ఓటీఎస్... ఓ కాల్మనీ
పేదల నుంచి డబ్బు గుంజేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్ పథకం పేరుతో కాల్మనీని ప్రోత్సహిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కరోనాతోనూ, రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతోనూ పనుల్లేక అప్పుల్లో కూరుకుపోయిన
అది పేదల మెడకు ప్రభుత్వం బిగిస్తున్న ఉరితాడు
తెదేపా అధినేత చంద్రబాబు మండిపాటు
ఈనాడు, అమరావతి: పేదల నుంచి డబ్బు గుంజేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్ పథకం పేరుతో కాల్మనీని ప్రోత్సహిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కరోనాతోనూ, రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతోనూ పనుల్లేక అప్పుల్లో కూరుకుపోయిన పేదలు ఓటీఎస్ ఎందుకు కట్టాలని ఆయన నిలదీశారు. సోమవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి జగన్ది దివాళాకోరుతనం. ఓటీఎస్ పథకం పేదల మెడకు ఉరితాడు. అయినా పట్టాలివ్వడానికి జగన్ ఎవరు? ఆయనేమైనా వారి కోసం భూమి కొన్నారా? రుణం ఇచ్చారా? ఇళ్లు కట్టారా? 30, 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ హయాంలో మొదలైన పేదలకు పక్కా ఇళ్ల పథకాన్ని తర్వాత నేను కొనసాగించాను. పేదల భద్రతకు భరోసా ఎలా ఇవ్వాలి? వారికి మరింత మెరుగ్గా ఇల్లు ఎలా నిర్మించాలని మేం ఆలోచిస్తే.. జగన్ మొత్తం దోపిడీ చేస్తూ, పేదల మెడకు ఉరితాడు వేస్తున్నారు’ అని చంద్రబాబు మండిపడ్డారు. పులిచింతల పాజ్రెక్టు నిర్మాణానికి ఇళ్లు వదులుకుని, పునరావాస కాలనీల్లో ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఇళ్లు కట్టుకున్నవారినీ ఓటీఎస్ కట్టమనడం కంటే దారుణం ఏముంటుందని ధ్వజమెత్తారు. ఓటీఎస్ కింద ప్రజలెవరూ డబ్బు చెల్లించవద్దని, సహాయ నిరాకరణ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పేదలకు ఇళ్లపట్టాల్ని ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెదేపా అధికారంలోకి వచ్చాక ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తుందన్నారు.
సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చట్టవిరుద్ధం
ఓటీఎస్లో డబ్బు చెల్లించిన వారికి గ్రామసచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తామనడం చట్టవిరుద్ధమని చంద్రబాబు పేర్కొన్నారు. ‘రిజిస్ట్రేషన్ చేసే అధికారం సబ్రిజిస్ట్రార్కే ఉంటుంది గానీ, జగన్రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో చేస్తామంటే కుదరదు. రిజిస్ట్రేషన్ కోసం స్టాంప్ పత్రాల్ని కూడా వైకాపా రంగుల్లో తయారుచేయడం వాళ్ల ఉన్మాదానికి పరాకాష్ట. నెల్లూరు జిల్లా బాలాయపాలెం మండలంలో ప్రతి రోజు ఒక్కరితోనైనా ఓటీఎస్ కట్టించాలని జేసీ విదేహ్ ఖరే లక్ష్యాలు పెట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో డ్వాక్రా మహిళల పొదుపు ఖాతా నుండి సొమ్ము తీసుకునేలా బలవంతపు తీర్మానాలు చేయించారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు ఎంపీడీవో.. ఓటీఎస్ కట్టనివారికి కుల ధ్రువీకరణపత్రాలు కూడా ఇవ్వొద్దని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఓటీఎస్ లక్ష్యాలు పూర్తి చేయాల్సిందేనని ఆదేశించారు’ అని ధ్వజమెత్తారు.
‘ఓటీఎస్ కింద డబ్బు కట్టకపోతే పింఛను నిలిపేస్తామని సంతబొమ్మాళిలో సచివాలయ కార్యదర్శి నోటీసిచ్చారని ప్రశ్నించిన తెదేపా నాయకులపై కేసులు బనాయించారు. ఉచితంగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేయిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి.. ఇప్పుడు మాట తప్పి, మడమ తిప్పినందుకు జగన్పైనే చీటింగ్ కేసు పెట్టాలి. బొబ్బిలిలో పొల్లూరి బుల్లెమ్మ వాళ్ల అబ్బాయికి వైద్యం కోసం రూ.15 వేలు రుణం తీసుకుంటే వాటిని బలవంతంగా ఓటీఎస్ కింద కట్టించుకున్నారు. వాళ్లకు మానవత్వం ఉందా’ అని చంద్రబాబు మండిపడ్డారు. ఆ అబ్బాయి చికిత్స ఖర్చును తెదేపా భరిస్తుందని ప్రకటించారు. ఆ అబ్బాయి వైద్యానికయ్యే ఖర్చు తానుభరిస్తానంటూ మునిరత్నం అనే విశ్రాంత ప్రభుత్వోద్యోగి ముందుకు వచ్చారు.
ఓటీఎస్ వసూళ్లపై పౌరుల ఆగ్రహంతో వీడియో
‘మా ఇంటి పట్టాను మాకు మీరు రిజిస్ట్రేషన్ చేసేదేంటి? నా భార్యను మళ్లీ నాకిచ్చి పెళ్లి చేస్తాం అన్నట్టుంది మీ పద్ధతి’- ఓటీఎస్ కింద డబ్బు కట్టాలని, స్థలం రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పేందుకు వచ్చిన ఉద్యోగిపై ఒక పౌరుడి ఆగ్రహం ఇది. ఇలాంటి పలువురి ఆవేదనలతో ‘ఓటీఎస్ వసూళ్లు... పేదల మెడకు ఉరితాళ్లు’ పేరుతో తెదేపా రూపొందించిన వీడియోను చంద్రబాబు విలేకర్ల సమావేశంలో ప్రదర్శించారు.
అమరావతిలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించాలి
అంబేడ్కర్ 65వ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ‘2016లో అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా అమరావతిలో 125 అడుగుల ఎత్తైన విగ్రహం పెట్టాలని నిర్ణయించాం. ఆ ప్రాజెక్టును వైకాపా ప్రభుత్వం నాశనం చేసింది’ అన్నారు. అమరావతిలో అంబేడ్కర్ విగ్రహం నిర్మించాలని డిమాండ్ చేశారు.
ప్రతి గ్రామంలో గౌరవ సభలు
తెదేపా వ్యూహకమిటీ తీర్మానం
ఈనాడు, అమరావతి: ప్రజా సమస్యలు చర్చించాల్సిన అసెంబ్లీలో జగన్, వైకాపా ఎమ్మెల్యేలు మహిళలను అవమానించేలా వ్యవహరించడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గౌరవ సభలు నిర్వహించాలని, సీఎం విధానాలను ఎండగట్టాలని తెదేపా తీర్మానించింది. తెదేపా జాతీయ కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన సోమవారం పార్టీ వ్యూహ కమిటీ సమావేశమైంది. 17న తిరుపతిలో అమరావతి రైతుల మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా తెదేపా సంఘీభావం తెలపాలని నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.