Chandrababu: ఇది మానవ వైఫల్యంతో తలెత్తిన విపత్తు
తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని, వరద వస్తుందని తెలిసినా ప్రభుత్వం మొద్దునిద్ర వీడలేదని, ఫలితంగా అన్నమయ్య జలాశయం కట్ట తెగిపోయి ప్రాణ, ఆస్తినష్టం సంభవించిందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు.
తుపాను వస్తుందని తెలిసినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు
కడప జిల్లా రాజంపేటలో బాధితులకు పరామర్శ
నిర్వాసితులకు అండగా ఉంటానని హామీ
రాజధాని, శాసనమండలి రద్దుపై జగన్ మాట తప్పారు, మడమ తిప్పారని విమర్శ
రాజంపేట మండలం మందపల్లెలో వరద నీటిలో 9 మంది కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న ఆలయ పూజారిని ఓదార్చుతున్న చంద్రబాబు
రాజంపేట, న్యూస్టుడే: తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని, వరద వస్తుందని తెలిసినా ప్రభుత్వం మొద్దునిద్ర వీడలేదని, ఫలితంగా అన్నమయ్య జలాశయం కట్ట తెగిపోయి ప్రాణ, ఆస్తినష్టం సంభవించిందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. కట్ట తెగుతుందన్న ముందస్తు సమాచారాన్ని ప్రజలకు చెప్పకుండా అధికారులు ఘోర తప్పిదం చేశారన్నారు. కడప జిల్లా రాజంపేట మండలంలో అన్నమయ్య జలాశయం కట్ట తెగిపోవడంతో ముంపు బారినపడ్డ మందపల్లి, పులపుత్తూరు గ్రామాలను మంగళవారం ఆయన పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘గతేడాదే పింఛ కట్ట తెగింది. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు పనిచేయలేదు. అయినా వాటికి మరమ్మతులు చేయించలేదు. కింద ఇసుక, టిప్పర్లు ఉన్నాయన్న మీ స్వార్థ రాజకీయాలు, ఆదాయం కోసం ప్రజల జీవితాలను నాశనం చేస్తారా? నష్టపోయిన వెయ్యి కుటుంబాలను ఆదుకోలేని నువ్వూ.. ఓ ముఖ్యమంత్రివేనా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఎన్నో తుపానులు చూశాను. వాటిని ఆపలేకపోయినా.. తీవ్రతను గుర్తించి నష్టాన్ని నివారించాం. ప్రాణనష్టం జరగకుండా కాపాడాను. రాత్రింబవళ్లు పనిచేయించి ప్రజల కన్నీళ్లు తుడిచాను. అలా చేసి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాద’ని పేర్కొన్నారు. ‘అన్నమయ్య జలాశయం గేట్లను పటిష్ఠం చేయాలి. చెయ్యేరు నీరు గ్రామాల్లోకి రాకుండా కాంక్రీటుతో రక్షణ గోడలు నిర్మించాలి. అప్పటిదాకా మీకు అండగా ఉంటాన’ని హామీ ఇచ్చారు. ‘విశాఖలో గతేడాది ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం జరిగినప్పుడు సీఎం వెళ్లి ఒక్కో కుటుంబానికి రూ.కోటి ఇస్తానని ప్రకటించారు. ఇప్పుడీ వరద విపత్తు మీ వైఫల్యం వల్లే కదా? ఇక్కడ రూ.5 లక్షలు ఇవ్వడమేంటి? మేం అధికారంలోకి వచ్చాక మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇస్తాం. తక్షణ సాయంగా మృతుల కుటుంబానికి రూ.లక్ష, నష్టపోయిన కుటుంబానికి రూ.5 వేలు చొప్పున అందజేస్తామ’ని ప్రకటించారు.
* మీకు జరిగిన నష్టం.. మీరు పడుతున్న బాధలు నన్ను కదిలించాయి. నేను ఎన్నో విపత్తులను చూశాను. కానీ వాటికీ, ఈ విపత్తుకూ చాలా తేడా ఉంది. ఇది మనుషుల వైఫల్యం వల్ల జరిగిన ఘోరం. ప్రాణ, ఆస్తినష్టం జరిగి ప్రజలు గగ్గోలు పెడుతుంటే సీఎం హెలికాప్టర్లో తిరిగిపోవడం ఏమిటి? అధికారంలో లేనప్పుడు ఊరూరా భూమి మీద తిరిగారు. ఇప్పుడు ఆకాశంలో గిరగిరా తిరిగి వెళ్లారు.
* నాడు శాసనమండలిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం.. నేడు మళ్లీ పునరిద్ధరిస్తానని చెప్పారు. రాజధాని అమరావతి విషయంలోనూ ఏదో మెలికపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాట తప్పను, మడమ తిప్పనని చెప్పే జగన్.. అన్ని విషయాల్లో మాట తప్పుతున్నారు. మడమ తిప్పుతున్నారు. అమరావతే రాజధాని అనే వరకూ పోరాడతాను.
-కడప జిల్లా రాజంపేటలో వరద బాధితులను పరామర్శించిన సందర్భంగా తెదేపా అధినేతనారా చంద్రబాబునాయుడి వ్యాఖ్యలు
రాజంపేట పట్టణంలో ప్రసంగిస్తున్న చంద్రబాబు
ఆడవారినంటే.. ఊరుకుంటారా?
‘అసెంబ్లీలో వైకాపా నేతలు దారుణంగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి అయ్యేవరకు అసెంబ్లీలో అడుగుపెట్టన’ని చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. బాధితులను పరామర్శించిన తర్వాత రాత్రి రాజంపేట పాత బస్టాండు బైపాస్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద అభిమానులనుద్దేశించి మాట్లాడారు. వరద బాధితులను పరామర్శించడానికి వచ్చినందున రాజకీయాలు మాట్లాడనని చెప్పారు. ఆడవారిని అవమానపరిస్తే ఎవరైనా ఊరుకుంటారా? అందుకే బాధేసి సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశానని చెప్పారు. అంతకుముందు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు కడప విమానాశ్రయానికి భారీగా తరలివచ్చారు. తెలుగు యువత నాయకులు గజమాలతో స్వాగతించారు. ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఫరూక్ తదితరులతో విమానాశ్రయం వీఐపీ లాంజ్లో చంద్రబాబు కొద్దిసేపు భేటీ అయ్యి.. వరద ప్రభావంపై సమీక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!