అన్నదాతల మహాపాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు
అన్నం పెట్టే అన్నదాతకు భోజనం చేసేందుకు స్థలం దొరకలేదు. అమరావతి రాజధాని కోసం వేల ఎకరాల భూములిచ్చిన వారికి నిలువనీడ కరవైంది. మహిళల అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసుకున్న బయో టాయిలెట్లను రోడ్డుపై నిలిపేందుకు కూడా అనుమతివ్వలేదు
సర్వేపల్లి నియోజకవర్గంలో వంటకు, వసతికి అమరావతి రైతుల ఇబ్బందులు
నెల్లూరు గ్రామీణ మండలం పాలిచర్లపాడు అడ్డరోడ్డు సమీపంలోని ఎస్ఎల్వీ ఎస్టేట్ వద్ద పొదలకూరు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న అమరావతి రైతులు
ఈనాడు డిజిటల్ - నెల్లూరు: న్యూస్టుడే - పొదలకూరు: అన్నం పెట్టే అన్నదాతకు భోజనం చేసేందుకు స్థలం దొరకలేదు. అమరావతి రాజధాని కోసం వేల ఎకరాల భూములిచ్చిన వారికి నిలువనీడ కరవైంది. మహిళల అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసుకున్న బయో టాయిలెట్లను రోడ్డుపై నిలిపేందుకు కూడా అనుమతివ్వలేదు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు బుధవారం నెల్లూరు జిల్లాలో ఎదురైన అడ్డంకులివి. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రవేశించినప్పటి నుంచి యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు.
భోజనం చేసేందుకు కూడా స్థలమివ్వకుండా తమపై కక్షసాధిస్తున్నారంటూ కన్నీరు పెడుతున్న అమరావతి మహిళా రైతు
స్థలాలిచ్చే వారికి బెదిరింపులు
సర్వేపల్లి నియోజకవర్గంలో అమరావతి రైతులకు ఉండేందుకు, వండుకునేందుకు స్థలం ఇచ్చిన వారిని వైకాపా నాయకులు బెదిరిస్తున్నారని ఐకాస సభ్యులు ఆరోపించారు. పొదలకూరు సమీపంలోని వేబ్రిడ్జి దగ్గర బుధవారం భోజన ఏర్పాట్లు చేసేందుకు ఐకాస సభ్యులు తొలుత నిర్ణయించారు. ముందు సమ్మతించిన కాటా నిర్వాహకులు తెల్లారేసరికి మాట మార్చారు. దీంతో ఓ రైతు నివాస స్థలంలో ఏర్పాట్లు చేశారు. అక్కడ చోటు చాలకపోవడంతో చాటగొట్ల దగ్గర రోడ్డుపైనే కూర్చొని భోజనం చేశారు. వాహనాల దుమ్ము, మురుగు దుర్వాసన మధ్యనే అర్ధాకలితో భోజనం ముగించారు. తింటున్నంతసేపు మహిళా రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. అమరావతి రైతుల మహా పాదయాత్ర 31వ రోజు ఉద్రిక్తతలు, భావోద్వేగాల మధ్య సాగింది. ఉదయం పారిచెర్లపాడు సమీంలోని ఎస్ఎల్వీ వెంచర్స్ దగ్గర పాదయాత్రకు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆహ్వానం పలికిన తర్వాత.. వాహనాలు రోడ్డుపైకి వచ్చే సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. యాత్రలో క్రైస్తవ, ముస్లిం ప్రచార రథాలకు న్యాయస్థానం అనుమతి లేదంటూ నిలిపివేశారు. ఆగ్రహించిన గురైన రైతులు, ముస్లిం, క్రైస్తవ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మద్దతు తెలిపే వారిని అడ్డుకోమని కోర్టు చెప్పలేదనీ, మతాచారాలను కించపరిచేలా పోలీసులు వ్యవహరించడం తగదనీ మండిపడ్డారు. అమరావతి రాజధాని అందరిదీ అంటూ మహిళలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 16వ నంబరు జాతీయ రహదారిపై వరద నీరు పారుతుండటంతో.. భారీ వాహనాలన్నింటినీ పొదలకూరు-నెల్లూరు రహదారి మీదుగా మళ్లించారు. అదే మార్గంలో రైతులు బైఠాయించి నిరసన తెలపడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో రైతులు ఆందోళన విరమించి పాదయాత్ర కొనసాగించారు.
పాదయాత్ర ముగిసిన తర్వాత రాత్రి బసకు చోటు దొరక్క కంకరపై కూర్చున్న మహిళా రైతులు
టాయిలెట్లు తీసేయమని చెప్పలేదు
పాదయాత్రలో మహిళల కోసం ఏర్పాటు చేసిన బయో టాయిలెట్లను తీసేయాలని తాము చెప్పలేదని పేరు చెప్పడానికి ఇష్టపడని పోలీసు అధికారి వివరించారు. జాతీయ రహదారిపై అడ్డంకుల దృష్ట్యా పొదలకూరు రోడ్డులో ట్రాఫిక్ పెరిగిందన్నారు. వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రోడ్డుపై నిలిపిన వాహనాలను ముందుకు పోనివ్వాలని మాత్రమే చెప్పామన్నారు.
రాత్రి బసకూ అవస్థలు
బుధవారం ఉదయం నెల్లూరు జిల్లా మరుపూరు నుంచి ప్రారంభమైన యాత్ర.. సుమారు 12 కి.మీ. సాగి, మర్రిపల్లి వద్ద ముగిసింది. మరుపూరు నుంచి తోడేరు, పొదలకూరు మీదుగా సాగిన యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆత్మకూరు, చేజర్ల మండలాల నుంచి పెద్దఎత్తున రైతులు వచ్చి సంఘీభావం తెలిపారు. మరుపూరు దగ్గర బస చేసేందుకు స్థలం దొరక్కపోవడం, మహిళలు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయోటాయిలెట్లను పోలీసులు తీసేయించడంతో వారు అవస్థలు పడ్డారు. దీంతోవారు అమరావతి రైతులు మళ్లీ నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం అంబాపురంలో నాలుగు రోజులుగా బస చేస్తున్న శాలివాహన ఫంక్షన్హాల్కే అమరావతి రైతులు చేరుకున్నారు. 400 కి.మీ.కు పైగా పాదయాత్ర చేస్తున్న అమరావతి ఆడపడుచులు అన్నం తినేందుకు చోటు దక్కకపోవడం దారుణమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ధ్వజమెత్తారు. పాదయాత్ర ప్రారంభం నుంచి లేని అభ్యంతరాలు ఒక్క సర్వేపల్లిలో నియోజకవర్గంలోనే వచ్చాయా? అని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!