ఆన్లైన్ టికెటింగ్తో ఆయనకేం సంబంధం?
ఆన్లైన్ టికెటింగ్ వ్యవహారంతో నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్కు ఏం సంబంధమని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, రవాణాశాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు
ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తోలు తీస్తారు
పవన్కల్యాణ్పై పేర్ని నాని ఆగ్రహం
టికెట్లు ఇష్టానుసారం పెంచితే ఊరుకోవాలా?: బొత్స
ఈనాడు డిజిటల్, అమరావతి: ఆన్లైన్ టికెటింగ్ వ్యవహారంతో నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్కు ఏం సంబంధమని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, రవాణాశాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ‘సామాన్యులకు పారదర్శకంగా, ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు సినిమా టికెట్లు అమ్మితే పవన్ గోలేంటి? రోజుకు నాలుగు షోలు వేయాలని చట్టం చెబుతుంటే ఇష్టమొచ్చినట్లు ప్రదర్శనలు వేస్తామంటారా..? ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తోలు తీస్తారు జాగ్రత్త’ అని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో మంత్రి విలేకర్లతో ఆదివారం మాట్లాడారు. ‘ప్రభుత్వం సినిమా టికెట్ల పోర్టల్ మాత్రమే నడుపుతుంది. థియేటర్ల యజమానులు ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తారు. ఒక రోజు కలెక్షన్లు.. తర్వాతి రోజు ఉదయమే రిజర్వుబ్యాంకు గేట్వే ద్వారా ఎవరి డబ్బులు వారికి వెళ్లిపోతాయి. ఈ వివరాలన్నీ పవన్ తెలుసుకున్నారా..?’ అని ప్రశ్నించారు.
దమ్ముంటే కేసీఆర్ను విమర్శించాలి: ‘ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేక సినిమా డబ్బుతో రుణం తెచ్చుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. వకీల్సాబ్ సినిమా నిర్మాతకు ఏపీలో వచ్చిన షేరు రూ.55 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందా..? ఎందుకిలా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు? నటుడు సాయితేజ్కు ప్రమాదం జరిగినప్పుడు తెలంగాణ పోలీసుల ఎఫ్ఐఆర్లోని విషయాన్నే మీడియా చెప్పింది. పవన్కు దమ్ముంటే తెలంగాణ పోలీసులు, సీఎం కేసీఆర్ను విమర్శించాలి. జగన్ అంటే లోకువా..?’ అని ప్రశ్నించారు. ‘ఇడుపులపాయ నేలమాళిగల్లో డబ్బులుంటే ప్రధాని, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లి అరెస్టు చేయించు. కోడికత్తి కేసును ఎన్ఐఏ విచారిస్తోంది. వెళ్లి అమిత్ షాను అడిగే దమ్ములేక సొల్లు కబుర్లు చెబుతున్నారు’ అని దుయ్యబట్టారు.
ఏపీలో 800 థియేటర్లలో ప్రదర్శనలు: ‘ఏపీలో 1100 వరకూ థియేటర్లు నడిచే స్థితిలో ఉన్నాయి. దాదాపు 800 హాళ్లలో ప్రదర్శనలు వేస్తున్నారు. లవ్స్టోరీ సినిమా మొదటిరోజు ఏపీలో నిర్మాతకు అన్ని ఖర్చులు పోనూ వచ్చిన షేరు రూ.3.80 కోట్లు. టికెట్ రేటు పెంచుకొని, నచ్చినన్ని షోలు వేసుకుంటే తెలంగాణలో రూ.3 కోట్లు వచ్చింది. రెండోరోజు ఏపీలో రూ.2.67 కోట్లు, తెలంగాణలో రూ.2.49 కోట్లు వచ్చింది. ఏపీలో సినీ పరిశ్రమను జగన్ ఎలా ఇబ్బంది పెట్టారో నిర్మాత సునీల్ నారంగ్ చెప్పాలి’ అని మంత్రి నాని పేర్కొన్నారు.
థియేటర్లు మూసేశామా: మంత్రి అనిల్
నెల్లూరు, న్యూస్టుడే: ప్రభుత్వానికి పవన్కల్యాణ్ అయినా.. సంపూర్ణేష్బాబు అయినా ఒకటేనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరులో విలేకర్లతో మాట్లాడారు. సిక్స్ ప్యాక్ చేసేందుకు సుధీర్బాబు, ప్రభాస్ ఒకేలా కష్టపడ్డారన్నారు. సినిమా థియేటర్లు ఏమైనా మూసేశామా అని ప్రశ్నించారు. టికెట్ ధర అందరు హీరోలకూ సమానంగా ఉండాలన్నారు. ఎక్కువ మంది అభిమానులు ఉన్నారని రూ.100 టికెట్ రూ.200 పెట్టి కొనాలని ఎవరైనా చెబుతారా.. దాన్ని అభిమానాన్ని క్యాష్ చేసుకోవడం అంటారన్నారు. రాష్ట్రంలో పవన్కల్యాణ్ పార్టీ చాప చుట్టేసే పరిస్థితి ఏర్పడిందన్నారు.
పవన్ క్షమాపణ చెప్పాలి: మంత్రి ముత్తంశెట్టి
విశాఖపట్నం, న్యూస్టుడే: ముఖ్యమంత్రిపై పవన్కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు డిమాండు చేశారు. ఆదివారం విశాఖలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబులా పవన్కల్యాణ్ కూడా రాష్ట్రానికి టూరిస్టులా వచ్చిపోతూ చౌకబారు విమర్శలు చేస్తున్నారన్నారు. సినీ పరిశ్రమకు సహకారం అందిస్తుంటే విమర్శలు చేయడం సరికాదన్నారు. విదేశాల్లో కాకుండా లంబసింగి, గండికోట, హార్స్లీ హిల్స్లో సినిమా షూటింగులు ఎందుకు చేయడం లేదన్నారు.
అనుచిత వ్యాఖ్యలు తగవు: మంత్రి వేణుగోపాలకృష్ణ
పిఠాపురం, న్యూస్టుడే: ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. తూర్పుగోదావరిజిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రాన్ని ఆదివారం సందర్శించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. పుస్తకాలు చదివానని, శాస్త్రీయ దృక్పథం ఉందని చెప్పుకొనే పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.
పవన్ రుషి పుంగవుడా: మంత్రి బొత్స
విజయనగరం, న్యూస్టుడే: వైకాపా నాయకులను సన్నాసులుగా సంబోధిస్తున్న పవన్కల్యాణ్ రుషి పుంగవుడా? అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ‘పవన్ పనికిమాలిన వాడు, పనికిమాలిన మాటలు మాట్లాడతాడు’ అని తామంటే ఏమైపోతాడో ఓసారి గుర్తుంచుకోవాలన్నారు. విజయనగరంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సినిమా టికెట్లను ఇష్టానుసారం రూ.500, రూ.1,000 చొప్పున అమ్ముకుంటామంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. వినోదం కోసం ప్రజలు సినిమాలకు వెళ్తారని, వారిని దోచుకుంటామంటే ఎలాగని అన్నారు. డిస్ట్రిబ్యూటర్లకు లేని బాధ పవన్కు ఎందుకని విమర్శించారు. చిత్ర పరిశ్రమలో ఏమైనా ఇబ్బందులుంటే చిరంజీవి, మోహన్బాబు వంటి పెద్దలు ప్రభుత్వంతో సంప్రదించవచ్చన్నారు. ఇది రిపబ్లిక్ ఇండియా కాబట్టే ఇష్టానుసారం ఉండటం కుదరదని చెప్పారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి ఇష్టమని, దీనిపై ఆయన నిర్ణయాన్ని అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM