బడుల్లో కరోనా భయం
పాఠశాలలు మళ్లీ తెరిచారు. విద్యార్థులు వస్తున్నారు. కానీ ఇప్పటికీ కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో కేసులు వస్తున్నా, చాలాచోట్ల భౌతిక దూరం లాంటి నిబంధనలను పాటించడం లేదు. ఒక్కో గదిలో 20 మంది విద్యార్థులనే అనుమతించాల్సి ఉంటే..
తరగతి గదులు, భోజన సమయాల్లో కనిపించని భౌతిక దూరం
శానిటైజర్లు, సబ్బులకు విడుదల కాని ప్రత్యేక నిధులు
కొవిడ్-19 కేసులపై మార్గదర్శకాలు ఇవ్వని విద్యాశాఖ
ఈనాడు క్షేత్రస్థాయి పరిశీలన
ఈనాడు-అమరావతి, యంత్రాంగం
పాఠశాలలు మళ్లీ తెరిచారు. విద్యార్థులు వస్తున్నారు. కానీ ఇప్పటికీ కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో కేసులు వస్తున్నా, చాలాచోట్ల భౌతిక దూరం లాంటి నిబంధనలను పాటించడం లేదు. ఒక్కో గదిలో 20 మంది విద్యార్థులనే అనుమతించాల్సి ఉంటే.. కొన్నిచోట్ల 30 మంది ఉంటున్నారు. ఇక మధ్యాహ్న భోజనాలప్పుడు దూరం అసలు ఉండట్లేదు. మాస్కులున్నా, వాటిని ముక్కు కిందకే పెడుతున్నారు. గదుల శానిటైజేషన్ అంతంతగానే ఉంది. థర్మల్ స్క్రీనింగ్ సక్రమంగా సాగడం లేదు. శానిటైజర్లు, సబ్బులు, ఇతర సామగ్రి కొనుగోలుకు నిధులు లేక... ప్రధానోపాధ్యాయులు సొంత డబ్బులు వెచ్చిస్తున్నారు. అలా చేసి బిల్లులు పెడితే సకాలంలో విడుదల కావట్లేదని వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని పాఠశాలలను ‘ఈనాడు’ యంత్రాంగం పరిశీలించగా అనేకచోట్ల కరోనా నిబంధనలు పాటించట్లేదు.
ఏం చేయాలనే దానిపై అస్పష్టత..
బడిలో కరోనా కేసులు వస్తే ఏం చేయాలనే దానిపైనా ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో ఎవరైనా కరోనా బారిన పడితే బడిని శానిటైజ్ చేసి.. ఒకటి, రెండు రోజులు సెలవులు ఇచ్చి, మళ్లీ తెరుస్తున్నారు. కృష్ణాజిల్లా నిడమానూరు జిల్లాపరిషత్తు పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు కరోనా బారిన పడ్డారు. దీంతో అందరినీ పరీక్షించారు. ఈ పాఠశాలలో 6,7,8 తరగతులకు ఒక్క రోజు సెలవు ప్రకటించారు. 9,10 తరగతులను బడికి రావాలని సూచించారు. నందివాడ మండలం శంకరంపాడు ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. బడిలో 30మంది విద్యార్థులను పరీక్షిస్తే ఇద్దరికి పాజిటివ్గా తేలింది. రెండు రోజులు సెలవులు ప్రకటించారు. పాఠశాలల్లో కొందరికి కరోనా వచ్చినా, అక్కడి విద్యార్థులందరికీ పరీక్షలు చేయట్లేదు. కొద్దిమందికే చేసి వదిలేస్తున్నారు.
నిబంధనల అమలు ఎలా?
