమతించాలంటూ కాళ్లావేళ్లా పడి బతిమిలాడింది. ఆ కాలంలోనే లక్షన్నర రూపాయల జరిమానా చెల్లించటానికి సిద్ధపడింది. అంతేగాకుండా మునుముందు తమ ప్రవర్తన మార్చుకుంటామని హామీ ఇచ్చింది. మెత్తబడ్డ ఔరంగజేబు- ఈస్టిండియా కంపెనీ ఆస్తులకు, సిబ్బందికి విముక్తి ప్రకటించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత