Krishnapatnam: ఆనందయ్య మందుపై అధ్యయనం షురూ
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా బాధితులకు ఆనందయ్య ఇస్తున్న మందు, వైద్యప్రక్రియలో శాస్త్రీయతపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ,
చికిత్స పొందిన 500మంది నుంచి వివరాలు సేకరణ
రంగంలోకి దిగిన ఆయుర్వేద పరిశోధన సంస్థలు
రెండు మూడు నెలల్లో ఫలితాలు!
ఈనాడు, అమరావతి, తిరుపతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా బాధితులకు ఆనందయ్య ఇస్తున్న మందు, వైద్యప్రక్రియలో శాస్త్రీయతపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, తిరుమల ఆయుర్వేద కళాశాల సంయుక్తంగా అధ్యయనం ప్రారంభించాయి. ఆనందయ్య వద్ద చికిత్స పొందిన సుమారు 500 మందిని నుంచి సేకరించే సమాచారంతో తొలుత జంతువులు, ఆ తరువాత మానవులపై క్లినికల్ ట్రయల్్్స జరుగుతాయి. ఆ తరవాతే ఆనందయ్య వైద్యం ఆయుర్వేద ప్రమాణాలకు తగ్గట్లుగా ఉందా లేదా అన్నది కేంద్ర ఆయుర్వేద సంస్థ నిర్ధారిస్తుందని వైద్యులు వెల్లడించారు. యుద్ధ ప్రాతిపాదికన పరిశోధనలు జరిగితే ఫలితాలు వచ్చేందుకు కనీసం 2,3 నెలలు పడుతుందని సమాచారం. సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ అధ్యయనానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడి చొరవతో కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ వెంటనే రంగంలోకి దిగింది.
కొవిడ్ మందు కోసం అన్వేషణ!
కొవిడ్-19 తొలిదశలో తమిళనాడులో సిద్ధ వైద్యానికి సంబంధించి కబాసుర కుడనీర్ (కషాయం మందు) తయారుచేశారు. నిమ్ముతో కూడిన జ్వరాలు, ఇతర అనారోగ్యాల పరిష్కారానికి ఈ మందు బాగా ఉపయోగపడుతుందని, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని చెప్పి వాడుకలోకి తెచ్చారు. కేంద్రం ఆయుర్వేద పరిశోధన సంస్థ కూడా ఆయుష్-64 మాత్రలను వాడుకలోకి తెచ్చింది. కేంద్ర ఆయుర్వేద వైద్య, పరిశోధన సంస్థ కొవిడ్ మందును తయారు చేసేందుకు దేశవ్యాప్తంగా ఆయుర్వేద వైద్య నిపుణుల నుంచి సలహాలు, సూచనలు కోరింది. ఈ మేరకు 16వేల ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో 2,000 ప్రతిపాదనలు పరిగణనలోనికి తీసుకొని మరింత లోతుగా అధ్యయనం చేసి చివరిగా 200 ప్రతిపాదనలు ఎంపిక చేశారు. వీటిలో ప్రస్తుతం 16 ప్రాజెక్టులపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కృష్ణపట్నం ఆయుర్వేదంపై ఆయుష్ శాఖ కార్యదర్శి ఆదేశాల ప్రకారం కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ డైరెక్టర్ జనరల్ శ్రీకాంత్ చేపట్టిన తదుపరి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అధ్యయనం ప్రారంభమైంది.
32 బృందాలుగా ఏర్పడి...!
ఆనందయ్య వైద్యానికి ప్రజల నుంచి స్పందన కనిపిస్తుండటాన్ని గమనించిన దిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్) జారీ చేసిన సూచనల మేరకు విజయవాడ, తిరుపతిలోని ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, టీటీడీ ఆయుర్వేదిక్ కళాశాల వైద్యులు సంయుక్తంగా అధ్యయనాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా కొందరు వైద్యులు, పీజీ విద్యార్థులు 32 బృందాలుగా ఏర్పడ్డారని ఆయుర్వేద వైద్యకళాశాల ప్రిన్సిపాల్ పి.మురళీకృష్ణ తెలిపారు. వీరు ఆనందయ్య వద్ద చికిత్స పొందిన వారికి ఫోన్లు చేసి వారికి కరోనా ఎప్పుడు వచ్చింది, ఆ సమయంలో ఆర్టీపీసీఆర్, సీటీ స్కాన్ పరీక్షలు చేయించుకున్నారా అనే వివరాలు తీసుకుంటున్నారు. కొవిడ్ వచ్చినట్లు తెలిసిన తర్వాత ఎన్ని రోజులకు ఆనందయ్య వద్ద మందులు తీసుకున్నారు, ఎప్పుడు ఉపశమనం కలిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇలా అన్ని కోణాల్లోనూ వివరాలు సేకరిస్తున్నారు. ఆ తరవాత ఈ సమాచారాన్ని క్రోడీకరించి తయారు చేసిన నివేదికను పరిశోధనసంస్థకు పంపుతారు.
ఇవి ఎలా పనిచేస్తాయో పరిశీలిస్తాం
‘విజయవాడలోని ప్రాంతీయ కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ సహకారంతో కృష్ణపట్నం మందు ఉపయోగించిన 500 మంది నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నాం. ఇందులో అత్యధికుల అభిప్రాయాలు సానుకూలంగా వస్తే ఎలుకలపై ప్రయోగిస్తాం. ఈ ప్రక్రియలోనూ సానుకూలత వస్తే మనిషిలోని సెల్లైన్స్ ద్వారా (టిష్యూ కల్చర్) వైరస్, ఇమ్యూనిటీ పరంగా ఎలా మందులు పనిచేస్తాయో పరిశీలిస్తాం. ఆ తరువాత మనుషులపై ప్రయోగాలు జరుగుతాయి. మందులో దుష్ప్రభావాలు లేవని తేలితే కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం లభిస్తుంది’
-సి.మురళీకృష్ణ, ఆయుర్వేద వైద్య సంస్థ, విజయవాడ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!