కొవిడ్-19 నిబంధనలు పాటించాలని ఆదేశించిన ఉన్నతాధికారులు ఇందుకోసం ప్రత్యేకసెల్ను ఏర్పాటుచేయలేదు. గతేడాది కరోనా కేసుల పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశారు. బడుల్లో ర్యాపిడ్ పరీక్షలు ఎలా జరుగుతున్నదీ పరిశీలించే పరిస్థితి ఉన్నత స్థాయిలో లేదు. ప్రధానోపాధ్యాయులే ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
* శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో తరగతి గదులు, ఉపాధ్యాయుల కొరత ఉండటంతో ఒక చోటే కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. రాజాం నియోజకవర్గంలో 15 పాఠశాలలకు 14 చోట్ల, ఇచ్ఛాపురంలో 26 బడులకు 21 చోట్ల విద్యార్థులు భౌతిక దూరం పాటించట్లేదు. టెక్కలి నియోజకవర్గంలో 24 బడులకు 2,034 మంది హాజరయ్యారు. వారిలో 1,200 మంది వరకు మాస్కు పెట్టుకోలేదు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో 14 పాఠశాలలను పరిశీలించగా 12 చోట్ల థర్మల్ స్క్రీనింగ్ చేయలేదు.
* విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం పరిధిలో అన్నీ కలిపి 555 వరకు పాఠశాలలు, గురుకులాలు, జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 20 వేల మంది చదువుకుంటున్నారు. కరోనా భయంతో 40% విద్యార్థులు బడులకు, వసతిగృహాలకు రావడం లేదు. పాడేరు నంబరు వన్ పాఠశాలలో 200కు పైగా విద్యార్థులు ఉండగా 50లోపే హాజరయ్యారు. తలారిసింగ్ ఆశ్రమ పాఠశాలలో 550 మందికిగాను శుక్రవారం 180 మంది ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు మాస్కులు సరిగా పెట్టుకోవడంలేదు. కొన్ని పాఠశాలల్లో థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు లేవు. భౌతిక దూరం అమలు కావడం లేదు.
* పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి ఉన్నత పాఠశాలలో భౌతిక దూరం కనిపించలేదు. తాళ్లపూడి పాఠశాలలో విద్యార్థులు మాస్కులు సక్రమంగా ధరించలేదు. మధ్యాహ్న భోజనం, విరామ సమయంలో విద్యార్థులు గుంపులు గుంపులుగా తిరుగుతూ కనిపించారు. ఈ జిల్లాలో ఇప్పటివరకూ 29 మంది విద్యార్థులు, 19మంది ఉపాధ్యాయులకు కరోనా సోకింది.
* కృష్ణాజిల్లాలో 100 పాఠశాలలను పరిశీలించగా.. విద్యార్థుల హాజరు 60% ఉంది. అందరి దగ్గరా మాస్కులు ఉన్నా సగం మంది కూడా పెట్టుకోవడం లేదు. 30% బడుల్లోనే థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. 80% పాఠశాలల్లో విద్యార్థులంతా ఒకేచోట కూర్చుని తింటున్నారు. కొన్నిచోట్ల విద్యార్థులే శానిటైజర్లు తెచ్చుకుంటున్నారు.
* నెల్లూరు వెంకటేశ్వరపురం పురపాలక ఉన్నత పాఠశాలలో 941 మంది విద్యార్థులు ఉండగా.. ఇక్కడ 17 గదులే ఉన్నాయి. తరగతి గదులు చాలక విద్యార్థులను గుంపులుగా కూర్చోబెడుతున్నారు. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయట్లేదు. ఎవరిలోనైనా కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే పరీక్షలకు వారి తల్లిదండ్రులతో పంపుతున్నారు. వైవీఎం నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు దగ్గరగా కూర్చుని భోజనాలు చేస్తున్నారు. తరగతి గదులు శానిటైజ్ చేయడం లేదు. మూలపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 598 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో తరగతి గదులు లేక.. చెట్లకిందపాఠాలు చెబుతున్నారు.
* కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో 55 మంది ఉండగా అందరికీ ఒకేసారి మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఆదోని నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో పదోతరగతిలో 367 మంది విద్యార్థులు ఉండగా అందర్నీ రోజూ బడికి రప్పిస్తున్నారు. శుక్రవారం ఒక గదిలో 93 మందిని కూర్చోబెట్టారు.
* అనంతపురం జిల్లాలో విద్యార్థుల హాజరు 79% ఉంది. తరగతిలో భౌతికదూరం లేదు. శానిటైజర్లు అందుబాటులో లేవు. విరామ సమయంలో విద్యార్థులు గుంపులుగా చేరుతున్నారు.
బడుల్లో ఇలా చేయాలి..
పాఠశాలల్లో కరోనా నిబంధనల అమలుకు పాఠశాలల పునఃప్రారంభ సమయంలో అధికారులు మార్గదర్శకాలు జారీచేశారు. వీటి అమలుపై పరిశీలన కొరవడింది. పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం బడుల్లో ఇవి పాటించాలి..
ఒక్కో తరగతిలో విద్యార్థుల సంఖ్య 20కి మించకూడదు. భౌతిక దూరం పాటిస్తూ, సరిపడా స్థలముంటే అన్ని తరగతులను ఒకేసారి నడపొచ్చు. గదుల కొరత ఉంటే రోజు విడిచి రోజు నిర్వహించాలి.
వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న పెద్దలతో ఉండే పిల్లల్ని తరగతులకు అనుమతించొద్దు. ఇలాంటివారిని ఇంటి వద్దనే ఉండాలని సూచించాలి.
విద్యార్థులు, సిబ్బందికి రోజూ థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలుంటే పరీక్షలకు పంపించాలి.
మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు దూరం పాటించాలి. పాఠశాల వదిలినప్పుడు గూమిగూడొద్దు.
అసెంబ్లీ, గ్రూపు పని, క్రీడలు నిర్వహించరాదు. పిల్లలను స్వచ్ఛందంగా పంపిస్తున్నట్లు తల్లిదండ్రుల నుంచి అనుమతి లేఖలు తీసుకోవాలి.
ప్రతివారం ఒక పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడికి పరీక్షలు నిర్వహించాలి. ఎవరికైనా పాజిటివ్ వస్తే మొత్తం అందరినీ పరీక్షించాలి.
విద్యార్థులు పరస్పరం వస్తువులు మార్చుకోవద్దు.
పాఠశాల బస్సుల్లోనూ సగం మందినే అనుమతించాలి. ఆటోలు, రిక్షాల్లో విద్యార్థులు రావద్దు. బస్సులు, వ్యాన్లు లేకుంటే తల్లిదండ్రులే తీసుకొచ్చి, తీసుకెళ్లాలి.
విజయనగరం జిల్లాలో 158 పాఠశాలలను పరిశీలించగా ఇందులో 103 బడుల్లో భౌతిక దూరం, 127 బడుల్లో థర్మల్ స్క్రీనింగ్ అమలు కావడం లేదు. మధ్యాహ్న భోజనం కోసం వరసలో తోసుకుంటూ నిలబడుతున్నారు. థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలను చాలాచోట్ల బీరువాలలోనే ఉంచారు.
గుంటూరు జిల్లా పెదకూరపాడులోని జడ్పీ హైస్కూల్లో 480 మంది విద్యార్థులు ఉండగా.. ఇక్కడ థర్మల్ స్క్రీనింగ్ చేయట్లేదు. 153 మంది పిల్లలు మాస్కులు ధరించకుండానే బడికి వచ్చారు. ప్రత్తిపాడు ప్రాథమిక పాఠశాలలో బెంచీకి ముగ్గురు, నలుగుర్ని కూర్చోబెడుతున్నారు. చేతులు కడుక్కునేందుకు సబ్బులూ లేవు.
చిత్తూరు జిల్లాలో థర్మల్ స్క్రీనింగ్ నామమాత్రంగా జరుగుతోంది. ప్రస్తుతం చాలాచోట్ల శానిటైజేషన్ నిలిపివేశారు. 50% బడుల్లో భౌతిక దూరం అమలు కావట్లేదు. చేతులు కడుక్కోవడానికి సబ్బు, నీరు, శానిటైజర్ కనిపించడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్