Chandrababu: జగన్ రైతు వ్యతిరేక విధానాలపై లోక్సభలో పోరాడండి
దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో 93 శాతం కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. వరదలను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. జాతీయ విపత్తుగా ప్రకటించి వరద బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.
తెదేపా ఎంపీలకు చంద్రబాబు సూచన
ఈనాడు డిజిటల్ - అమరావతి
దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో 93 శాతం కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. వరదలను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. జాతీయ విపత్తుగా ప్రకటించి వరద బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. శనివారం ఇక్కడ జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తెదేపా ఎంపీలతో చంద్రబాబు మాట్లాడారు. ‘కౌలురైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానం, రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో రాష్ట్రం నిలవడం జగన్ రైతు వ్యతిరేక చర్యలకు అద్దం పడుతోంది. ఈ అంశాలపై లోక్సభలో పోరాటం చేయాలి’ అని సూచించారు. సమావేశంలో తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, పార్టీ జాతీయ రాజకీయ కార్యదర్శి టీడీ జనార్దన్, జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంట్లో చర్చకు పట్టుబట్టాలని ప్రస్తావించిన అంశాలివీ..
*అత్యధికంగా ఏపీలో ఇంధన ధరలు, జగన్ ప్రభుత్వ పన్నులు, ధరల పెరుగుదల, ప్రత్యేక హోదా, మూడు రాజధానుల బిల్లు
* ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాల సరఫరా
* విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ
* కరోనా వ్యాక్సినేషన్లో ఏపీ వెనుకంజ
* వరి వేయొద్దని మంత్రులు ప్రకటించడం
* వైఎస్ వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ, అడ్వాన్సుగా రూ.కోటి చెల్లింపుపై ఈడీ విచారణ
* పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్రప్రభుత్వం దుర్వినియోగం చేయడం
* బీసీలకు కేటాయించిన నిధులు, విధులు ఇవ్వకుండా కంటితుడుపు చర్యగా అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం బీసీ జనగణనపై చేసిన తీర్మానం
* వర్సిటీల వీసీలు, ఈసీ మెంబర్లు, సెర్చ్ కమిటీల నియామకంలో బీసీలకు జరిగిన అన్యాయం
* స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలపై వైకాపా నేతల దాడులు, ఏకపక్షంగా నామినేషన్ల తిరస్కరణ, ఫలితాల తారుమారు, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం వంటి అరాచకాలు
* కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిషన్ సిఫారసుల మేరకు రాజధానిగా ఏర్పడిన అమరావతిని స్థిరపరచాలనే డిమాండ్
* పండించిన పంటలకు మద్దతు ధర లేక, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందక రైతులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పర్యాటకం...’ పక్కా నాటకం!
జగన్ ప్రభుత్వంలో పర్యాటక రంగం అభివృద్ధికి అప్పులివ్వడానికి బ్యాంకులే కాదు... పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలూ ముందుకు రాలేదు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
బస్సులు సీఎం సభకు.. కష్టాలు ప్రయాణికులకు
ఆర్టీసీ బస్సులను ముఖ్యమంత్రి సభకు తరలించడంతో కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రయాణికులు అష్టకష్టాలు ఎదుర్కొన్నారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
మూడు రాజధానులు ఏర్పాటు చేశాం
‘మొట్టమొదటిసారిగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేశాం’ నంద్యాల ‘మేమంతా సిద్ధం’ సభలో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాట ఇది.. ఉన్న రాజధాని అమరావతినే చంపేసిన ఆయన.. మూడు రాజధానులు ఏర్పాటు చేశానని చెబుతున్నారు. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కరవును కళ్లారా చూడు జగనన్నా
‘ఏడాది ఓపిక పట్టండి. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. వలసల నివారణకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతం
హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ బుధవారం నిర్వహించిన రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతమైంది. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
అంత తొందరెందుకు?
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 21 మంది సహాయ ఆచార్యులకు ఉన్నతి కల్పిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పాకశాస్త్ర కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న తిరుపతిలోని భారత పాకశాస్త్ర సంస్థ (ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్)లో వివిధ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ శిక్షణ, ప్లేస్మెంట్ అధికారి చెల్లేశ్వరరావు తెలిపారు. -
ఎన్నికలకు ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
దేవాదాయశాఖ కమిషనర్పై సుమోటో కోర్టుధిక్కరణ కేసు
దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణపై సుమోటోగా కోర్టుధిక్కరణ కేసు నమోదుచేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట
స్కిల్ కేసులో రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు