పెద్ద తలకాయలను పట్టుకోరా?
మాదక ద్రవ్యాల నిరోధక చట్టం (ఎన్డీపీఎస్) కింద నమోదవుతున్న గంజాయి అక్రమ రవాణా కేసుల్లో లారీ డ్రైవర్లు, అందులో ఉన్నవాళ్లను మాత్రమే నిందితులుగా పేర్కొంటున్నారని, దీని వెనుకున్న పెద్దతలకాయలను ఎప్పుడూ నిందితులుగా చేర్చడం లేదని హైకోర్టు ఆక్షేపించింది.
మాదకద్రవ్యాల కేసుల్లో డ్రైవర్లు, క్లీనర్లే నిందితులా?
దర్యాప్తు తీరుపైనా సందేహం కలుగుతోంది
జస్టిస్ లలిత కీలక తీర్పు
ఈనాడు, అమరావతి: మాదక ద్రవ్యాల నిరోధక చట్టం (ఎన్డీపీఎస్) కింద నమోదవుతున్న గంజాయి అక్రమ రవాణా కేసుల్లో లారీ డ్రైవర్లు, అందులో ఉన్నవాళ్లను మాత్రమే నిందితులుగా పేర్కొంటున్నారని, దీని వెనుకున్న పెద్దతలకాయలను ఎప్పుడూ నిందితులుగా చేర్చడం లేదని హైకోర్టు ఆక్షేపించింది. ఇది దర్యాప్తు తీరుపై సందేహాలకు తావిస్తోందని పేర్కొంది. ఈ కేసుల దర్యాప్తునకు ‘ప్రత్యేక విభాగం’ ఏర్పాటు చేయాలన్నారు. డీజీపీ క్రమం తప్పకుండా ప్రత్యేక విభాగంతో సమీక్షించాలని స్పష్టంచేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో(పీపీ) సైతం సంప్రదింపులు చేస్తుండాలంది. ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ విస్తీర్ణంలో గంజాయి సాగవుతున్నట్లు కనిపిస్తోందని, ఇది చట్టవిరుద్ధమనే విషయం స్థానికులకు తెలియదని వ్యాఖ్యానించింది. ఆయా ప్రాంతాల్లో పోలీసులు అవగాహన శిబిరాలతో ఛైతన్య పరచాలని ఆదేశించింది. ఎన్డీపీఎస్ కింద నమోదైన కేసుల్లో పోలీసులు, ప్రత్యేక కోర్టుల న్యాయాధికారులు, పీపీలు అనుసరించాల్సిన మార్గదర్శకాలను నిర్దేశిస్తూ తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వెళ్లిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ఇటీవల కీలక తీర్పు ఇచ్చారు. సంబంధిత ప్రతి హైకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంది. విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసులు ఎన్డీపీఎస్ కింద నమోదు చేసిన కేసులో నిందితులైన లారీ డ్రైవర్, క్లీనర్కు బెయిలు మంజూరు చేశారు.
గడువు పొడిగింపునకు అభ్యర్థించకపోవడంపై ఆక్షేపణ
ఎన్డీపీస్ కింద నమోదైన కేసుల్లో 180 రోజుల్లో అభియోగపత్రం దాఖలు చేయకుంటే నిందితులకు డిఫాల్ట్ బెయిలు మంజూరు చేయాల్సి ఉంటుందని న్యాయమూర్తి గుర్తుచేశారు. ఒకవేళ 180 రోజుల్లో అభియోగపత్రం దాఖలు చేయలేనప్పుడు.. నిందితుల రిమాండ్ సమయాన్ని పొడిగించాలని పోలీసులు సంబంధిత కోర్టులో పోలీసులు దరఖాస్తు చేయకపోవడాన్ని తప్పుపట్టారు.
డీజీపీ దృష్టికి తీసుకెళ్లినా...
నిందితుల రిమాండ్ సమయం పొడిగింపుపై దిగువ కోర్టుల్లో దరఖాస్తులు చేయడం లేదనే విషయాన్ని న్యాయస్థానం ఉత్తర్వుల ద్వారా డీజీపీ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటికీ చర్యలు లేవన్నారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో డీజీపీ కౌంటర్ దాఖలు చేస్తూ.. ఎన్డీపీఎస్ కేసుల దర్యాప్తు విషయమై సమావేశాలు నిర్వహించి మార్గదర్శనం చేశామన్నారు. నిందితుల రిమాండ్ను పొడిగించాల్సినవి విజయనగరంలో 8, విశాఖ జిల్లాలో 44 కేసులున్నాయన్నారు. సమయం పొడిగింపునకు కోర్టులో మెమోలు వేశామన్నారు. 2020లో విశాఖ జిల్లాలో 252, 2021లో 248 ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు అయ్యాయన్నారు.
ఇవీ న్యాయమూర్తి ఇచ్చిన మార్గదర్శకాలు...
* కేసు మూలాలను కనుగొనలేక కొన్నింట్లో పోలీసులు అభియోగపత్రం దాఖలు చేయలేకపోతున్నారు. కేసు నమోదైన తర్వాత సాధ్యమైనంత త్వరగా దర్యాప్తును పూర్తిచేయాలి.
* సోదాలు, జప్తుల సమయంలో అధికారులు ఎన్డీపీఎస్ చట్ట నిబంధనలను, సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలకు తప్పకుండా పాటించేలా అవగాహన కల్పించాలి.
* నిందితుల రిమాండ్ను పొడిగించాలని పోలీసు అధికారులు కోరినా తగిన సమయంలో స్పందించని పీపీ/ఏపీపీలపై చర్యలు తీసుకోవాలి.
* రిమాండ్ పొడిగింపు పిటిషన్లను ప్రత్యేక కోర్టులు నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలి. తరచూ వాయిదాలు వేస్తుండటంతో నిందితులు 200పైగా రోజులు జైళ్లలో మగ్గుతున్నారు.
* విశాఖలోని ప్రత్యేక కోర్టులో బెయిలు కోసం వేసిన పిటిషన్లకు 10 నుంచి 15 రోజులకు నంబరు ఇస్తున్నట్లు హైకోర్టు దృష్టిలో ఉంది. 2021 సెప్టెంబరు నుంచి నవంబరు 1 మధ్య.. బెయిలు పిటిషన్లు ఎప్పుడు దాఖలయ్యాయి, వాటికి నంబరు ఎప్పుడు కేటాయించారు. విచారణకు ఎప్పడొచ్చాయి. న్యాయస్థానం తుది ఉత్తర్వులు ఎప్పుడు జారీచేసిందనే వివరాలతో విశాఖలోని ఎన్డీపీఎస్ కేసుల విచారణ ప్రత్యేక జడ్జి.. హైకోర్టుకు నివేదిక ఇవ్వాలి’ అని తీర్పులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