AP High Court: ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం
అకాల వర్షాలతో కుదేలైన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారు పడుతున్న ఇబ్బందులను తనవిగా భావించి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం విషయంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను ధర్మాసనం అనుమతించింది.
సింగిల్ జడ్జి తీర్పు అంశాల్లోకి వెళ్లడం లేదని హైకోర్టు స్పష్టీకరణ
ఈనాడు డిజిటల్, అమరావతి: నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం విషయంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను ధర్మాసనం అనుమతించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది. అర్హులైన ‘పిటిషనర్ల’కు ఇంటి స్థలాలు కేటాయిస్తేచాలని వారి తరఫు సీనియర్ న్యాయవాది వీఎస్ఆర్ ఆంజనేయులు ధర్మాసనానికి నివేదించారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి దాఖలు చేసిన అదనపు అఫిడవిట్ను ఆయన ప్రస్తావిస్తూ... అందులో మొత్తం 128 పిటిషనర్లలో 52 మందికి స్థలాలు ఇచ్చినట్లు, మిగిలిన వారు దరఖాస్తు చేసుకుంటే చట్ట ప్రకారం పరిశీలించి వారికి మంజూరు చేస్తామని తెలిపారన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్లు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని, వాటిని అధికారులు పరిష్కరించేలా ఆదేశించాలని కోరారు. పిటిషనర్లు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. సీనియర్ న్యాయవాది అభ్యర్థనపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఇరువైపులా వాదనలను నమోదు చేసిన ధర్మాసనం.. ఈ పథకం కింద కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను అనుమతించింది. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ‘వ్యాజ్యాన్ని’ ఉపసంహరించుకుంటున్నామని చెబుతున్నందున సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులోని అంశాల్లోకి తాము వెళ్లడం లేదని స్పష్టం చేసింది. ఇంటి స్థలం కోసం మూడు వారాల్లో పిటిషనర్లు తాజాగా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు ఇచ్చింది. ఇళ్ల పథకం మార్గదర్శకాల ప్రకారం ఆ దరఖాస్తులను పరిష్కరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బి.కృష్ణమోహన్తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ నేపథ్యం... ఈ పథకం కింద 25లక్షల ఇళ్ల స్థలాలు/హౌజింగ్ యూనిట్లు ఇచ్చే నిమిత్తం మార్గదర్శకాలకు సంబంధించిన జీవోలను సవాలు చేస్తూ తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది గతేడాది డిసెంబర్లో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇళ్ల ప్లాట్లను కేవలం మహిళ లబ్ధిదారులకే కేటాయించడంపై అభ్యంతరం తెలిపారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. ఇళ్ల పట్టాలను మహిళ లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపట్టారు. మహిళలతో పాటు అర్హులైన పురుషులు, ట్రాన్స్జెండర్లకు పట్టాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.5సెంటు, పట్టణ ప్రాంతాల్లో 1సెంటు ఇంటి స్థలం కోసం కేటాయించడాన్ని ఆక్షేపించారు. అధ్యయనానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా ముందుకెళ్లాలన్నారు. అప్పటివరకు ఆయా భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దంటూ అక్టోబర్ 8న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ వేసింది. 24న విచారణ చేపట్టిన ధర్మాసనం.. అదనపు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. మంగళవారం జరిగిన విచారణలో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లోని అంశాల్ని పిటిషనర్ల తరఫు సీనియర్ వీఎస్ఆర్ ఆంజనేయులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తాజాగా దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిస్తూ అప్పీల్పై విచారణను మూసివేయాలన్నారు.
2.62లక్షల లబ్ధిదారులకు పీఎంఏవై ఇళ్లు
- హైకోర్టుకు ప్రభుత్వ నివేదన
ఈనాడు, అమరావతి: ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద గృహాలు నిర్మించి, 2022 డిసెంబర్ నాటికి 2,62,216 ఇళ్లు అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని పేర్కొంటూ పురపాలకశాఖ(ఎఫ్ఏసీ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. 2021 డిసెంబరుకి 45,000 ఇళ్లు, 2022 మార్చికి 75,000, 2022 జులైకి 70,000, 2022 డిసెంబర్ నాటికి 72,216 ఇళ్లు అప్పగిస్తామన్నారు. నెల్లూరు వెంకటేశ్వరపురంలో 1,000 ఇళ్లు ఇప్పటికే అప్పగించామన్నారు. హుద్హుద్ తుపాను కారణంగా నిర్మించిన 5,786 గృహాలను అప్పగించినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ప్రజాహిత వ్యాజ్యాన్ని పరిష్కరించింది. కోర్టుకు నివేదించిన గడువు మేరకు అధికారులు ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అప్పగిస్తారని విశ్వసిస్తున్నట్లు తెలిపింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. పీఎంఏవై పథకం కింద నిర్మితమైన గృహాలను లబ్ధిదారులకు ఇవ్వలేదంటూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన జె.బాలాజీ గతేడాది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫున న్యాయవాది పాణిని సోమయాజి వాదనలు వినిపించారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. లబ్ధిదారులకు ఇళ్లను ఎప్పుడు అప్పగిస్తారన్నది నిర్దిష్టంగా తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్