వారం పది రోజుల్లో పీఆర్సీపై ప్రకటన

వారం.. పది రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చారు. శుక్రవారం తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతమైన సరస్వతినగర్‌లో ఆయన పర్యటిస్తున్నప్పుడు....

Published : 04 Dec 2021 04:19 IST

తిరుపతిలో ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్‌ హామీ


తమకు పీఆర్సీ ఎప్పుడంటూ తిరుపతిలో సీఎం ఎదుట  ప్లకార్డులు ప్రదర్శిస్తున్న ఉద్యోగులు

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: వారం.. పది రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చారు. శుక్రవారం తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతమైన సరస్వతినగర్‌లో ఆయన పర్యటిస్తున్నప్పుడు కొందరు ఉద్యోగులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సమయంలో ప్రజలతో మాట్లాడుతున్న సీఎం.. ‘ఇక్కడెవరో పీఆర్సీ గురించి మాట్లాడారు. వారిని దగ్గరకు రమ్మనండి’ అన్నారు. పోలీసులు వారిని సీఎం దగ్గరకు తీసుకొచ్చారు. వాళ్లు అక్కడకు రావడంతో సీఎం మాట్లాడుతూ, ‘వారం.. పది రోజుల్లో సెటిల్‌ చేసేస్తా’ అని చెప్పారు. దీంతో అక్కడికి వచ్చిన ఉద్యోగులు.. ముఖ్యమంత్రికి జేజేలు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని