Budget:బడ్జెట్ బండికి సవాళ్లెన్నో!
అనేక సవాళ్ల మధ్య కొత్త బడ్జెట్ రూపకల్పనకు కసరత్తు మొదలవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనేక ప్రభుత్వశాఖలకు, సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిగినా ఖర్చు అందుకు తగ్గ రీతిలో లేదు. నిధులు అందుబాటులో లేకపోవడం, ప్రతి ప్రభుత్వ శాఖలో బిల్లులు పెండింగులో
నేటి నుంచి అధికారుల స్థాయి చర్చలు
ఈనాడు, అమరావతి: అనేక సవాళ్ల మధ్య కొత్త బడ్జెట్ రూపకల్పనకు కసరత్తు మొదలవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనేక ప్రభుత్వశాఖలకు, సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిగినా ఖర్చు అందుకు తగ్గ రీతిలో లేదు. నిధులు అందుబాటులో లేకపోవడం, ప్రతి ప్రభుత్వ శాఖలో బిల్లులు పెండింగులో ఉండటం వంటి సవాళ్ల మధ్య పనులు ముందుకు సాగలేదు. పనులు చేసేందుకు, సరకులు సరఫరా చేసేందుకూ గుత్తేదారులు, సరఫరాదారులు వెనకడుగు వేస్తున్నారు. కరోనా అనంతరం రాష్ట్ర రాబడులు ఈ మధ్య పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా మూడోదశ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త బడ్జెట్కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రెండు మూడు ఆర్థిక సంవత్సరాలుగా బడ్జెట్ ప్రతిపాదనల మొత్తంలో పెద్దగా మార్పు లేదు. ఎప్పటికప్పుడు అంచనా పెరగాల్సి ఉన్నా ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా సవాలు వల్ల అనేక పరిమితులతో బడ్జెట్ రూపొందించాల్సి వస్తోందని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్ కసరత్తు సోమవారం ప్రారంభం కాబోతోంది.
2022-23 ఆర్థిక సంవత్సర రాష్ట్ర బడ్జెట్ను మార్చి నెలాఖరులోపు ఉభయసభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలి. ఎన్నికలు, కరోనా కారణంగా వరుసగా మూడేళ్లు తొలుత ఓటాన్ అకౌంట్ సమర్పించడమో, లేదా ఆర్డినెన్సు తీసుకురావడం వల్ల ఇటీవల నిర్దిష్ట కాలపరిమితి లోపు పూర్తిస్థాయి బడ్జెట్ను సభకు సమర్పించే వీలు చిక్కలేదు.
ప్రస్తుతం పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పనకు అవసరమైన ఏర్పాట్ల దిశగా ఆర్థికశాఖ అధికారులు అడుగులు వేస్తున్నారు. జనవరి 17 నుంచి 24 వరకు వారంరోజుల పాటు ఆర్థికశాఖ ఉన్నతాధికారులు సమావేశాలు ఏర్పాటుచేశారు. వచ్చే సంవత్సర బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వ ఆలోచనలను - కేటాయింపులకు సంబంధించిన ఆయా శాఖల నుంచి ఉన్న డిమాండును ఆర్థికశాఖ అధికారులు స్వీకరిస్తారు. ఆయా ప్రభుత్వశాఖల ప్రాధాన్యాలు, వచ్చే ఏడాది నిధుల అవసరాలు, పథకాలకు కేటాయింపులు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు - ఖర్చు తీరు, లక్ష్యాలు ఎంతవరకు అందుకున్నారు లాంటి అంశాలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చ ఉంటుంది. ఈ మేరకు సమావేశాలకు హాజరు కావాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అన్ని ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులకు వర్తమానం పంపారు. రోజూ అయిదారు ప్రభుత్వ శాఖలతో ఈ సమావేశాలు ఉంటాయి. ప్రతిపాదనలు స్వీకరించాక మరోసారి అధికారిక స్థాయిలో సమావేశాలు ఉంటాయి. ఆ సమావేశాల్లో ఎంత మేర సర్దుకోవాల్సి ఉంటుందో చెప్పి, ఆయా ప్రభుత్వశాఖల ప్రాధాన్యాలు తెలుసుకుంటారు. తర్వాత స్థాయిలో ఆర్థికమంత్రి అన్ని ప్రభుత్వశాఖల మంత్రులతో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చిస్తారు. అనంతరం తుది రూపు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా జెండర్ బడ్జెట్, పిల్లల బడ్జెట్ ప్రవేశపెడుతోంది. అంతకుముందు ఎప్పటి నుంచో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ కూడా సభకు సమర్పిస్తున్నారు. 2022-23 బడ్జెట్లో ఆయా శాఖలకు నిధుల కేటాయింపులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రాధాన్య పథకాలు-అమలు, కేంద్ర సాయంతో అమలు చేస్తున్న పథకాలు, గ్రామీణ మౌలిక సౌకర్యాల కల్పన, విదేశీ ఆర్థిక సాయంతో చేపడుతున్న పథకాలు- పురోగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికల అమలు తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చ ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
-
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
-
AP News: తెలుగు రాద్దామనుకుంటే.. హిందీ ప్రశ్నపత్రం వచ్చింది
-
బస్సుల్లేక బాధలు.. తికమకలో మరో కేంద్రానికి విద్యార్థిని