భయం నీడలో బోదిలవీడు
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం బోదిలవీడులో భూమి 50 అడుగుల నుంచి 60 అడుగుల లోతు దాకా కుంగింది. రెండేళ్ల నుంచి ప్రతి ఏటా గ్రామ సమీపంలో భూమి కుంగుతుండటంతో అన్నదాతలు వ్యవసాయపనులకు అటువైపు
కుంగుతున్న భూములతో రైతుల్లో ఆందోళన
విద్యుత్ ఉపకేంద్రం సమీపంలో కుంగిన భూమి
న్యూస్టుడే, మాచర్ల: గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం బోదిలవీడులో భూమి 50 అడుగుల నుంచి 60 అడుగుల లోతు దాకా కుంగింది. రెండేళ్ల నుంచి ప్రతి ఏటా గ్రామ సమీపంలో భూమి కుంగుతుండటంతో అన్నదాతలు వ్యవసాయపనులకు అటువైపు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. పెద్ద రాతి పొరలు సైతం లోయలను తలపిస్తున్నాయి. 2019లో బోదిలవీడు-గుండ్లపాడు గ్రామాల మధ్య కిలోమీటర్ మేరకు పొలాల్లో భూమి కుంగింది. వ్యవసాయ బోర్లు అప్పట్లో 80 దాకా మొరాయించాయి. 2020లో బోదిలవీడు గ్రామ విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో గతేడాది భూమి కుంగింది. దానిచుట్టూ నెర్రెలొచ్చాయి. 60 అడుగులకు పైగా లోతట్టు ప్రాంతం లోయను తలపిస్తోంది. బోదిలవీడులో 2300 మంది దాకా జనాభా నివసిస్తుండగా, వీరంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వెల్దుర్తి మండలంలో వ్యవసాయ బోర్లు 1000 అడుగుల నుంచి 1200 అడుగుల దాకా వేస్తున్నారు. గ్రామంలో ఇలా భూమి కుంగితే పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో భూమి కొంతమేర దిగువకు కుంగినట్లు కనిపించినా అటువైపు వెళ్లేందుకు ధైర్యం చేయడం లేదు. వ్యవసాయం మానేస్తున్నారు. భూగర్భ పరిశోధన విభాగం, రెవెన్యూశాఖ అధికారులు సంయుక్తంగా ప్రమాదకర పరిస్థితులు ఉన్నచోట పరిశీలించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ప్రత్యేక నిపుణుల బృందం రంగంలోకి దిగితేనే బోదిలవీడు భయం నీడ నుంచి బయటపడే అవకాశముంది.
పొలాల్లో కోతకు గురవుతున్న మట్టి
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
- కృష్ణకుమారి, సర్పంచి, బోదిలవీడు.
గ్రామం చుట్టూ పొంచి ఉన్న ప్రమాదంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పొలాల్లో కుంగుతున్న భూములతో అన్నదాతలు భయపడుతున్నారు. ఉన్నతాధికారులు గ్రామం సందర్శించి సమస్యను పరిష్కరించాలి. ఇటీవల ఉపాధిహామీ పథకం కింద భూమి భారీగా కుంగిన చోట రక్షణ ఏర్పాట్లు చేయించాం.
విచ్చలవిడిగా బోర్లు వేయడంతోనే సమస్య
- శంకర్, జియాలజిస్ట్, మాచర్ల
నిబంధనలు అతిక్రమించి విచ్చలవిడిగా పక్కపక్కనే బోర్లు వేయడంతో బోదిలవీడు గ్రామానికి ప్రమాదం పొంచి ఉంది. భూమిలో రాతిపొరల మధ్య నీరు ఖాళీ అయి కుంగిపోతోంది. బోర్లు వేసే విషయంలో నిబంధనలు పాటిస్తే సమస్యను నియంత్రించవచ్చు.
బోదిలవీడు గ్రామం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
కార్టూన్
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు. -
పంచాయతీలపై రూ.23.08 కోట్ల వీల్ చైర్ల భారం!
పాడైన తాగునీటి మోటార్లు రిపేరు చేయించడానికి నిధుల్లేక బేల చూపులు చూస్తున్న గ్రామ పంచాయతీలపై మరో పిడుగు పడింది.