Polavaram: 2022 ఏప్రిల్ నాటికి పోలవరం కష్టమే
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2022 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ప్రస్తుతం పనులు జరుగుతున్న స్థితిని బట్టి చూస్తే అప్పటిలోగా పూర్తయ్యేలా కనిపించడం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందుకే ప్రాజెక్టుకు కొత్త షెడ్యూల్ను సూచించడానికి 2021 నవంబర్లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ప్రాజెక్టు సాగునీటి విభాగం నిర్మాణానికి 2017-18 ధరల ప్రకారం రూ.35,950.16 కోట్లు అవుతుందని
కొత్త షెడ్యూల్ ఖరారుకు కమిటీ ఏర్పాటు
ప్రాజెక్టు సాగునీటి పనులకు సవరించిన అంచనా వ్యయం రూ.35,950 కోట్లు
పీపీఏ సిఫార్సు తర్వాత దీనికి పెట్టుబడి అనుమతి తీసుకుంటాం
రాజ్యసభలో కేంద్రం వెల్లడి
ఈనాడు - దిల్లీ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2022 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ప్రస్తుతం పనులు జరుగుతున్న స్థితిని బట్టి చూస్తే అప్పటిలోగా పూర్తయ్యేలా కనిపించడం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందుకే ప్రాజెక్టుకు కొత్త షెడ్యూల్ను సూచించడానికి 2021 నవంబర్లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ప్రాజెక్టు సాగునీటి విభాగం నిర్మాణానికి 2017-18 ధరల ప్రకారం రూ.35,950.16 కోట్లు అవుతుందని సవరించిన అంచనాల (రివైజ్డ్ కాస్ట్) కమిటీ 2020 మార్చిలో ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు కేంద్రం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సిఫార్సుల తర్వాత దీనికి పెట్టుబడి అనుమతులు తీసుకోనున్నట్లు చెప్పింది. పోలవరం సవరించిన అంచనాలపై సోమవారం రాజ్యసభలో వైకాపా నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడూ ఈ మేరకు సమాధానమిచ్చారు.
‘2017-18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్ల పోలవరం సాగునీటి ప్రాజెక్టు రెండో సవరించిన అంచనాలకు 2019 ఫిబ్రవరిలో జల్శక్తి శాఖ ఆధ్వర్యంలోని ఇరిగేషన్, ఫ్లడ్ఫ్లో కంట్రోల్, మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అడ్వయిజరీ కమిటీ తన 141వ సమావేశంలో ఆమోదం తెలిపింది. తర్వాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ 2020 మార్చిలో నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టు సాగునీటి విభాగం నిర్మాణానికి 2017-18 ధరల ప్రకారం రూ.35,950.16 కోట్లు అవుతుందని వ్యయాన్ని విభజించింది. పీపీఏ సిఫార్సు తర్వాత దానికి పెట్టుబడుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 2014 ఏప్రిల్ 1 నాటికి.. సాగునీటి విభాగం మిగిలిన భాగం నిర్మాణానికయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే నూరు శాతం సమకూర్చాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును బిల్లులు అందగానే పీపీఏ, సీడబ్ల్యూసీ సిఫార్సుల ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ అనుమతితో ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తున్నాం. 2014 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకూ రూ.11,600.16 కోట్లు చెల్లించాం. తర్వాత పీపీఏ, సీడబ్ల్యూసీలు రూ.711.60 కోట్ల చెల్లింపునకు సిఫార్సు చేశాయి’ అని బిశ్వేశ్వర్ టుడూ తెలిపారు.
నిర్మాణంపై వీటన్నింటి ప్రభావం
విభిన్న కారణాలు పోలవరం నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపినట్లు భాజపా ఎంపీ సుజనాచౌదరి అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడూ సమాధానమిచ్చారు. కొవిడ్ మహమ్మారి, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం, దిగువ కాఫర్ డ్యామ్లకు చెందిన గ్యాప్-1, గ్యాప్-2ల్లో లోతుగా కోతపడటం (డీప్ స్కారింగ్) సహాయ, పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయడంలో జాప్యం వంటివి నిర్మాణంపై ప్రభావం చూపినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టును నిపుణులు, నైపుణ్య సంస్థలు క్రమం తప్పకుండా సందర్శిస్తున్నట్లు తెలిపారు.
వివిధ దశల్లో పనులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన సమాచారం ప్రకారం ప్రాజెక్టు పరిధిలోని స్పిల్వే, ఎగువ కాఫర్ డ్యాం, కాంక్రీట్ డ్యాం (గ్యాప్-3), డయాఫ్రం వాల్కు చెందిన ఎర్త్ కం రాక్ ఫిల్డ్యాం (గ్యాప్-1) నిర్మాణం పూర్తయినట్లు బిశ్వేశ్వర్ టుడూ తెలిపారు. తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం చెప్పారు. మిగిలిన ప్రధాన విభాగాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నట్లు తెలిపారు. అందులో స్పిల్వే రేడియల్ గేట్లు 88%, స్పిల్ ఛానల్ 88%, అప్రోచ్ ఛానల్ ఎర్త్ వర్క్ 73%, పైలట్ ఛానల్ వర్క్ 34%, పవర్ హౌస్ ఫౌండేషన్ ఎక్సవేషన్ 97% పురోగతి సాధించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని నెలవారీగా పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పంపుతోందన్నారు. దాని ప్రకారం 2019 జనవరి నుంచి 2021 నవంబర్ వరకు పనుల పురోగతిని కేంద్ర మంత్రి వివరించారు.
పోలవరం నిధుల అంచనాలు- మంజూరు, కోత క్రమం ఇలా..
* 2010-11 అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అంచనా వ్యయం రూ.16010.45 కోట్లుగా లెక్క తేల్చారు. అప్పట్లో సాంకేతిక కమిటీ ఆమోదం ప్రకారమే అవే నిధులిస్తూ వస్తున్నారు.
* ఆ తర్వాత 2013-14 అంచనా ధరలతోనూ, 2017-18 అంచనా ధరలతోనూ పోలవరం ప్రాజెక్టుకు ఎంత మొత్తం వ్యయమవుతుందో లెక్కించారు. కేంద్ర జలసంఘం ప్రతిపాదనను సాంకేతిక సలహా కమిటీ దాదాపు ఆమోదించినా అంచనాల సవరణ కమిటీ (ఆర్సీసీ) భారీగా కోత పెట్టింది.
* 2013-14 ధరల ప్రకారం ఆర్సీసీ రూ.29,075 కోట్లకు ఆమోదించింది. అందులో తాగునీటి విభాగం కింద రూ.4,068.43 కోట్లు, విద్యుత్కేంద్రం కోసం రూ.4,560.91 కోట్లు మినహాయించి రూ.20,398.61 కోట్లు ఇవ్వాల్సిన మొత్తంగా తేల్చింది. దీనిలో అప్పటికే కేంద్రం ఇచ్చిన నిధులు మినహాయించి ఇక రూ.7,053 కోట్లే ఇస్తామని నిరుడు అక్టోబరులో తేల్చిచెప్పింది. పైగా ప్రధాన డ్యాం నిర్మాణం, కుడి కాలువ, ఎడమ కాలువ, పునరావాసం, భూసేకరణ విభాగానికి ఆ అంచనాల్లో ఎంత మొత్తం ఆమోదించామో అంతకుమించి నిధులు ఇవ్వబోమని చెబుతోంది. ప్రస్తుతం ఈ లెక్కల ప్రకారమే నిధులు వస్తున్నాయి. దీంతో రూ.కోట్ల బిల్లులు పీపీఏ నుంచి వెనక్కి వస్తున్నాయి.
* 2017-18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లకు పెట్టుబడి అనుమతి ఇవ్వాలని రాష్ట్రం కోరుతోంది. అంతవరకు విభాగాల వారీ నిబంధనలు, తాగునీటి విభాగం నిధుల కోత మినహాయించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో 2017-18 ధరల ప్రకారం సాగునీటి విభాగం కింద రూ.35,950.16 కోట్లకు కేంద్రం పెట్టుబడి అనుమతి ఇవ్వాల్సి ఉందని కేంద్రం సోమవారం రాజ్యసభలో ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?