పథకాలతో జీవనశైలి మారాలి
ప్రజాసేవ కోసమే పదవులు తప్ప, అధికారం చలాయించడానికి కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తాను సేవ చేయాలని కోరుకుంటున్నానే తప్ప, అధికారాన్ని కాదని అన్నారు. ఆదివారం ‘మన్ కీ బాత్’
మన్ కీ బాత్లో ప్రధాని మోదీ
దిల్లీ: ప్రజాసేవ కోసమే పదవులు తప్ప, అధికారం చలాయించడానికి కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తాను సేవ చేయాలని కోరుకుంటున్నానే తప్ప, అధికారాన్ని కాదని అన్నారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిదారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ లబ్ధిదారుడు మోదీ అధికారంలో కొనసాగాలంటూ ఆకాంక్షించారు. దీనిపై స్పందిస్తూ ‘‘నేను ఈ రోజు కూడా అధికారంలో లేను. భవిష్యత్తులో కూడా ఉండాలని అనుకోవడం లేదు. సేవ చేయాలని మాత్రమే కోరుకుంటున్నా. ప్రధాని పదవి అధికారం కోసం కాదు. సేవ చేయడం కోసమే’’ అని చెప్పారు. ప్రభుత్వ పథకాల కారణంగా జీవన విధానం మారితే అది చాలా సంతోషం కలిగిస్తుందని అన్నారు. ఆయుష్మాన్ భారత్తో తమ జీవితాలు మారాయని లబ్ధిదారులు ప్రధానికి వివరించారు.
మూడు అంశాల్లో విజృంభిస్తున్న యువత
దేశంలోని యువత అందిస్తున్న సేవలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మూడు అంశాలు....‘నవీన ఆవిష్కరణలు’, ‘రిస్కు తీసుకోవడంపై అనురక్తి’, ‘చేయగలమన్న విశ్వాసం’ వారిలో కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ మూడు కలిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని అన్నారు. ప్రస్తుతం అంతా అంకుర సంస్థలు (స్టార్ట్ అప్స్) గురించే మాట్లాడుతున్నారని, వీటికి భారత దేశం కేంద్ర స్థానంగా మారిందని తెలిపారు. ఏటా కొత్త అంకుర సంస్థలు వస్తున్నాయని, ఈ రంగం శీఘ్రంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. చిన్న పట్టణాల్లోనూ వీటిని నెలకొల్పుతున్నారని అన్నారు. 70కుపైగా అంకుర సంస్థల విలువ ఒక బిలియన్ డాలర్ల (రూ.7వేల కోట్లు)కు దాటిందని చెప్పారు. ‘‘ఇది గొప్ప విషయం. కరోనా ఉన్నప్పటికీ దేశ యువత ఈ విజయాన్ని సాధించారు. అంకుర సంస్థల ద్వారా ప్రపంచ సమస్యలకు కూడా వారు పరిష్కారం చూపుతున్నారు’’ అని ప్రశంసించారు. అంకుర సంస్థలు విజయం సాధిస్తుండడంతో దేశ, విదేశాలకు చెందిన పెట్టుబడిదారులు ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు. బస్సుల కాలుష్యాన్ని 40 శాతం మేర తగ్గించడానికి అంకుర సంస్థలను నెలకొల్పిన మయూర్ పాటిల్ అనే యువకునితో ప్రధాని మాట్లాడారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.90 లక్షల సాయంతో ఆయన ఆ సంస్థను ఏర్పాటు చేశాడు.
సాహసాలకు యుద్ధభూమే అవసరం లేదు
సాహసం చూపించడానికి యుద్ధభూమే అవసరం లేదని, అభివృధ్ధి కార్యక్రమాల్లోనూ వాటిని ప్రదర్శించవచ్చని ప్రధాని మోదీ అన్నారు. బుందేల్ఖండ్లోని జలౌన్ ప్రాంత వాసులు ఎంతో శ్రమించి నూన్ నదిని పునరుద్ధరించారని చెప్పారు. తక్కువ సమయంలో, అతి తక్కువ ఖర్చుతో ఒక నది ప్రవహించేలా చేశారని తెలిపారు. మేఘాలయలో స్థానికులే ఓ నది నీటిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుతున్నారని గుర్తుచేశారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రధాని మోదీ దేశవాసులను హెచ్చరించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం అందరి బాధ్యత అంటూ అప్రమత్తం చేశారు.
ఆడియో, సంగీతం ప్లాట్ఫారాల్లో అందుబాటు
మన్ కీ బాత్ కేవలం రేడియా, టీవీ, యూట్యూబ్, నమో యాప్ ద్వారా మాత్రమే కాకుండా ఇకపై ఆడియో, మ్యూజిక్ ప్లాట్ఫారాల్లోనూ అందుబాటులోకి రానుంది. హంగామా, గానా, అమెజాన్ మ్యూజిక్, జియోసావన్, స్పోటిఫై, వింక్ వంటి ప్లాట్ఫారాల ద్వారా కూడా ప్రసారం చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే