వరద బాధితులను ఉదారంగా ఆదుకోండి
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజల్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా, మానవతా దృక్పథంతో స్పందించాలని మ్ట్ల్య్రుమంత్రి జగన్ కోరారు. కేంద్ర సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన వరద నష్టం అంచనాల్లో...
కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి జగన్
నష్టం లెక్కలు కచ్చితంగా వేశామని వెల్లడి
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజల్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా, మానవతా దృక్పథంతో స్పందించాలని మ్ట్ల్య్రుమంత్రి జగన్ కోరారు. కేంద్ర సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన వరద నష్టం అంచనాల్లో... ఎక్కడా ఉ్శన్నదాన్ని పెంచి చూపించలేదని ఆయన పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ పరిధిలోని ఎన్డీఎంఏ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలోని కేంద్ర బృందం రాష్ట్రంలో మూడు రోజులపాటు పర్యటించి వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసింది. ఈ బృంద సభ్యులు సోమవారం సీఎం జగన్ను కలిసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వీలైనంత మేర ఆదుకునేలా సహకరిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ఈ విపత్తు నష్టం హృదయవిదారకం. నష్టం అంచనా వేసేందుకు మాకు ఆర్బీకేల రూపంలో సమర్థ వ్యవస్థ ఉంది. రైతు వేసే ప్రతి పంటా ఈ-క్రాప్లో నమోదైంది. సామాజిక తనిఖీ కూడా చేశాం. పంట నష్టంపై కచ్చితమైన, నిర్ధారిత లెక్కలున్నాయి. కొవిడ్ నియంత్రణ చర్యల కోసం వినియోగించినందున ఎస్డీఆర్ఎఫ్ నిధులు నిండుకున్నాయి. దీనికి అడ్హక్ నిధులు మంజూరు చేయమని కోరుతున్నాం. దీర్ఘకాలంలో ఇలాంటి విపత్తుల్ని నియంత్రించేందుకు చర్యలు చేపడతాం. వరద నీటిని తరలించేందుకు ఇప్పుడున్న కాల్వల సామర్థ్యాన్ని పెంచేందుకు ఒక కార్యక్రమం తీసుకొస్తున్నాం. రిజర్వాయర్లు, డ్యామ్లను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. ఆటోమేటిక్ వాటర్గేజ్ సిస్టం ఏర్పాటుపైనా దృష్టి పెడతాం’ అని సీఎం వివరించారు. భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నందున ధాన్యం కొనుగోలులో తేమ, ఇతరత్రా నిబంధనల్ని సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
కడప జిల్లాలో భారీ నష్టం
కడప జిల్లాలో వరదల వల్ల నష్టం అధికంగా ఉందని, అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోవడం వల్ల అపార నష్టం సంభవించిందని కేంద్ర బృందానికి సారథ్యం వహించిన కునాల్ సత్యార్థి పేర్కొన్నారు. ‘చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోనూ వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. కడప జిల్లాలో మౌలిక సదుపాయాల నిర్మాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి. పశువులు చనిపోయాయి. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అన్నమయ్య ప్రాజెక్టు నుంచి వెళ్లే తాగునీటి సరఫరా వ్యవస్థలూ దెబ్బతిన్నాయి. ఊహించని రీతిలో కురిసిన భారీ వర్షాలకు తలెత్తిన వరదను తీసుకెళ్లగలిగే పరిస్థితి అక్కడున్న నదులు, వాగులు వంకలకు లేదు. ఆ స్థాయిలో వరదను నియంత్రించగలిగే ఆనకట్టలు, జలాశయాలు ఆ ప్రాంతంలో లేవు. ఉన్నవి ఈ స్థాయి వరదను ఊహించి నిర్మించినవి కాదు’ అని చెప్పారు. ‘మీ నాయకత్వంలో ప్రభుత్వ పనితీరు ప్రశంసనీయం. అంకితభావం కలిగిన మీ అధికారులు విపత్తు సమయంలో అద్భుతంగా పనిచేశారు. అత్యవసర సేవలను వెంటనే పునరుద్ధరించారు’ అని కేంద్ర బృందం ముఖ్యమంత్రితో పేర్కొన్నట్టు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ పునరావాసం, పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.6333.66 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి నివేదిక అందించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి