అకుంఠిత దీక్షకు మహా ‘బాసట’
అమరావతి రైతుల మహాపాదయాత్ర 27వ రోజున శనివారం నెల్లూరు నగరంలో కొనసాగింది. స్థానిక జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం నుంచి ప్రారంభమైన యాత్రకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా, కుల సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, నగరవాసులు సంఘీభావం తెలిపారు.
అమరావతి రైతుల పాదయాత్రకు నెల్లూరు నగరవాసుల సంఘీభావం
ఈనాడు డిజిటల్, నెల్లూరు: అమరావతి రైతుల మహాపాదయాత్ర 27వ రోజున శనివారం నెల్లూరు నగరంలో కొనసాగింది. స్థానిక జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం నుంచి ప్రారంభమైన యాత్రకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా, కుల సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, నగరవాసులు సంఘీభావం తెలిపారు. పాదయాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే వర్షం మొదలైనా తడుస్తూనే ముందుకు సాగారు. కాసేపటికి తెరిపివ్వడంతో బారాషాహిద్ దర్గా దగ్గరకు చేరుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున ముస్లింలు ఘనస్వాగతం పలికారు.ముస్లిం సంప్రదాయం ప్రకారం అక్కడే వారికీ భోజన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నమూ వర్షం ఇబ్బంది పెట్టినా.. పాదయాత్రికులు ముందుకు సాగారు. పొదలకూరు రోడ్డు దగ్గరకు చేరుకునే సరికి 300 కి.మీ. పూర్తి కావడంతో... స్థానికులు బంతిపూలతో స్తంభాలను అలంకరించి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా పాదయాత్రకు నెల్లూరు కాంగ్రెస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు.మాజీ మంత్రులు దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ రైతులతో అడుగు కలిపారు. నెల్లూరు బార్ అసోసియేషన్ తరఫున న్యాయవాదులు, భాజపా కిసాన్ మోర్చా, బీఎస్పీ, కార్మిక, రైతు కూలీ సంఘాల ప్రతినిధులు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం మహాపాదయాత్రకు విరామం ప్రకటించారు.
‘ఎన్నారైస్ ఫర్ అమరావతి’ రూ.54 లక్షల విరాళం
మహా పాదయాత్రకు సంఘీభావంగా ప్రవాసాంధ్రులు భారీ విరాళం ప్రకటించారు. ఎన్నారైస్ ఫర్ అమరావతి పేరిట రూ.54 లక్షలు అందించారు. రైతు కుటుంబ నేపథ్యం ఉండి... విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు ఒక బృందంగా ఏర్పాటై చందాలు వేసుకుని సేకరించారు. ఈమేరకు బృందం ప్రతినిధులు శనివారం నెల్లూరు జిల్లాలో అమరావతి పరిరక్షణ సమితి నేతల్ని కలిసి విరాళం అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!