శ్రీవారి సేవల్లో తప్పులు జరుగుతున్నాయన్న ఫిర్యాదుపైఏం చేశారు?
శ్రీవేంకటేశ్వర స్వామివారి నిత్యకైంకర్యాల్లో తప్పులు జరుగుతున్నాయంటూ ఓ భక్తుడు ఇచ్చిన వినతిపత్రంపై ఏం చర్యలు తీసుకున్నారో వారం రోజుల్లోగా చెప్పాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తితిదేను ఆదేశించింది.
వారం రోజుల్లో చెప్పండి తితిదేకు సీజేఐ ఆదేశం
ఈనాడు, దిల్లీ: శ్రీవేంకటేశ్వర స్వామివారి నిత్యకైంకర్యాల్లో తప్పులు జరుగుతున్నాయంటూ ఓ భక్తుడు ఇచ్చిన వినతిపత్రంపై ఏం చర్యలు తీసుకున్నారో వారం రోజుల్లోగా చెప్పాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తితిదేను ఆదేశించింది. ఈ అంశంపై తన పిటిషన్ను కొట్టేసిన ఏపీ హైకోర్టు తీర్పును సవాల్చేస్తూ శ్రీవారి దాదా అనే భక్తుడు దాఖలుచేసిన ఎస్ఎల్పీపై జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తాను వేంకటేశ్వరస్వామి భక్తుడినని, వైష్ణవ ఆలయాలపై పరిశోధనలు చేశానంటూ పిటిషనరే వ్యక్తిగతంగా వాదనలు వినిపించారు.
‘ఆలయంలో ఆగమశాస్త్ర విరుద్ధంగా చేస్తున్న నగ్నఅభిషేకాలు, అసంబద్ధమైన ఆర్జిత సేవలు, దర్శనాలను నిలువరించాలి. నా వాదనలను ఓపిగ్గా వినండి’ అని కోరారు. జస్టిస్ రమణ కల్పించుకుంటూ ‘మీరు బాలాజీ భక్తులే కదా. భక్తులకు ఓర్పు ఉండాలి. కానీ మీకది లేదు. ముందు మీరు మారాలి. తితిదే పవిత్రతను కాపాడాలన్న తాపత్రయం మాకూ ఉంది. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేసి, దాన్ని విచారణకు స్వీకరించాలంటూ రోజూ రిజిస్ట్రీని బ్లాక్మెయిల్ చేయడమేంటి? చనిపోతానంటూ బెదిరించడమేంటి? ఇందులో అంత అత్యవసరమేముంది? కైంకర్యాల విషయంలో ఏ చట్టం కింద కోర్టులు జోక్యం చేసుకోవచ్చు? మీ ఇష్టానుసారం చెప్పడానికి ఇదేమి కచేరీ కోర్టుకాదు. మీ హక్కులకు ఎక్కడ ఉల్లంఘన జరిగిందో చెప్పండి’ అని ప్రశ్నించారు. ప్రాథమిక హక్కులకు భంగం కల్గుతోందని పిటిషనర్ చెప్పగా ‘ఏ ప్రాథమిక హక్కో చెప్పండి. పూజ ఎలా చేయాలి, ఎంతమందిని అనుమతించాలన్నది ప్రాథమిక హక్కా?’ అని జస్టిస్ రమణ ప్రశ్నించారు.
తీసుకున్న చర్యలేంటో చెప్పండి
అనంతరం సీజేఐ తితిదే తరఫు న్యాయవాదిని పిలిచి పిటిషనర్ 2020 మార్చి 28న తితిదేకు ఇచ్చిన వినతిపత్రంపై మీరేం చర్య తీసుకున్నారో చెప్పండని ఆదేశించారు. వ్యాజ్యంలోని అంశాలపై న్యాయవాది అభ్యంతరం చెప్పబోగా.. ‘ప్రస్తుతానికి ఆ విషయాలు పక్కనపెట్టండి. అతని ఫిర్యాదుపై మీరు తీసుకున్న చర్యలేంటో చెప్పండి. నాతో సహా.. ధర్మాసనంలోని న్యాయమూర్తులిద్దరూ స్వామి భక్తులే. సంప్రదాయాల ప్రకారమే దేవస్థానం పూజాదికాలు కొనసాగిస్తుందని మేం ఆశిస్తాం’ అని పేర్కొన్నారు. అన్ని పూజలూ ఆగమశాస్త్రం ప్రకారమే చేస్తున్నారని తితిదే న్యాయవాది చెప్పగా.. తొలుత పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రంపై ఏం చర్య తీసుకున్నారో చెప్పండంటూ న్యాయమూర్తి మళ్లీ గుర్తుచేశారు. అందుకు వారం రోజుల గడువు కావాలని న్యాయవాది కోరగా, సీజేఐ అంగీకరించారు.
తెలుగులో సంభాషణ
పిటిషనర్ పేరు శ్రీవారి దాదా అని ఉండడంపై ‘మీ అసలు పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు?’ అని సీజేఐ ప్రశ్నించారు. తనది ప్రకాశం జిల్లా అని, తెలుగు వచ్చంటూ ఆయన బదులిచ్చారు. దీంతో సీజేఐ తెలుగులోనే మాట్లాడారు. తన పేరు ‘శ్రీవారి దాసాని దాసులు’ అని పిటిషనర్ చెప్పగా.. అలా చెప్పొచ్చు కదా, ఏదో ‘దాదా’లా చెబుతున్నారంటూ సీజేఐ సరదాగా వ్యాఖ్యానించారు. అధికారిక రిజిస్టర్లో తనపేరు శ్రీవారి దాదాగా ఉందని పిటిషనర్ విన్నవించారు. తర్వాత ధర్మాసనం ఈ కేసును వచ్చే వారానికి వాయిదా వేసేందుకు ఉత్తర్వులు ఇవ్వబోగా, పిటిషనర్ తన వాదనలను కొనసాగించే ప్రయత్నంచేశారు. ‘ఈ కేసు డిస్మిస్ చేయమంటారా? మీ ఫిర్యాదుపై తితిదే స్పందన తెలిపేందుకు వారం రోజులు ఆగలేరా?’ అంటూ జస్టిస్ రమణ ఆగ్రహించారు. అయినా పిటిషనర్ పదేపదే వివిధ అంశాలు ప్రస్తావించబోగా.. ‘తప్పుచేస్తే దేవుడు అందర్నీ శిక్షిస్తాడు. ఊరుకోడు. పూజలు ఎలా చేయాలన్నది తితిదే చూసుకుంటుంది. అవకాశం ఇచ్చాం కదా.. అని మీరు ఎక్కువ మాట్లాడొద్దు’ అని జస్టిస్ రమణ ఆగ్రహం వ్యక్తంచేస్తూ కేసును వచ్చే బుధవారానికి వాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు