Justice NV Ramana: పాలకులకు అవలక్షణాలు ఉండకూడదు
‘అధికారంలోకి వచ్చిన రాజుకు 14 అవలక్షణాలు వస్తాయని పురాణాలు చెబుతున్నారు. వాటిని దరిచేరనీయకుండా రాజు జనరంజక పాలన సాగించాలి’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ....
పురాణాలు చెప్పిన రాజధర్మం ఇదే...
బలహీనుల రక్షణకే చట్టాల అమలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ
సత్యసాయి సమాధిపై పూలమాల వేస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు, సత్యసాయి ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ తదితరులు
ఈనాడు డిజిటల్, అనంతపురం, న్యూస్టుడే, పుట్టపర్తి: ‘అధికారంలోకి వచ్చిన రాజుకు 14 అవలక్షణాలు వస్తాయని పురాణాలు చెబుతున్నారు. వాటిని దరిచేరనీయకుండా రాజు జనరంజక పాలన సాగించాలి’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సోమవారం నిర్వహించిన సత్యసాయి విశ్వవిద్యాలయం 40వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ... ‘పాలకులకు ఆగ్రహం, దురుసుతనం, విజ్ఞులమాట వినకపోవడం, దుష్టులైన మిత్రుల సలహాలను స్వీకరించడం, అనాలోచిత నిర్ణయాలను అమలు చేయడం వంటి లక్షణాలు ఉండకూడదు. నేటి పాలకులు ఆయా లక్షణాలు తమలో ఉన్నాయో లేదో పరీక్షించుకోవాలి. వాటిని తొలగించుకుని ప్రజలకు న్యాయమైన పాలన అందించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు... పాలకులు తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజాప్రయోజనం కోసమే అయి ఉండాలి. రామాయణ, మహాభారతాల్లో నేటి సమకాలీన సమాజానికి అవసరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. రామాయణంలో తనను కలవడానికి వచ్చిన భరతుడితో రాముడు మాట్లాడుతూ... పెద్దలను గౌరవిస్తున్నావా? ప్రజలను బాగా చూసుకుంటున్నావా? మహిళలు, బాలలు, బలహీనులకు రక్షణ కల్పిస్తున్నావా? అని ప్రశ్నిస్తాడు. మహాభారతంలోనూ... ధర్మరాజుతో నారదముని మధ్య ఇలాంటి సంభాషణే జరిగింది’ అని ఆయన గుర్తుచేశారు.
స్నాతకోత్సవంలో ప్రసంగిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ
రాజధర్మం పాటించాలి..
చట్టాలను బలహీనుల రక్షణ కోసమే అమలు చేయాలని... దీన్నే పురాణాల్లో రాజధర్మంగా పేర్కొన్నారని జస్టిస్ రమణ అన్నారు. ‘విద్య అంటే అకడమిక్ లెర్నింగ్ మాత్రమే కాదు. విద్యార్థి జీవితంలో సానుకూల మార్పు, ఉన్నతికి చదువు దోహదపడాలి. సత్యసాయి విద్యాసంస్థలు విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యనందించడంలో ముందున్నారు. ప్రాపంచిక, ఆధ్యాత్మిక అభ్యాసాలను పిల్లలకు అందించాలని బాబా కోరుకున్నారు. దానికి అనుగుణంగానే సత్యసాయి విద్యాసంస్థలు మహోన్నత స్థానానికి చేరుకున్నాం. నైతిక విలువలు, మానవత్వం, క్రమశిక్షణ, నిస్వార్థం, కరుణ, ఓరిమి, క్షమాగుణాలను అలవర్చుకోవడమే అసలైన విద్య. సొంత బలాన్ని ఎప్పుడూ సందేహించవద్దు... మీ నైపుణ్యాలతో ప్రపంచాన్ని మార్చగలరు’ అని విద్యార్థులకు ఉపదేశించారు. ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు.
బాబా బోధనల్లో విశ్వజనీన ప్రేమ
సమాజానికి ప్రేమను పంచాల్సిన అవసరముందని, మనుషులతోపాటు జంతువులు, ప్రకృతిని కూడా ప్రేమించాలని... అదే విశ్వజనీన ప్రేమ అన్న సత్యసాయి బోధనలను జస్టిస్ ఎన్.వి. రమణ తన ప్రసంగంలో ఉటంకించారు. బాబాకు పిల్లలంటే అమిత ఇష్టమని... ఆ ప్రేమలో నుంచే ఈ విశ్వవిద్యాలయం పుట్టుకొచ్చిందన్నారు. ‘ప్రపంచ శాంతి, భద్రతలకు విద్యార్థులే వేర్లు కావాలి. ఆ వేర్లలకు నీరు పోయడమే నాపని. నేను అన్ని విధాలా విద్యార్థులకు అంకితం. నాకు వారిపై ప్రగాఢ విశ్వాసముంది. నాకున్న ఏకైక ఆస్తి నా పిల్లలే’ అని బాబా విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను జస్టిస్ ఎన్.వి. రమణ తన ప్రసంగంలో పేర్కొన్నారు. బాబా మాతృమూర్తిని, మాతృప్రాంతాన్ని ఎంత ప్రేమించారో మాతృభాషకూ అంతే ప్రాధాన్యమిచ్చారన్నారు. కార్యక్రమంలో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతూరాజ్ అవస్థీ, అనంతపురం జిల్లా ఇన్ఛార్జి జడ్జి రమేష్, సత్యసాయి ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్, విశ్వవిద్యాలయం కులపతి చక్రవర్తి, ఉపకులపతి సంజీవి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం