ఎంఎస్ అంటున్నారు
ఇంజినీరింగ్లో బీటెక్ తర్వాత మన రాష్ట్రంలో ఎంటెక్ చదివే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. బీటెక్ పూర్తవగానే ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. పీజీ చదివే వారు కూడా రాష్ట్రంలోని కళాశాలలకంటే విదేశాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అక్కడ ఎంఎస్ తర్వాత రూ.లక్షల వేతనాలతో ఉద్యోగాలు వస్తున్నాయి
విదేశాల్లో పీజీకే ప్రాధాన్యం
ఇక్కడ ఎంటెక్ చేసేవారు తక్కువే
ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్లో బీటెక్ తర్వాత మన రాష్ట్రంలో ఎంటెక్ చదివే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. బీటెక్ పూర్తవగానే ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. పీజీ చదివే వారు కూడా రాష్ట్రంలోని కళాశాలలకంటే విదేశాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అక్కడ ఎంఎస్ తర్వాత రూ.లక్షల వేతనాలతో ఉద్యోగాలు వస్తున్నాయి. మనదేశంలో ఎంటెక్ అదనపు అర్హతతో పెద్దగా ప్రయోజనం ఉండటంలేదు. ఫలితంగా ఐఐటీలు, ఇతర సంస్థలు, రాష్ట్ర కళాశాలల్లో కలిపి ఏటా సరాసరిన 9 వేలలోపు మందే ఎంటెక్ చేస్తున్నారు. అదే సమయంలో విదేశాల్లో ఎంఎస్ చేస్తున్న రాష్ట్ర విద్యార్థుల సంఖ్య 25 వేలకుపైగా ఉంటోంది. వీరిలో అమెరికాకు వెళ్లేవారు అత్యధికంగా 15 వేల వరకు ఉంటారని అంచనా. బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాలకు వెళ్లే వారు మరో 10 వేల వరకు ఉంటారు.
బీటెక్తోనే ఆపేస్తున్నారు
బీటెక్లో ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు వస్తుండడంతో విద్యార్థులు చేరిపోతున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలూ ఎంటెక్ అడగడం లేదు. పీజీ చేసినా వేతనంలో మార్పు ఉండడం లేదు. ఎంటెక్తో అధ్యాపకుల వృత్తిలో అడుగు పెట్టాలనుకున్నా ఇక్కడ వేతనాలు తక్కువగా ఉంటున్నాయి. దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చేరడం, లేదంటే ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లడం చేస్తున్నారు.
మెరుగైన అవకాశాల కోసమే...
మంచి అవకాశాల కోసమే విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. డిజిటలైజేషన్ కారణంగా బీటెక్ వారికి ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఎంటెక్పై ప్రత్యేకంగా ఏమీ ఉండటం లేదు. మెరిట్ విద్యార్థులు ఐఐటీలు, విదేశాల్లో చదివేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
- హేమచంద్రారెడ్డి, ఛైర్మన్, ఉన్నత విద్యామండలి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె