జగన్పై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంది
వైకాపా ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లే వారికి, నియోజకవర్గాల్లో దీటుగా పనిచేసే నాయకులకే భవిష్యత్తులో పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో ఇటీవల మున్సిపల్ ఎన్నికలు జరిగిన కొండపల్లి, జగ్గయ్యపేట పురపాలక
వైకాపా వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పోరాడే వారికే పార్టీలో ప్రాధాన్యం
కొండపల్లి, జగ్గయ్యపేట నాయకులతో సమీక్షలో తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లే వారికి, నియోజకవర్గాల్లో దీటుగా పనిచేసే నాయకులకే భవిష్యత్తులో పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో ఇటీవల మున్సిపల్ ఎన్నికలు జరిగిన కొండపల్లి, జగ్గయ్యపేట పురపాలక సంఘాల నాయకులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన సమావేశమయ్యారు. కొండపల్లిలో పార్టీ విజయానికి కృషి చేసిన నాయకులందరికీ పేరు పేరునా ఆయన అభినందనలు తెలిపారు. జగ్గయ్యపేటలో తెదేపా నైతికంగా గెలిచి, వైకాపా అక్రమాలతో సాంకేతికంగా ఓడిపోయిందన్నారు. ‘‘కొన్ని నియోజకవర్గాల్లో సమర్థుల్ని ప్రోత్సహించకపోవడంతో సమస్యలు వస్తున్నాయి. ఇకపై నియోజకవర్గ ఇన్ఛార్జి నుంచి ప్రతి స్థాయిలోను సమర్థులకే పెద్దపీట వేస్తాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘జగన్రెడ్డి కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి స్థానిక ఎన్నికలు నిర్వహించారు. వైకాపాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. వారి వైఫల్యాల్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నేటి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. నాపైనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. పార్టీ నేతలంతా అప్రమత్తంగా ఉండాలి. రెండున్నరేళ్ల జగన్రెడ్డి పాలనలో అన్నీ అరాచకాలే’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘కొండపల్లి ఎన్నికల్లో ఎంపీ కేశినేని నాని నాయకులకు సరియైన దిశానిర్దేశం చేశారు. వైకాపా ఎంత డబ్బు ఖర్చు చేసినా ప్రజలు తెదేపాకి విజయం చేకూర్చారు. రాష్ట్ర స్థాయి నాయకులు కూడా అదేవిధంగా పనిచేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. నాయకులెప్పుడూ ప్రజలతో మమేకమై ఉండాలి...’’ అని చంద్రబాబు చెప్పారు. మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, చినరాజప్ప, తదితరులు పాల్గొన్నారు.
* జగ్గయ్యపేటలో వైకాపా నాయకులు డబ్బు, అధికారబలంతో ప్రభుత్వ అధికారుల్ని ప్రలోభపెట్టి తెదేపా అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్న వార్డుల్లోను రీకౌంటింగ్కు అవకాశం లేకుండా చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘జగ్గయ్యపేటలో నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీరాం తాతయ్య, నెట్టెం రఘురాం రీకౌంటింగ్కు పట్టుబట్టినా అధికారులు అవకాశమివ్వలేదు. మూడు వార్డుల్లో తెదేపా ఓడిపోయింది. ఎమ్మెల్యే ఉదయభాను ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి వెళ్లి... తెదేపా గెలిచిన 13వ వార్డులో మూడుసార్లు రీకౌంటింగ్ జరిపించి, చివరకు వైకాపా ఆరు ఓట్లతో గెలిచినట్లు ప్రకటింపజేసుకున్నారు’’ అని ఆయన మండిపడ్డారు. జగ్గయ్యపేటలో తెదేపా అభ్యర్థులు గెలిచి ఓడారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. దేనికి సిద్ధం? మళ్లీ రూ.7లక్షల కోట్లు అప్పు చేయడానికా: షర్మిల
ఐదేళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేని జగన్.. మళ్లీ ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధం అంటున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. -
తండ్రి ఆస్తి మొత్తం కొట్టేసి.. చెల్లికి అప్పు ఇచ్చిన వ్యక్తి జగన్: చంద్రబాబు
తండ్రి ఆస్తి మొత్తం కొట్టేసి చెల్లికి వాటా ఇవ్వకుండా.. అప్పు ఇచ్చిన దుర్మార్గుడు జగన్ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. -
తెదేపా నేతపై ఎస్ఐ అనుచిత వ్యాఖ్యలు.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
బాపట్ల జిల్లా పర్చూరులో కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నామినేషన్ సందర్భంగా ఎస్సై శివనాగిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. -
పవన్ కల్యాణ్ ఐదేళ్ల సంపాదన రూ.114 కోట్లు.. అప్పులు రూ.64 కోట్లు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి.. ముఖ్యనేతల నామినేషన్లు
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల సందడి కొనసాగుతోంది. ప్రధాన పార్టీల తరఫున అభ్యర్థులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు (ఆర్వో) సమర్పించారు. -
నామినేషన్ వేసిన పవన్.. అఖండ విజయం ఎన్డీయేదేనని ధీమా
ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం అసెంబ్లీ స్థానానికి జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ప్రతి ఆడబిడ్డను లక్షాధికారిని చేసే బాధ్యత నాది: చంద్రబాబు
ఆడ పిల్లలకు పుట్టినిల్లు తెలుగుదేశం అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికలు రాగానే మోసగాళ్లు వస్తారు.. రకరకాల మాటలు చెప్తారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా: సుంకర పద్మశ్రీ
తాను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తెలిపారు. -
ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ పథకంగా మార్చేశారు.. : లోకేశ్
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ పథకంగా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. -
గుడివాడలో తెదేపా అభ్యర్థి నామినేషన్ ర్యాలీకి పోలీసుల అడ్డంకులు
కృష్ణా జిల్లా గుడివాడలో తెదేపా (TDP) అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్ ర్యాలీకి పోలీసులు అడ్డంకులు కల్పించారు. -
పవన్ నామినేషన్.. పిఠాపురంలో భారీ ర్యాలీ
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని నివాసం నుంచి ఆయన బయల్దేరారు. -
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్