మొగుడు కొట్టడం తప్పేం కాదు!
కొన్ని పరిస్థితుల్లో భార్యను భర్త కొట్టడం తప్పేమీ కాదని దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 30 శాతానికి పైగా మహిళలు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోనైతే ఇలాంటి స్త్రీల శాతం ఏకంగా 84%గా ఉంది. జాతీయ
14 రాష్ట్రాల్లో 30% మహిళల మాటిదే
తెలుగు రాష్ట్రాల్లో 84% ఇదే బాటలో..
దిల్లీ: కొన్ని పరిస్థితుల్లో భార్యను భర్త కొట్టడం తప్పేమీ కాదని దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 30 శాతానికి పైగా మహిళలు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోనైతే ఇలాంటి స్త్రీల శాతం ఏకంగా 84%గా ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్హెచ్ఎఫ్ఎస్)-5 ఈ మేరకు వివరాలను బయటపెట్టింది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఈ అంశంపై సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా.. ‘‘భార్యను భర్త కొట్టడం మీ అభిప్రాయంలో సబబేనా?’’ అనే ప్రశ్నను మహిళల ముందుంచారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించడం, అత్తింటివారిని ఆమె గౌరవించకపోవడం, మొగుడితో వాదనకు దిగడం, భర్తతో శృంగారానికి నిరాకరించడం, ఆయనకు చెప్పకుండా బయటకు వెళ్లడం, ఇంటిని/పిల్లలను నిర్లక్ష్యం చేయడం, మంచి ఆహారాన్ని వండకపోవడం వంటి పరిస్థితులు తలెత్తినట్లు ఊహించుకొని సమాధానాలు చెప్పాలని వారికి సూచించారు.
సర్వేలో తేలిన ముఖ్యాంశాలివీ..
* మూడు రాష్ట్రాల్లో 75% పైగా మహిళలు.. భార్యను భర్త కొట్టడం సబబేనని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వారి శాతం 84%గా (సర్వేలో పాల్గొన్నవారిలో) ఉండగా.. కర్ణాటకలో 77%గా నమోదైంది.
* మణిపుర్ (66%), కేరళ (52%), జమ్మూ-కశ్మీర్ (49%), మహారాష్ట్ర (44%), పశ్చిమ బెంగాల్ (42%)ల్లోనూ మొగుడు చితకబాదడాన్ని సమర్థించే స్త్రీల సంఖ్య ఎక్కువగానే ఉంది.
* ఇంటిని/పిల్లల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు, అత్తింటివారిని గౌరవించనప్పుడు భార్యను భర్త కొట్టడం సమంజసమేనని అత్యధిక మంది మహిళలు అభిప్రాయపడ్డారు. అత్తింటివారిని గౌరవించకపోవడాన్ని ప్రధాన కారణంగా తెలంగాణ సహా 13 రాష్ట్రాల స్త్రీలు పేర్కొన్నారు.
* అత్యల్పంగా హిమాచల్ ప్రదేశ్లో 14.8% మహిళలు మొగుడు కొట్టడాన్ని సమర్థించారు.
* భార్యను భర్త కొట్టడాన్ని.. మహిళలతో పోలిస్తే తక్కువ మంది పురుషులు సమర్థించడం కొసమెరుపు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం