Chandrababu: క్లెమోర్మైన్స్ పేలుళ్లకూ చలించని నేత
మావోయిస్టులు క్లెమోర్ మైన్స్తో దాడిచేసినా మనిషి చలించలేదు. ధైర్యం చేజారనివ్వలేదు...! మనసులో ఎన్ని బడబాగ్నులు రగులుతున్నా గంభీరంగా ఉండటమే ఆయనకు తెలుసు.
అవమానభారంతో కన్నీరు మున్నీరైన వేళ
ఈనాడు, అమరావతి: మావోయిస్టులు క్లెమోర్ మైన్స్తో దాడిచేసినా మనిషి చలించలేదు. ధైర్యం చేజారనివ్వలేదు...! మనసులో ఎన్ని బడబాగ్నులు రగులుతున్నా గంభీరంగా ఉండటమే ఆయనకు తెలుసు. ఎన్ని సంక్షోభాలు ఎదురైనా ఆయన కన్నీరు పెట్టడం సహచరులెవరూ చూడలేదు. శుక్రవారం శాసనసభలో జరిగిన అవమానంతో చలించిపోయి తెదేపా అధినేత చంద్రబాబు రోదించారు. శాసనసభ ఆయనకు కొత్తకాదు. సభలో ఆవేశకావేశాలు, రాజకీయ విమర్శలు, ఉద్విగ్న, ఉద్రిక్త పరిస్థితులూ కొత్తకాదు. చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్రెడ్డి, నేదురుమల్లి జనార్దన్రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి ఎందరో నాయకులతో ఢీ అంటే ఢీ అన్నారు. దీటుగా నిలబడ్డారు. కానీ నిండుసభలో... వైకాపా ఎమ్మెల్యేలు తన భార్యపై వ్యక్తిత్వ హననానికి పాల్పడం, ఆమెను కించపరిచేలా అత్యంత అవమానకరంగా, అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. తీవ్రంగా కుంగిపోయారు.
కట్టలు తెగిన ఆవేదన
అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలపై సభలో వాగ్వాదం జరిగాక స్పీకర్ సభను వాయిదా వేయడంతో చంద్రబాబు తన ఛాంబర్లోకి వచ్చి కూర్చున్నారు. ఆప్పటికే ఆయన ముఖం అవమానభారంతో ఎరుపెక్కింది. అప్పటికీ ఉబికివస్తున్న దుఃఖాన్ని నియంత్రించుకోవడానికి చాలా ప్రయత్నించారు. కాసేపు యాంటీరూమ్లోకి వెళ్లి వచ్చారు. చంద్రబాబును చూస్తూనే శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు... ఆయన కాళ్లకు నమస్కరించి, కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ సహచరుల్ని చూశాక చంద్రబాబు అంతరంగంలో సుడులు తిరుగుతున్న బాధ ఆగలేదు. వారి ముందే భోరున విలపించారు. అంత అవమానం జరిగాక... ఇక సభలోకి అడుగు పెట్టకూడదన్న నిర్ణయం తీసుకున్నారు. సభలోనే తన ఆవేదన వెల్లడించి... బయటకు వచ్చేయాలన్న ఉద్దేశంతో మళ్లీ సభలోకి వెళ్లారు. స్పీకర్ మైక్ ఇచ్చారు. చంద్రబాబు తన ఆవేదన తెలియజేస్తున్నా... అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు పూర్తిగా మాట్లాడక ముందే... స్పీకర్ మైక్ కట్ చేయడంతో, ఆయన తీవ్ర ఆవేదనతో సభ నుంచి బయటకు వచ్చేశారు. అక్కడి నుంచి అవమానభారంతో నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక పదేపదే భోరున విలపించారు.
చెక్కుచెదరని ధైర్యం చలించిన వేళ..
దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి... పిన్న వయసులోనే మంత్రిగా, నాలుగు పదుల వయసులోనే ముఖ్యమంత్రిగా పనిచేసి, కేంద్ర రాజకీయాల్లోనూ క్రియాశీలంగా వ్యవహరించిన నేపథ్యం చంద్రబాబుది. ఆ ప్రస్థానంలో ఆయన అనేక ఎదురుదెబ్బలూ తిన్నారు. అయినా ఎప్పుడూ చలించలేదు. 1983లో చంద్రగిరిలో ఓడిపోవడం ఆయనకు రాజకీయంగా తగిలిన మొదటి ఎదురుదెబ్బ. తర్వాత అనేక ఆటుపోట్లు వస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. 1989లో పార్టీ ఓడిపోయినా... డీలా పడకుండా, మళ్లీ పార్టీని అధికారంలోకి తెచ్చేవరకూ అవిశ్రాంత పోరాటం చేశారు. 2004, 2009 ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురైనప్పుడూ పోరాటం ఆపలేదు. ఆరు పదుల వయసులోనూ సుదీర్ఘ పాదయాత్ర చేసి... పార్టీని అధికారంలోకి తెచ్చారు. 2003లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... తిరుపతిలో అలిపిరి వద్ద మావోయిస్టులు క్లెమోర్మైన్స్ పేల్చినప్పుడు తీవ్రంగా గాయపడ్డా ఆయన భయపడలేదు. కంటి నుంచి చుక్క నీరు రాలేదు. 2019 ఎన్నికల్లో పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితమైనప్పుడూ ఆయన కుంగిపోలేదు. వెంటనే తేరుకుని మళ్లీ పోరాటం ప్రారంభించారు. ప్రభుత్వ నిర్బంధాల్ని, ఆంక్షల్ని, పార్టీ నాయకులపై పెడుతున్న కేసుల్ని, కార్యకర్తలపై వేధింపుల్ని తట్టుకుని నిలబడ్డారు. చివరకు పార్టీ కేంద్ర కార్యాలయంపై ప్రత్యర్థులు దాడికి పాల్పడినా చలించలేదు. అలాంటి నాయకుడు... శాసనసభలో జరిగిన అవమానంతో పొగిలి పొగిలి ఏడవడంతో ఆయన సహచరులు, పార్టీ నాయకులు చలించిపోయారు.
పార్టీ కార్యాలయంలో ఉద్విగ్న వాతావరణం
విలేకరుల సమావేశంలో చంద్రబాబు విలపించడాన్ని టీవీల్లో చూసి తీవ్ర ఆవేదనతో పార్టీ నాయకులు, కార్యకర్తలు హుటాహుటిన తెదేపా కేంద్ర కార్యాలయానికి తరలివచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పార్టీ నాయకులు కేశినేని నాని, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, బోడే ప్రసాద్, నక్కా ఆనంద్బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాస్ తదితరులు పార్టీ కార్యాలయానికి చేరుకుని అధినేతతో సమావేశమయ్యారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై... కార్యకర్తలు నిరసన తెలియజేశారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఆధ్వర్యంలో... వైకాపా జెండాలు, ఆ పార్టీ నాయకుల చిత్రాలను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?