PRC: పీఆర్సీ ఇవ్వాలన్న ఉద్దేశం ఉందా?
పీఆర్సీ నివేదికను బయటపెట్టేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందంటే ఏదో రహస్యం ఉందనే అనుమానం కలుగుతోందని ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస అమరావతి ...
నివేదిక ఇవ్వడానికి ఇంతలా అవమానిస్తారా..?
ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ల ధ్వజం
నేటి జేఎస్సీ సమావేశంలో స్పందనను బట్టి.. కార్యాచరణ
జీఏడీ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్తో సమావేశానికి వెళ్తున్న ఏపీజేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు
ఈనాడు డిజిటల్, అమరావతి: పీఆర్సీ నివేదికను బయటపెట్టేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందంటే ఏదో రహస్యం ఉందనే అనుమానం కలుగుతోందని ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. పీఆర్సీ త్వరగా ప్రకటించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే నివేదిక ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ‘ఉద్యోగసంఘాలకు నివేదిక ఇచ్చేందుకే ఇన్నిరకాలుగా ఇబ్బంది పెడితే ఎలా? దీనికోసం ఇంతలా అవమానిస్తారా? మేం రెండు నెలలుగా అడుగుతున్నా ఎందుకు దాచిపెడుతున్నారు? గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. నివేదికలోని సిఫార్సులను మేమూ అధ్యయనం చేయాలి కదా? శాఖల నుంచి ప్రస్తావించిన డిమాండ్లను అందులో చేర్చారో లేదో చూసుకోవాలి. దీనిపై అధికారులు ఎందుకు దాటవేస్తున్నారు?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, మరికొందరు ఐకాస నేతలు గురువారం సచివాలయంలో విలేకర్లతో మాట్లాడారు. అంతకుముందు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్తో సమావేశమైనట్లు వెల్లడించారు.
నేటి సమావేశంలో పీఆర్సీపైనే దృష్టి
‘పీఆర్సీ నివేదికలో ఉద్యోగులకు ఫిట్మెంట్.. వేతన స్కేలు ఎంత సిఫార్సు చేశారో తెలియకుండా ఆయా అంశాలపై ప్రభుత్వాన్ని మేం డిమాండు చేయలేం. కొన్ని శాఖల ఉద్యోగులకు అన్యాయం జరిగితే.. ప్రత్యామ్నాయంగా మరో కమిటీని నియమిస్తారు. ఇవన్నీ జరగాలంటే నివేదికను బయటపెట్టాలి. ఈ విషయంలో సీఎం జోక్యం చేసుకోవాలి. అక్టోబరు 29న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అనంతరం పీఆర్సీ నివేదిక తప్పనిసరిగా ఇస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారు. తర్వాత నవంబరు 8న, అనంతరం 10న ఇస్తామని చెప్పారు. శుక్రవారం నిర్వహించే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పీఆర్సీ అంశంపైనే దృష్టిసారిస్తాం. అధికారులనుంచి వచ్చే సమాధానాన్ని బట్టి.. ఇరు ఐకాసలు సమావేశమై కార్యాచరణ వెల్లడిస్తాం’ అని స్పష్టం చేశారు.
తప్పుదారి పట్టిస్తారా..?
రెండు ఐకాసల నేతలు అధికారుల ముందు ఒకలా.. బయట మరోలా మాట్లాడుతున్నారని సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి విమర్శించారని విలేకర్లు ప్రశ్నించగా.. ‘రెండు పెద్ద ఐకాసలు పీఆర్సీ కోసం పోరాడుతుంటే పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వెంకట్రామిరెడ్డికి ఏదో ప్రయోజనం ఉండటం వల్లే అలా మాట్లాడుతున్నారు. దాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తాం. పీఆర్సీ ఏడాదిన్నర ఆలస్యమైంది. ఏడు డీఏలు ఇవ్వాలి. మా లక్ష్యం పీఆర్సీ, ఉద్యోగుల సమస్యలపై పోరాడటమే. భేషజాలు పక్కనపెట్టి ఐక్య పోరాటాలు చేయాలనే కలిశాం. ఉద్యోగుల సేవకు పోటీ పడాలే గానీ తప్పుదోవ పట్టించొద్దు. పదవులు మేం కోరుకుంటాం. అవి ఇవ్వడం ప్రభుత్వం ఇష్టం. పీఆర్సీ ఇస్తే ఐకాసల్లోని ఉద్యోగులకే కాదు.. వెంకట్రామిరెడ్డికీ లబ్ధి చేకూరుతుంది’ అని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!