35 మందితో..
భారత్ను బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా పాలించింది 89 సంవత్సరాలే (1858-1947)! ఈస్టిండియా కంపెనీ మాత్రం దాదాపు 150 ఏళ్లు అధికారం చెలాయించింది. భౌగోళికంగా, జనాభా, సంపద పరంగా ఎన్నో రెట్లు పెద్దదైన....
భారత్ను బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా పాలించింది 89 సంవత్సరాలే (1858-1947)! ఈస్టిండియా కంపెనీ మాత్రం దాదాపు 150 ఏళ్లు అధికారం చెలాయించింది. భౌగోళికంగా, జనాభా, సంపద పరంగా ఎన్నో రెట్లు పెద్దదైన అఖండ భారతావనిని పాలించిన ఈ ఈస్టిండియా కంపెనీ వద్ద ఉన్న బలం, బలగం ఎంత అని చూస్తే....
బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీని తూర్పు ఆసియాలో ఇంగ్లాండ్ తరఫున వ్యాపారం చేసేందుకు 1600 సంవత్సరం డిసెంబరులో స్థాపించారు. కొంతమంది ఇంగ్లాండ్ వ్యాపారవేత్తలు (వీరిలో ఓ మద్యం వ్యాపారి, వస్త్రవ్యాపారి, తోలువ్యాపారితో పాటు కొంతమంది సముద్ర దొంగలు కూడా ఉన్నట్లు చెబుతారు) ఉమ్మడిగా... 60 వేల పౌండ్ల పెట్టుబడితో జాయింట్ స్టాక్ కంపెనీగా మొదలైంది. బ్రిటన్ రాణి అనుమతితో భారత ఉపఖండంలో వ్యాపారాన్ని మొదలెట్టారు.
అప్పటికే స్పెయిన్, పోర్చుగల్కు చెందిన కంపెనీలు ఈ ప్రాంతంలో వ్యాపారంలో స్థిరపడ్డాయి. వారిని చూసే ఇంగ్లాండ్ ఈస్టిండియా కంపెనీ రంగంలోకి దిగింది. ఆరంభించిన తొలినాళ్లలో ఈస్టిండియా కంపెనీకి ప్రత్యేకంగా కార్యాలయం అంటూ ఏమీ లేదు. మొదటి 20 సంవత్సరాల పాటు... లండన్లోని తమ డైరెక్టర్ థామస్ స్మిత్ ఇంటి నుంచే కార్యకలాపాలు సాగించింది. సిబ్బంది ఆరుగురే! భారత్పై పట్టు బిగించేనాటికి లండన్లో చిన్న కార్యాలయంలో 35 మంది సిబ్బంది ఉండేవారు. భారత్లో పాలనాధికారం చేపట్టిన 30 సంవత్సరాలకుగానీ (1790 నాటికి)... వారి లండన్ కార్యాలయ సిబ్బంది సంఖ్య 150 దాటలేదు.
కేవలం 3వేల మందితో...
వ్యాపార రక్షణ కోసం తొలుత కొంతమంది సాయుధులను ఇంగ్లాండ్ నుంచి తెచ్చుకున్న ఈస్టిండియా దీన్ని ప్రణాళికాబద్ధంగా పెంచుకుంది. డచ్, ఫ్రెంచ్ తదితర కంపెనీలతో పోరాటాలకుగాను స్థానికులనే సైనికులుగా నియమించుకున్నారు. ప్లాసీ యుద్ధంలో రాబర్ట్క్లైవ్ సైన్యం 3 వేల మందే. వారితోనే 50వేల మంది సైన్యమున్న మొఘల్ నవాబును ఎదుర్కొని విజయం సాధించాడు క్లైవ్. 1778 నాటికి 70 వేలకు చేరిన ఈస్టిండియా సైన్యంలో చాలామంది భారతీయులే. వారికి యూరోపియన్లతో శిక్షణ ఇప్పించేవారు. ఇలా పెంచుకున్న సైన్యాన్ని మెల్లగా అధికార విస్తరణకూ ఉపయోగించుకుంది. భారత్లోని వివిధ రాజ్యాల మధ్య అనైక్యతను ఆలంబనగా చేసుకొని వారి మధ్య చిచ్చు పెట్టి తాను అధికారం చలాయించటం ఆరంభించింది. బ్రిటన్లోని పారిశ్రామికీకరణ పుణ్యమా అని వచ్చి పడిన ఆధునిక ఆయుధాలు తోడవటంతో స్థానిక రాజ్యాల సైన్యం సంఖ్యలో పెద్దదైనా నిలవలేని పరిస్థితి. పందొమ్మిదో శతాబ్దం ఆరంభానికి ఈస్టిండియా సైనికుల సంఖ్య రెండున్నర లక్షలకు చేరింది. ఆ సమయానికి బ్రిటన్ సైన్యం కంటే ఇదే పెద్దదంటారు.
భారత్లో దోచుకున్న సొమ్మును స్టాక్ డివిడెండ్ల రూపంలో బ్రిటన్లోని పార్లమెంటు సభ్యులకు పంచేవారు. బ్రిటన్ పార్లమెంటును కూడా పరోక్షంగా గుప్పిట పెట్టుకునే పరిస్థితి. అలా ఓ వ్యాపార సంస్థ ప్రపంచ చరిత్రగతిని మార్చింది. 1833లో పార్లమెంటు ఆమోదం ద్వారా కంపెనీని జాతీయం చేశారు. కానీ సిపాయిల తిరుగుబాటుతో 1858లో ఈస్టిండియా కంపెనీ పాలన ముగిసి... బ్రిటిష్ ప్రభుత్వ పాలన మొదలైంది. 1874లో ఈ కంపెనీని పూర్తిగా రద్దు చేశారు.
శిక్షణకు ప్రత్యేక కళాశాల...
ఈస్టిండియా కంపెనీలో ఉద్యోగమంటే బ్రిటన్లో జనాలు ఎగబడేవారు. బోర్డు డైరెక్టర్ల సిఫార్సు ఉంటేనేగానీ గుమాస్తా ఉద్యోగం కూడా దొరకని పరిస్థితి. పైగా తొలి ఐదేళ్లు బాండ్కు కట్టుబడి పనిచేయాల్సి వచ్చేది. భారత్లో పనిచేసే తన సిబ్బందికి శిక్షణ కోసం లండన్లో ప్రత్యేకంగా ఈస్టిండియా కళాశాలను కూడా ఆరంభించింది. గుమాస్తాల నుంచి పైస్థాయి ఉద్యోగుల వరకు ఇందులోనే శిక్షణ ఇచ్చేవారు.
దివాలా తీయబోయి..
భారత్ను దోచుకోవటం ఆరంభించిన ఈస్టిండియా కంపెనీ ఖజానా కళకళలాడిందనే అంతా అనుకుంటాం. అది నిజమే అయినా... ఒకదశలో కంపెనీ దివాలా తీసే పరిస్థితి కూడా తలెత్తింది. రాబర్ట్ క్లైవ్ మొఘల్ చక్రవర్తిని ఓడించి భారీ సంపదను లండన్కు తరలించిన తర్వాత కంపెనీ పాలన దెబ్బతింది. అప్పటిదాకా ఎన్నడూ చూడనంత సొమ్ము అప్పనంగా వచ్చి పడుతుండటంతో కంపెనీ అధికారగణం పై నుంచి కింది దాకా అవినీతిలో మునిగి తేలింది. ఫలితంగా... కంపెనీకి ఆదాయం భారీగా పడిపోయింది. దీనికి తోడు అదే సమయంలో బెంగాల్లో తలెత్తిన తీవ్ర కరవు కారణంగా పన్నులు తగ్గిపోయాయి. కంపెనీ దివాలా తీసే పరిస్థితి వచ్చింది. 1772లో లండన్లో ఈస్టిండియా డైరెక్టర్ల బోర్డు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి 10 లక్షల పౌండ్ల అత్యవసర రుణానికి దరఖాస్తు చేసుకుంది. సాయం చేయకుంటే దివాళా తీయటం తప్ప తమకు మరోమార్గం లేదని చేతులెత్తేసింది. విచారణ జరిపి... భారత్లో కంపెనీ పాలన పద్ధతుల్ని తీవ్రంగా తప్పు పడుతూనే... సాయం చేసి ఈస్టిండియాను గట్టెక్కించింది బ్రిటిష్ ప్రభుత్వం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా