Dollar Seshadri: డాలర్ శేషాద్రి ఆకస్మిక మృతి
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకాధికారి (ఓఎస్డీ) డాలర్ శేషాద్రి(73) విశాఖలో హఠాన్మరణం చెందారు. సాగర తీరంలో సోమవారం రాత్రి నిర్వహించతలపెట్టిన కార్తిక దీపోత్సవంలో పాల్గొనేందుకు....
గుండెపోటుతో విశాఖలో ఆకస్మిక మృతి
నేడు తిరుపతిలో అంత్యక్రియలు
హాజరుకానున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
ఈనాడు- విశాఖపట్నం, ఈనాడు డిజిటల్ -తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకాధికారి (ఓఎస్డీ) డాలర్ శేషాద్రి(73) విశాఖలో హఠాన్మరణం చెందారు. సాగర తీరంలో సోమవారం రాత్రి నిర్వహించతలపెట్టిన కార్తిక దీపోత్సవంలో పాల్గొనేందుకు ఆదివారం ఆయన విశాఖ వచ్చారు. అదేరోజు సాయంత్రం సింహాచలంలోని సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. రాత్రి 8 గంటలకు ఉత్సవమూర్తుల కల్యాణ రథంలో విశాఖలోని తితిదే కల్యాణ మండపానికి చేరుకున్నారు. ఉత్సవమూర్తులను దించి, స్వామి పవళింపు సేవలో పాల్గొన్నారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత కల్యాణ మండపంలోనే నిద్రకు ఉపక్రమించారు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఛాతీనొప్పి రావడంతో వ్యక్తిగత సహాయకులు రాంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకునేలోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేజీహెచ్లో శేషాద్రి భౌతికకాయానికి ఎంబామింగ్ చేసి రోడ్డుమార్గంలో తిరుపతికి తరలించారు. ఆయన పార్థివ దేహాన్ని మంగళవారం మధ్యాహ్నం వరకు సందర్శనార్థం తిరుపతిలోని సరోజినీదేవి లేఔట్లో పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం గోవిందధామంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అంత్యక్రియలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, పలువురు మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరుకానున్నట్లు తితిదేకు సమాచారం అందింది.
చిన్న ఉద్యోగంలో చేరి... శ్రీవారి సేవకుడై
తమిళనాడులోని కంచి సమీపంలో ఉన్న నాగల్పాకంలో డాలరు శేషాద్రి జన్మించారు. తిరుపతిలో విద్యాభ్యాసం తర్వాత 1978లో తితిదేలో కొలువులో చేరారు. అనతికాలంలోనే స్వామివారి కైంకర్యాల నిర్వహణలో పట్టు సాధించారు. 2007లో బొక్కసం ఇన్ఛార్జిగా విరమణ చేశారు. నాటి నుంచి ఆలయ ప్రత్యేకాధికారిగా కొనసాగారు. శ్రీవారి ఆలయం, కైంకర్యాలు, స్వామివారి ఆభరణాల గురించి శేషాద్రికి తెలిసినంతగా.. ఇంకెవ్వరికీ తెలియదంటారు. ఆలయ ఆచారాలు, కైంకర్యాలను వివరిస్తూ... డాలరు శేషాద్రి ఆధ్వర్యంలో 2014 నుంచి పుస్తక రూపంలో తితిదే తీసుకొస్తోంది. ప్రస్తుతానికి రెండు సంపుటాలను ముద్రించారు. మిగిలిన మూడు ముద్రణ దశలో ఉన్నాయి.
శేషాద్రి ఎక్కడ?
శంకర్దయాళ్ శర్మ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తరచూ తిరుమలకు వచ్చేవారు. రేణిగుంట విమానాశ్రయంలో దిగగానే మొట్టమొదట అడిగేది... డాలరు శేషాద్రి ఎక్కడా అని. ఈయన్ని ఒకసారి తిరుమల నుంచి బదిలీ చేయగా అత్యున్నత స్థాయి నుంచి ఒత్తిడి రావడంతో ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. శేషాద్రికి సంతానం లేరు. ఆయన కుటుంబానికి కూడా దాదాపు దూరంగా ఉన్నారు. శ్రీవారి ఆలయం వెనకవైపున్న గోవింద నిలయంలోని చిన్న గదిలో నివాసం ఉంటున్నారు.
పొట్టేలు డాలర్... పేరు మార్చింది
తనకు డాలర్ శేషాద్రిగా పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని ఆయనే ‘ఈనాడు-ఈటీవీ’కి ఒకసారి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నలభై ఏళ్ల క్రితం ఓ జ్యోతిష్యుడు నా జాతకచక్రం ప్రకారం పొట్టేలు బొమ్మ కలిగిన డాలర్ను ధరించాలని సూచించారు. శ్రీవారి ఆలయంలో పనిచేసే నేను జంతువు బొమ్మను ధరించడం సరికాదన్నా. ఆ శ్రీవారే జంతువులను ఆధారంగా చేసుకుని ఉన్నారని జ్యోతిష్యుడు అనడంతో నాటి నుంచి డాలర్ ధరిస్తున్నా. దీంతో మీడియా ప్రతినిధులు నాఇంటి పేరు పాల శేషాద్రి నుంచి డాలర్ శేషాద్రిగా మార్చారు’ అని వివరించారు.
ఆయన నిష్క్రమణ బాధాకరం
-సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
‘స్వామి వారికి నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించిన డాలరు శేషాద్రి మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆరోగ్యం ముఖ్యమంటూ నేను పదేపదే వారించాను. తుదిశ్వాస వరకు శ్రీవేంకటేశ్వరుడి సేవలో తరించడమే తన జీవితాశయమని ఆయన చెప్పేవారు. అలాగే చివరి క్షణం వరకు శ్రీవారి సేవలో తరించారు. ఇటీవలే నా పుట్టినరోజున శ్రమకోర్చి దిల్లీదాకా వచ్చి ఆత్మీయ ఆలింగనంతో నన్ను ఆశీర్వదించి వెళ్లారు. ఇంతలోనే నిష్క్రమణ ఎంతో బాధాకరం.
శేషాద్రి సేవలు మరువలేను
-ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
డాలర్ శేషాద్రి పరమపదించారని తెలిసి ఎంతో విచారించా. తితిదేలో పదవులతో నిమిత్తం లేకుండా వివిధ హోదాల్లో అత్యున్నత సేవలందించారు. నేనెప్పుడు తిరుమల వెళ్లినా దర్శన సమయంలో పక్కనే ఉండి ఆలయ విశేషాలను వివరించేవారు.
శ్రీవారి సేవలోనే తరించిన ధన్యజీవి..
డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారని, ప్రతిరోజు స్వామి వారి సుప్రభాత సేవ నుంచి శయనోత్సవం వరకు ఆయన చేయి తాకని సేవలు ఉండవని శ్రీత్రిదండి రామానుజ చినజీయర్ స్వామి గుర్తుచేశారు. శేషాద్రి హఠాన్మరణం ఎంతో బాధాకరమని, వేంకటేశ్వర స్వామి సేవలో తరించిన ఆయన తితిదేకు విశేష సేవలందించారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. డాలర్ శేషాద్రి తన జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్యజీవని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని తితిదే ఈవో జవహర్రెడ్డి ఆకాంక్షించారు. డాలర్ శేషాద్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని అదనపు ఈవో ధర్మారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు మాట్లాడుతూ... శ్రీవారి ఆలయంలోని అర్చకులంతా ప్రేమతో ఆయన్ని డాలర్ మామగా పిలుచుకునేవాళ్లమని, ఆయనలేని లోటు ఎవరూ తీర్చలేనిదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్