పౌరులపై పేలిన తూటా
ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్లో ఘోరం చోటుచేసుకుంది. తిరుగుబాటుదారులుగా పొరబడి- సామాన్య కూలీలపై భద్రత బలగాలు శనివారం కాల్పులు జరపడం కల్లోలం సృష్టించింది.
మొత్తం 15 మంది దుర్మరణం
నాగాలాండ్లో తిరుగుబాటుదారులుగా పొరబడి బలగాల కాల్పులు
ఆగ్రహంతో విధ్వంసం సృష్టించిన స్థానికులు.. మళ్లీ కాల్పులు
కోహిమా, గువాహటి, దిల్లీ
పౌరుల కాల్చివేతకు నిరసనగా ఓటింగ్ గ్రామస్తులు తగులబెట్టిన వాహనాలు
ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్లో ఘోరం చోటుచేసుకుంది. తిరుగుబాటుదారులుగా పొరబడి- సామాన్య కూలీలపై భద్రత బలగాలు శనివారం కాల్పులు జరపడం కల్లోలం సృష్టించింది. ఈ ఘటనతో పాటు తర్వాత చోటుచేసుకున్న కాల్పుల్లో కలిపి మొత్తం 14 మంది పౌరులు దుర్మరణం పాలయ్యారు. మరో 11 మంది గాయపడ్డారు. బలగాల చర్యకు ఆగ్రహంతో ఊగిపోయి స్థానికులు సృష్టించిన విధ్వంసంలో ఓ సైనికుడు (కమాండో) ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది సిబ్బంది గాయపడ్డారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కాల్పులపై దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేసింది. సైన్యం కూడా విచారణకు ఆదేశించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నాగాలాండ్ సీఎం నీఫియు రియో, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సహా పలువురు తాజా కాల్పులపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
పాటలు పాడుతూ ఇంటికి చేరుతుండగా..
నాగాలాండ్లో.. మయన్మార్తో సరిహద్దుల్లో మోన్ జిల్లా ఉంది. అక్కడి ఓటింగ్ గ్రామం సమీపంలో నిషేధిత ఎన్ఎస్సీఎన్(కె) సంస్థకు చెందిన యంగ్ ఆంగ్ చీలికవర్గం తిరుగుబాటుదారులు సంచరిస్తున్నట్లు బలగాలకు నిఘా సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన బలగాలు.. ఆపరేషన్ను ప్రారంభించాయి. మెరుపు వేగంతో తిరు, ఓటింగ్ గ్రామాల మధ్య రోడ్డులోకి ప్రవేశించాయి. ఆ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ వాహనంపై కాల్పులు జరిపాయి. అయితే- వాహనంలో ఉన్నది తిరుగుబాటుదారులు కాదు. సామాన్య కూలీలు. వారంతా రోజూలాగే ఓ బొగ్గు గనిలో పనికి వెళ్లి సాయంత్రం వేళ ఇంటికి తిరిగొస్తున్నారు. పని బడలికను వదిలించుకునేందుకు.. వాహనంలో పాటలు పాడుతూ సేదతీరుతున్నారు. వారిని తిరుగుబాటుదారులుగా బలగాలు పొరపడటంతో ఘోరం జరిగిపోయింది. ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ప్రాంతంలో తిరుగుబాటుదారులను అణచివేయడంలో దీర్ఘకాలంగా క్రియాశీల పాత్ర పోషిస్తున్న అస్సాం రైఫిల్స్తో పాటు స్థానిక పోలీసులకు సమాచారమివ్వకుండా సైన్యానికి చెందిన పారా ప్రత్యేక బలగాల్లోని ఓ ఎలైట్ యూనిట్ తాజా ఆపరేషన్ను చేపట్టడం గమనార్హం.
బలగాలను చుట్టుముట్టి..
చీకటి పడుతున్నా కూలీలు ఇళ్లకు చేరుకోకపోవడంతో.. గ్రామస్థులు ఆందోళన చెందారు. వారికోసం వెతుకుతూ వందల మంది వెళ్లారు. కాల్పుల సంగతి తెలుసుకొని ఆగ్రహంతో ఊగిపోయారు. బలగాలను చుట్టుముట్టి దాడి చేశారు. వాహనాలకు నిప్పుపెట్టారు. ఆత్మరక్షణ కోసం సిబ్బంది మళ్లీ కాల్పులు జరపడంతో.. ఏడుగురు స్థానికులు మృత్యువాతపడ్డారు. పౌరుల దాడిలో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరికొంతమంది సిబ్బంది గాయపడ్డారు. తాజా కాల్పుల ఘటనల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. వారిద్దరినీ అస్సాంకు తరలించామని, మిగతావారికి నాగాలాండ్లోనే చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
ఆగని ఆగ్రహజ్వాలలు
తాజా ఘటన నేపథ్యంలో నాగాలాండ్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కాల్పులు జరిపిన భద్రత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. మోన్ పట్టణంలో ఆందోళనకారులు ఆదివారం కొన్యాక్ యూనియన్ కార్యాలయాలను ధ్వంసం చేశారు. అస్సాం రైఫిల్స్ శిబిరానికీ నిప్పంటించి విధ్వంసం సృష్టించారు. అక్కడ బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృత్యువాతపడ్డారు. ఆందోళనకారుల దాడి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నివారించేందుకుగాను జిల్లా వ్యాప్తంగా మొబైల్ అంతర్జాలం, సంక్షిప్త సందేశ (ఎస్ఎంఎస్) సేవలను అధికారులు నిలిపివేశారు. రాష్ట్రానికి తలమానికంగా భావించే ‘హార్న్బిల్ ఫెస్టివల్’ జరుగుతున్నవేళ తాజా కాల్పులు చోటుచేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కాల్పులకు నిరసనగా ఈ దఫా ఉత్సవాల్లో పాల్గొనకూడదని 11 గిరిజన సంఘాలు నిర్ణయించుకున్నాయి. తాజా కాల్పులను తూర్పు నాగాలాండ్ ప్రజల సంస్థ(ఈఎన్పీవో), ఎన్ఎస్సీఎన్(ఐఎం) తీవ్రంగా ఖండించాయి. ఇండో-నాగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన 1997 నాటి నుంచి చోటుచేసుకున్న అత్యంత దురదృష్టకర ఘటనల్లో ఇదొకటని ఎన్ఎస్సీఎన్(ఐఎం) పేర్కొంది.
విచారణకు ఆదేశించిన సైన్యం
నాగాలాండ్లో సామాన్య పౌరులపై కాల్పులు చోటుచేసుకోవడంపై సైన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ‘కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ’కి ఆదేశించింది. ‘‘తిరుగుబాటుదారుల కదలికలపై మాకు విశ్వసనీయ నిఘా సమాచారం అందింది. దాని ఆధారంగానే మోన్ జిల్లాలోని తిరు ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ను చేపట్టాం. కానీ అక్కడ జరిగిన కాల్పులు, తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర విచారకరమైనవి. అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై అత్యున్నత స్థాయిలో దర్యాప్తు జరుపుతాం. చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం’’ అని సైన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. తాజా పరిణామాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సైన్యాధ్యక్షుడు జనరల్ ఎం.ఎం.నరవణెకు సైన్యం నివేదించింది.
తీవ్ర వేదన కలిగించింది
నాగాలాండ్లోని ఓటింగ్లో చోటుచేసుకున్న దురదృష్టకర ఘటన తీవ్ర మనోవేదన కలిగించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఉన్నత స్థాయి సిట్ ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతుంది.
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
ఓటింగ్ వద్ద అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. కాల్పుల ఘటనపై ఉన్నత స్థాయి సిట్ దర్యాప్తు చేస్తుంది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. శాంతంగా ఉండాలని అన్నివర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నా.
- నీఫియు రియో, నాగాలాండ్ సీఎం
హోంశాఖ ఏం చేస్తున్నట్టు?
ఇది హృదయ విదారక ఘటన. కేంద్రప్రభుత్వం తప్పనిసరిగా సమాధానమివ్వాలి. దేశంలో అటు పౌరులు, ఇటు భద్రత సిబ్బంది సురక్షితంగా లేరు. మరి హోం శాఖ ఏం చేస్తున్నట్టు?
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు