ఏపీకి 13.24 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా
ఈ ఏడాదిలో అక్టోబరు వరకు ఆంధ్రప్రదేశ్లోని థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టులకోసం 13.24 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరాచేసినట్లు ప్రహ్లాద్ జోషీ తెలిపారు.
ఈనాడు, దిల్లీ: ఈ ఏడాదిలో అక్టోబరు వరకు ఆంధ్రప్రదేశ్లోని థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టులకోసం 13.24 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరాచేసినట్లు ప్రహ్లాద్ జోషీ తెలిపారు. భాజపా సభ్యుడు టీజీ వెంకటేష్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. గత ఏడాది ఇదే సమయానికి 7.18 మిలియన్ టన్నులు మాత్రమే సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. విద్యుత్తు కేంద్రాల వద్ద తగిన మోతాదులో నిల్వలు ఉంచుకోవడం కోసం కోల్ ఇండియా లిమిటెడ్ మరో 4.97 లక్షల టన్నులు అదనంగా ఇవ్వడానికి అంగీకరించినట్లు చెప్పారు.
ఏపీఎండీసీకి ఝార్ఖండ్లో బొగ్గు గని కేటాయింపు
ఝార్ఖండ్లోని బ్రహ్మదిహ బొగ్గుగనిని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)కు కేటాయించినట్లు కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. వాణిజ్య అవసరాలకోసం ఈ గనిని ఈ ఏడాది మార్చి 2న కేటాయించినట్లు తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ సోమవారం అడిగిన ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
పీఎంఏవైయూ కింద ఏపీకి 19.87 లక్షల ఇళ్ల కేటాయింపు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) కింద ఆంధ్రప్రదేశ్కు ఇప్పటివరకు 19,87,111 ఇళ్లు కేటాయించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు. ఇందులో 17,19,109 ఇళ్ల నిర్మాణ బాధ్యతలను ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చూస్తోందని, వీటిలో 1,42,819 నిర్మాణం పూర్తిచేసిందని చెప్పారు. మరో 2,68,002 ఇళ్ల నిర్మాణాన్ని ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటిడ్కో) చూస్తోందని, అందులో 2,01,218 ఇళ్లనిర్మాణం తుదిదశకు వచ్చినట్లు చెప్పారు.
వాటర్ ఏరోడ్రోమ్గా ప్రకాశం బ్యారేజీ ఎంపిక
ప్రాంతీయ అనుసంధాన పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం బ్యారేజీని వాటర్ ఏరోడ్రోమ్గా గుర్తించినట్లు కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయమంత్రి వీకే సింగ్ తెలిపారు. ఆయన సోమవారం వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇక్కడి నుంచి హైదరాబాద్కు ఆర్సీఎస్ ఉడాన్ స్కీం కింద సీప్లేన్లు నిర్వహించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. వాటర్ ఏరోడ్రోమ్ అభివృద్ధి బాధ్యతలను పోర్ట్స్, షిప్పింగ్, జలరవాణాశాఖ తీసుకుందని, ఇందుకోసం పౌరవిమానయానశాఖతో ఎంఓయూ కుదుర్చుకుందని చెప్పారు.
2022 ఆగస్టుకల్లా రాజమహేంద్రవరం సైన్స్ సెంటర్
రాజమహేంద్రవరానికి మంజూరు చేసిన సైన్స్ సెంటర్ (కేటగిరీ-2) ఏర్పాటు 2022 ఆగస్టుకల్లా పూర్తవుతుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. స్థానిక ఎంపీ మార్గానిభరత్ లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి: గల్లా జయదేవ్
నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైందని, వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ కోరారు. 377 నిబంధన కింద లోక్సభలో ఈ అంశాన్ని ఆయన లేవనెత్తారు. పెన్నా, చెయ్యేరు నదులకు వచ్చిన వరదలతో దేశ దక్షిణ ప్రాంతానికి తూర్పు ప్రాంతానికి అనుసంధానత నిలిచిపోయిందని, జాతీయ రహదారి 16కు పలుచోట్ల కోతకు గురయిందని పేర్కొన్నారు. పదుల కొద్ది గ్రామాలు నీటమునిగాయన్నారు. 60 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది పశువులు మృత్యువాతపడ్డాయని వివరించారు. ప్రజలు ఆహారం, నీరు, అత్యవసర మందుల్లేక విలవిల్లాడుతున్నారని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.