బెయిల్ వచ్చినా బయటికి దారేది?
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్లో గత డిసెంబరులో సోనమ్మ(70) అనే మహిళ హత్యకు గురైంది. కుటుంబ కలహాలతో ఆమె కూతురు ఇందిర(50), మనమరాలు లక్ష్మి(30) ఈ హత్య చేశారని పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
జైళ్లలో నెలల తరబడిగా మగ్గుతున్న రిమాండ్ ఖైదీలు
పేదరికం, పట్టించుకునేవారు కరవై అవస్థలు
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్లో గత డిసెంబరులో సోనమ్మ(70) అనే మహిళ హత్యకు గురైంది. కుటుంబ కలహాలతో ఆమె కూతురు ఇందిర(50), మనమరాలు లక్ష్మి(30) ఈ హత్య చేశారని పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో నిందితులను కంది జైలుకు తరలించారు. తొమ్మిది నెలలుగా తల్లీకుమార్తెలిద్దరూ జైలులోనే ఉన్నారు. ఇలాంటి నేరాల్లో 3 నెలల తర్వాత బెయిల్ తీసుకునే అవకాశముంటుంది. వారిద్దరికీ న్యాయసేవాధికార సంస్థ సహకారంతో బెయిల్ మంజూరైనా పూచీకత్తులు సమర్పించే తాహతు లేక బయటకు రాలేకపోతున్నారు. ఇలాంటి ఖైదీలు రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉన్నారు. సాధారణ నేరాల్లో 60 రోజులు, తీవ్రమైన నేరాల్లో 90 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కింద జైలులో ఉన్న వారికి తప్పనిసరి(మాండేటరీ) బెయిల్ తీసుకోవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. బెయిల్ తీసుకునేందుకు న్యాయవాదిని సైతం సమకూర్చుకోలేని రిమాండ్ ఖైదీల కోసం జిల్లాలవారీగా న్యాయసేవాధికార సంస్థలు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలోని లీగల్ ఎయిడ్ అడ్వొకేట్ల సహకారంతో బెయిలొచ్చినా పలువురు జైళ్లలోనే మగ్గుతున్నారు.
ఒక పూచీకత్తయినా ఇవ్వలేక..
చాలా కేసుల్లో కుటుంబంలో సంపాదించే వ్యక్తి జైలుకు వెళితే వారి భార్యా, బిడ్డలు దిక్కుతోచని స్థితిలో ఉంటున్నారు. ఇలాంటి ఉదంతాల్లో లీగల్ ఎయిడ్ అడ్వొకేట్లు చొరవతీసుకుని.. న్యాయస్థానం దృష్టికి తీసుకెళితే రెండు పూచీకత్తులకు బదులు ఒకటే సమర్పించేందుకు అనుమతి లభిస్తోంది. ఆ ఒక్కటీ సమకూర్చలేని పరిస్థితిలో పలువురు ఉంటున్నారు. సాధారణంగా న్యాయస్థానం అడిగిన పూచీకత్తు సమర్పించేందుకు ఇంటి విలువను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కొందరైతే న్యాయస్థానం అడిగిన మొత్తాన్ని నగదు రూపంలోనే డిపాజిట్ చేసి ఆ పత్రాన్ని సమర్పిస్తున్నారు. నగదు సమకూర్చే స్తోమత లేనివారైతే సంబంధిత గ్రామ పంచాయతీ లేదా పురపాలిక సంస్థ నుంచి ఇంటిపన్ను రశీదుతోపాటు ఇంటి విలువను నిర్ధారించే పత్రాల్ని న్యాయస్థానంలో సమర్పిస్తున్నారు. అలాంటి స్థాయి కూడా లేనివారు జైళ్లలోనే ఉండిపోతున్నారు.
శిక్ష కన్నా ఎక్కువ కాలం జైళ్లలోనే..
నేరం రుజువైతే ఖరారయ్యే శిక్ష కన్నా ఎక్కువ కాలం పలువురు జైళ్లలోనే మగ్గిపోతున్న ఉదంతాలూ ఉంటున్నాయి. చిన్నపాటి చోరీ కేసు రుజువైతే ఆరు నెలల వరకు శిక్ష పడే అవకాశముంటుంది. అలాంటి కేసుల్లో జైలుకొచ్చిన కొందరు ఖైదీలూ అంతకంటే ఎక్కువ కాలమే నాలుగు గోడలకు పరిమితమవుతుండటం గమనార్హం. రైల్వే పోలీస్స్టేషన్ల పరిధిలో నేరాల్లో ఎక్కువగా ఈ తరహా ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి ఖైదీలు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నట్లు తెలుస్తోంది. కొందరైతే కుటుంబసభ్యులకూ తెలియకుండా జైళ్లలో మగ్గిపోతున్నారు.
నిందితులు బెయిల్పై బయటికి వచ్చాక న్యాయస్థానంలో కేసు వాయిదాలకు హాజరు కావాల్సి ఉంటుంది. మూడు వాయిదాలకు హాజరుకాకపోతే న్యాయస్థానం నాన్బెయిలబుల్ వారెంట్ జారీచేస్తుంది. అలాంటప్పుడు సదరు నిందితుడికి పూచీకత్తు ఇచ్చిన వ్యక్తులూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే పలువురు ఖైదీలకు పూచీకత్తు లభించడం లేదనే భావనా వ్యక్తమవుతోంది. అయితే ఏ ఆదరణ లేనివారికి పూచీకత్తు ఇచ్చే విషయంలో స్వచ్ఛంద సంస్థలైనా చొరవ తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు