పింఛను పంపిణీ వివరాలు గోప్యం
జీవోలను ఆన్లైన్లో పెట్టే విధానానికి ఇప్పటికే స్వస్తి పలికిన ప్రభుత్వం తాజాగా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచకుండా గోప్యత పాటిస్తోంది. ఆన్లైన్లో ప్రజలకు తెలిసేలా ఉంచే విధానాన్ని ఆపేసింది. వైఎస్సార్ పింఛను
ఆన్లైన్లో ప్రజలకు కనిపించకుండా నిలిపివేత
అధికారులే చూసేలా మార్పు చేసిన ప్రభుత్వం
నిలిపివేసిన పింఛన్లు బహిర్గతం కాకూడదనే ఈ చర్యలని పలువురి విమర్శ
ఈనాడు డిజిటల్, అమరావతి: జీవోలను ఆన్లైన్లో పెట్టే విధానానికి ఇప్పటికే స్వస్తి పలికిన ప్రభుత్వం తాజాగా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచకుండా గోప్యత పాటిస్తోంది. ఆన్లైన్లో ప్రజలకు తెలిసేలా ఉంచే విధానాన్ని ఆపేసింది. వైఎస్సార్ పింఛను కానుక కింద ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీని చేపడుతోంది. ఆ రోజు పంపిణీ మొదలు రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల ద్వారా పింఛనుదారులకు లబ్ధి అందుతున్న తీరును వైఎస్సార్ పింఛను కానుక వెబ్సైట్లో నమోదు చేసేవారు. గంటకొకసారి వివరాలను అప్లోడ్ చేసేవారు. ఆగస్టు నెల వరకు ఈ విధానాన్ని పాటించారు. పింఛన్ల పంపిణీ వివరాలను ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులో ఉంచారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఆ విధానాన్ని నిలిపేసి సంబంధిత అధికారులు మాత్రమే లాగిన్ అయి వివరాలు చూసుకునేలా మార్పులు తీసుకొచ్చారు.
గత నెలలో పింఛన్ల పంపిణీ విధానంలో ప్రభుత్వం భారీగా మార్పులు చేసింది. ఒక బియ్యం కార్డుకు ఒకే పింఛను విధానాన్ని అమలు చేసింది. ఇతర ప్రాంతాల్లో ఉంటూ రెండు, మూడు నెలలకొకసారి వచ్చి పింఛను తీసుకునే వెసులుబాటును రద్దు చేసింది. ఏ నెల పింఛను ఆ నెలే తీసుకోవాలని స్పష్టం చేసింది. పోర్టబులిటీ విధానాన్ని ఆపేసింది. ఈకేవైసీ చేయించుకోని, హౌస్హోల్డ్ మ్యాపింగ్ కాని వారి పింఛన్లను నిలిపేసింది. ఈ ప్రభావం పింఛన్ల పంపిణీలో బహిర్గతమవుతుందనే ఆలోచనతోనే వివరాలు ఆన్లైన్లో ప్రజలకు కనిపించకుండా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అదనంగా మరో రోజు పంపిణీ...
గత నెల వరకు పింఛన్లను ఒకటో తేదీ మొదలు మూడు రోజులపాటు పంపిణీ చేస్తున్నారు. సెప్టెంబరు 1నుంచి దాన్ని మరో రెండు రోజులకు పొడిగించి 5 రోజులపాటు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో అర్హులకు పింఛను అందలేదన్న ఫిర్యాదులు రావడంతో 6న కూడా పంపిణీకి అనుమతిచ్చారు. సాంకేతిక కారణాల వల్ల నిలిచిన పింఛన్లను పంపిణీ చేయాలని ఆదేశాలు పంపారు. సెప్టెంబరు నెల పింఛను తీసుకోకపోతే అక్టోబర్ నెల పింఛనులో ఆ మొత్తం విడుదల కాదని ఆదేశాల్లో స్పష్టం చేశారు. సెప్టెంబరు 1వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకు 88.92% పంపిణీ చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 6వ తేదీ(సోమవారం) నాటికి 98% మందికి పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈకేవైసీ లేని కారణంగా పింఛన్లు నిలిచిపోయిన వారికి బుధవారం నుంచి నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించనుందని సెర్ప్ అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
రంగులు తొలగిస్తే ఊరుకోను
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్