వాజ్పేయీ ఫోన్ నంబరు ఇవ్వండి!
వారిద్దరూ తెలుగు యువకులు. తాము పనిచేస్తున్న సంస్థ తరఫున 18 ఏళ్ల క్రితం అఫ్గానిస్థాన్లో రోడ్లు వేసే పనుల్లో కుదిరారు. అనూహ్యంగా తాలిబన్లకు చిక్కారు. మరణం అంచుల దాకా వెళ్లి అదృష్టవశాత్తు బయటపడ్డారు. వారే... నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం వవ్వేరుకు చెందిన
18 ఏళ్ల క్రితం నాటి బందీలపై తాలిబన్ల తీవ్ర ఒత్తిడి
వారి చెరలో 18 రోజులున్న నెల్లూరు యువకులు
సంగం, న్యూస్టుడే: వారిద్దరూ తెలుగు యువకులు. తాము పనిచేస్తున్న సంస్థ తరఫున 18 ఏళ్ల క్రితం అఫ్గానిస్థాన్లో రోడ్లు వేసే పనుల్లో కుదిరారు. అనూహ్యంగా తాలిబన్లకు చిక్కారు. మరణం అంచుల దాకా వెళ్లి అదృష్టవశాత్తు బయటపడ్డారు. వారే... నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం వవ్వేరుకు చెందిన గోని వరదారావు(వరదయ్య), ఆత్మకూరు మండలం అప్పారావుపాళెం వాసి పెమ్మసాని మురళీనాయుడు. ప్రస్తుతం అఫ్గానిస్థాన్ దేశం పూర్తిగా మరోసారి తాలిబన్ల వశమైన నేపథ్యంలో వారిద్దరూ నాటి భయానక పరిస్థితులను ‘న్యూస్టుడే’తో పంచుకున్నారు. పూర్తి వివరాలు వారి మాటల్లోనే...
‘మేం పనిచేస్తున్న సంస్థ తరఫున అఫ్గానిస్థాన్లో 2003లో రోడ్లు వేసే బృందంలో నేను(వరదారావు), వాటి నాణ్యతను పరిశీలించే బృందంలో మురళీనాయుడు పనికి కుదిరాం. కాబుల్ నుంచి కాందహార్ వరకు చేపట్టిన రోడ్డు పనుల్లో పాల్గొంటూ... కల్సజ్జా సిటీలో అమెరికా సైనికుల రక్షణలోని మా సంస్థ శిబిరంలో ఉండేవాళ్లం. 2003, డిసెంబరు 6న మా అమ్మానాన్నలతో ఫోన్లో మాట్లాడటానికి నేను కల్సజ్జాలోని ఓ టెలిఫోన్ బూత్కు వెళ్తూ.. మురళీనాయుడిని కలిశా. అదే సమయంలో రోడ్డు నాణ్యతా నిర్ధారణకు నమూనాలు తీయాల్సి రావడంతో... ఇద్దరం ఒకే వాహనంలో బయల్దేరాం. తిరిగొస్తుండగా వెనుతిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ఏడుగురు తాలిబన్లు వాహనాన్ని అడ్డగించారు. మా కళ్లకు గంతలుకట్టి బందీలుగా మార్చారు. వాస్తవానికి రోడ్డు నాణ్యత విభాగాధిపతి అయిన అమెరికా అధికారిని బందీగా పట్టుకోవాల్సి ఉండగా... వారి పథకం విఫలమై మమ్మల్ని పట్టుకున్నారు.
మైనస్ 16 డిగ్రీల చలిలో ప్రయాణం
తాలిబన్లు మమ్మల్ని వాహనంలో ఎక్కించుకొని మైనస్ 16 డిగ్రీల చలిలో నాలుగు గంటలపాటు ప్రయాణించి పెద్ద కొండల సమీపంలోని భూగర్భ స్థావరానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి పాకిస్థాన్లోని రావల్పిండికి దగ్గర్లో ఉన్న రహస్య ప్రదేశానికి చేర్చారు. మార్గమధ్యంలో వాగులు దాటాల్సినప్పుడల్లా మమ్మల్ని భుజాలపై ఎక్కించుకున్నారు. వారి స్థావరానికి చేరాక, మేం తాలిబన్లకు చిక్కినట్లు ఆంగ్లంలో ఉత్తరం రాయించి సమాచార సాధనాలకు అందించడంతో... విషయం ప్రపంచానికి తెలిసింది.
సాధారణ పౌరులమని చెప్పినా వినలేదు
నాటి మన ప్రధాని వాజ్పేయీ ఫోన్ నంబరు కావాలంటూ ఒత్తిడి చేశారు. మేం సాధారణ పౌరులమని చెప్పినా వినలేదు. మమ్మల్ని కాల్చి చంపాలని తాలిబన్లు నిర్ణయించగా.. పాకిస్థాన్కు చెందిన ఓ యువ వైద్యుడు, తాలిబన్ నాయకుడు అబ్దుల్ సలాం రాకెటీ అడ్డుకున్నారు. బందీలుగా ఉన్నన్ని రోజులు మాంసాహారం, మేక పాలతో తేనీరు ఇచ్చారు. వేట కుక్కలను కాపలా ఉంచారు. మొత్తం 18 రోజులపాటు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని తీవ్ర భయాందోళనకు గురయ్యాం’ అని వివరించారు.
మన నాయకుల ఎనలేని కృషి
బందీలను క్షేమంగా రప్పించేందుకు నాటి నెల్లూరు ఎంపీ రాజేశ్వరమ్మ, ఎమ్మెల్యేలు ప్రసన్నకుమార్రెడ్డి, కృష్ణయ్యనాయుడు అప్పటి సీఎం చంద్రబాబునాయుడు కలిసి... నాటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ద్వారా ప్రధాని వాజ్పేయీ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం అఫ్గాన్ ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించగా డిసెంబరు 23న రాత్రి గజిని సిటీ కమాండర్కు వరదారావు, మురళీని తాలిబన్లు అప్పగించారు. డిసెంబరు 30న వారిద్దరు నెల్లూరుకు వచ్చారు. అనంతర కాలంలో వరదారావు తాను పనిచేస్తున్న రంగంలోనే ఉద్యోగోన్నతి పొంది సూడాన్లో తొమ్మిదేళ్లు పనిచేశారు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. మురళీనాయుడు గుత్తేదారుగా స్థిరపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి