పార్టీల మధ్య శత్రుత్వం వద్దు
ఈనాడు, దిల్లీ: ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు సర్వోన్నత శిఖరం. దీని గౌరవాన్ని కాపాడటంలో అధికార, విపక్ష సభ్యులందరికీ బాధ్యత ఉంటుంది. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు
చట్టసభల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిదీ
ఎంపీలకు రాష్ట్రపతి కోవింద్ హితవు
కుటుంబ పార్టీలతో ప్రజాస్వామ్యానికి ముప్పు
ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక
పార్లమెంటు సెంట్రల్ హాలులో భారత రాజ్యాంగ దినోత్సవం
కాంగ్రెస్ సహా 15 విపక్ష పార్టీల గైర్హాజరు
ఈనాడు, దిల్లీ: ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు సర్వోన్నత శిఖరం. దీని గౌరవాన్ని కాపాడటంలో అధికార, విపక్ష సభ్యులందరికీ బాధ్యత ఉంటుంది. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ప్రజాప్రతినిధులందరూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి. ఆలోచనా ధోరణుల్లో ఉండే విభేదాలు ప్రజాసేవకు అడ్డంకిగా మారేంత పెద్దవిగా ఉండకూడదు’ అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీల మధ్య స్పర్ధను పోటీగా భావించాలే గాని వైరి భావంతో చూడొద్దని హితవు పలికారు.
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్లమెంటు సెంట్రల్హాలులో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగ రాత ప్రతి డిజిటల్ వెర్షన్ను విడుదల చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు బీజేడీ, వైకాపా, తెరాస, బీఎస్పీ, తెలుగుదేశం ఎంపీలు హాజరయ్యారు. కాంగ్రెస్, వామపక్షాలు సహా 15 విపక్ష పార్టీల ఎంపీలు గైర్హాజరయ్యారు. ‘భారత రాజ్యాంగం దేశ ప్రజల సామూహిక అభివ్యక్తీకరణ ప్రతిరూపం’ అని రాష్ట్రపతి తెలిపారు. ప్రపంచంలో ఏ రాజ్యాంగమూ చేయలేని విధంగా మన రాజ్యాంగ నిర్మాతలు మొదటి నుంచే వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించారని తెలిపారు. ఇంగ్లండ్, అమెరికా లాంటి దేశాల్లో సుదీర్ఘకాల సంఘర్షణ తర్వాతే మహిళలకు ఓటు హక్కు లభించిందని గుర్తుచేశారు. రాజ్యాంగ నిర్మాణంలో జాతిపితలే (ఫౌండింగ్ ఫాదర్స్) కాకుండా జాతిమాతృమూర్తులు (ఫౌండింగ్ మదర్స్)లు కూడా పాలుపంచుకున్నారని ప్రశంసించారు.
చట్టసభ సభ్యులు ఓర్పుతో ఉండాలి
- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
పార్లమెంటు సభ్యులు చట్టసభల్లో సంభాషణ, చర్చ అన్న సిద్ధాంతానికి కట్టుబడి వ్యవహరించాలే తప్ప నిరంతర ఆందోళనలతో సభాకార్యకలాపాలను అడ్డుకోకూడదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హితవుపలికారు. రాజ్యసభ ఉత్పాదకత క్రమంగా తగ్గుముఖం పడుతుండటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలు మద్దతు ఇచ్చినట్లేనని, అందువల్ల చట్టసభ సభ్యులందరూ ఆ ప్రజాభిప్రాయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఓర్పుతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
అవినీతిపరులను ప్రోత్సహించవద్దు
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
‘అవినీతి పరులకు అండగా నిలవడమంటే కొత్తతరాన్ని దోపిడీ దారిలో వెళ్లమని ప్రోత్సహించడమే అవుతుంది. మన రాజ్యాంగంలో అవినీతికి తావులేదు. అలాంటి వారితో సన్నిహితంగా తిరిగితే అవినీతి చేయడం తప్పేమీ కాదన్న భావనను యువతరానికి కల్పించిన వాళ్లం అవుతాం’ అని ప్రధాని మోదీ హెచ్చరించారు. అవినీతి కేసుల్లో న్యాయస్థానాలు శిక్ష విధించిన తర్వాత కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వారిని మహిమాన్వితులుగా భావిస్తూపోతే ఈ దేశ యువత మనసుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇలాంటి పార్టీలు రాజ్యాంగ ఆదర్శాలకు పూర్తి విరుద్ధమని తెలిపారు.
భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అభివృద్ధికి అవరోధం
సుప్రీంకోర్టు నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలోనూ ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘ప్యారిస్ ఒప్పందానికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నది మన దేశం మాత్రమే. అయినప్పటికీ పర్యావరణం పేరుతో మనపై వివిధ రకాల ఒత్తిళ్లు తెస్తున్నారు. ఇదంతా వలస పాలన మనస్తత్వ ఫలితమే’’నని తెలిపారు. దురదృష్టవశాత్తు ఇటువంటి ఆలోచనా ధోరణులతో మన దేశంలోనూ అభివృద్ధికి అవరోధాలు సృష్టిస్తున్నారు. కొన్నిసార్లు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో, మరోసారి ఇంకో పేరుతో ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. ఇటువంటి అడ్డంకులను తొలగించుకోవడానికి రాజ్యాంగం బలమైన సాధనమని పేర్కొన్నారు.
విపక్షాల బహిష్కరణ బాధాకరం: ఓం బిర్లా
పార్లమెంటులో జరిగే చర్చల నుంచి పుట్టుకొచ్చే అమృతం సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. లోక్సభ సచివాలయం ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించడం బాధాకరమని తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్జోషీ, రాజ్యసభ సభాపక్ష నేత పీయూష్ గోయల్, పార్లమెంటు ఉభయసభల సభ్యులు పాల్గొన్నారు. కాంగ్రెస్, ఎస్పీ, ఆప్, సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, శిరోమణి అకాలీదళ్, టీఎంసీ, ఆర్జేడీ సహా 15 పార్టీల సభ్యులు గైర్హాజరయ్యారు. రాజ్యాంగ మౌలిక నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు నిరంకుశ విధానాలను అనుసరిస్తున్న భాజపా ప్రభుత్వ తీరుకు నిరసనగానే కార్యక్రమాన్ని బహిష్కరించినట్లు కాంగ్రెస్ తెలిపింది.
అధికార, విపక్ష సభ్యుల మధ్య స్పర్ధలు సహజం. ఆ స్పర్ధలు ప్రజలకు, ప్రజాస్వామ్యానికి మరింత మేలు జరగడానికి ఉపయోగపడాలి. అప్పుడే దాన్ని ఆరోగ్యకరమైన పోటీగా భావించగలం. పార్లమెంటులో ప్రతి స్పర్ధనూ వైరి భావంతో చూడకూడదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు దేవాలయం వంటిది. ప్రతి సభ్యుడూ పూజ గదిలో ఎంత భక్తి,శ్రద్ధలతో ఉంటారో అలాగే పార్లమెంటులోనూ వ్యవహరించాలి. ప్రభావశీలమైన ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది.
- రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు కుటుంబ పార్టీలు పెరిగిపోతుండటం ఆందోళనకరం. కొన్ని పార్టీలు కుటుంబం కోసం, కుటుంబం చేత, కుటుంబం ద్వారా నడుస్తున్నాయి. ఒక కుటుంబం నుంచి ఒకరికి మించి ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావొద్దని చెప్పడంలేదు. యోగ్యత ఆధారంగా, ప్రజల ఆశీర్వాదంతో ఓ కుటుంబం నుంచి ఎంత మందైనా రాజకీయాల్లోకి రావొచ్చు. దానివల్ల పార్టీ కుటుంబ పార్టీగా మారదు. కానీ ఒక పార్టీని తరతరాలుగా ఒకే కుటుంబం నడుపుతూ ఉంటే పార్టీ వ్యవస్థ మొత్తం వారి చేతుల్లోకి వెళ్తుంది. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి అది అవరోధంగా నిలుస్తుంది.
- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్