పోరుబాట మొదలు
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛనుదారులు పోరుబాట పట్టారు. పీఆర్సీ సహా మొత్తం 71 ఆర్థిక, ఆర్థికేతర డిమాండ్లు నెరవేర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ నిరసనకు దిగారు.
నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు
కలెక్టరేట్లు, కార్యాలయాల ఎదుట నిరసన
రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు పెద్ద ఎత్తున ఉద్యమం
ఉద్యమానికి విశాఖలో సంఘీభావం ప్రకటిస్తున్న ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు,
సహాయ ఛైర్మన్ ఫణి పేర్రాజు, విశాఖ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు తదితరులు
ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని అడగాల్సిన ఈ పరిస్థితి నా 40 ఏళ్ల సర్వీసులో ఎన్నడూ చూడలేదు.
-బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస ఛైర్మన్
కోరి తెచ్చుకున్న ప్రభుత్వమే విస్మరించింది. ఉద్యోగుల సంయమనాన్ని ప్రభుత్వం చులకనగా తీసుకోకూడదు.
-బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్
ఈనాడు- అమరావతి, యంత్రాంగం: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛనుదారులు పోరుబాట పట్టారు. పీఆర్సీ సహా మొత్తం 71 ఆర్థిక, ఆర్థికేతర డిమాండ్లు నెరవేర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ నిరసనకు దిగారు. తొలిదశ ఉద్యమంలో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు, పలు సంఘాలకు చెందిన ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మండల, తాలూకా, డివిజన్, జిల్లా స్థాయి కార్యాలయాలు మొదలు రాష్ట్రస్థాయిలోని శాఖాధిపతుల కార్యాలయాల వరకూ అన్నిచోట్లా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వర్తించారు. కార్యాలయాల వెలుపల ఉద్యోగుల ఐక్యవేదిక జెండాలు, బ్యానర్లు ప్రదర్శించి నినాదాలు చేశారు. వెంటనే పీఆర్సీ ప్రకటించాలని, సీపీఎస్ రద్దుచేయాలని, పెండింగ్లో ఉన్న ఏడు డీఏలు ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండు చేశారు. విధులకు హాజరయ్యే ముందు జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి కాసేపు నిలుచున్నారు.
కర్నూలు కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న ఉద్యోగ సంఘాల నేతలు,
ఉద్యోగులు.. పాల్గొన్న ఏపీ అమరావతి ఐకాస ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,
ఏపీ ఐకాస సెక్రటరీ జనరల్ హృదయరాజు తదితరులు
విశాఖ, కాకినాడల్లో బండి... కర్నూలులో బొప్పరాజు
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల్లో ఉద్యమస్ఫూర్తి నింపేందుకు విశాఖపట్నం, కాకినాడల్లో జరిగిన కార్యక్రమాల్లో ఏపీ ఐకాస ఛైర్మన్, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, నాయకులు ఫణి పేర్రాజు, ఈశ్వరరావు, కర్నూలు కలెక్టరేట్ ఎదుట జరిగిన కార్యక్రమంలో ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, నాయకులు హృదయరాజు, శివారెడ్డి, బీవీ రమణారెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగులకు నల్లబ్యాడ్జీలు అందించి నిరసన కార్యక్రమాల్ని ప్రారంభించారు. 210 సంఘాలకు చెందిన దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనల్లో పాల్గొన్నారని వారు వెల్లడించారు. మండల, తాలూకా, డివిజన్, జిల్లా స్థాయిల్లో నిరసనలు మొదలయ్యాయి. ఈ నెల 10వ తేదీ వరకూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా నల్లబ్యాడ్జీలతో విధులకు వెళ్లనున్నారు.
రవాణా శాఖ కార్యాలయం వద్ద అడ్డగింత
* ఉద్యోగుల ఐక్యవేదిక నాయకులు విద్యాసాగర్, వై.వి.రావు, ఇక్బాల్ తదితరులు ఉద్యోగులకు మద్దతుగా విజయవాడలోని ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయం (ఆర్టీఏ)లోకి వెళ్తుండగా.. పోలీసులు వారిని అడ్డగించారు. రవాణాశాఖ ఉద్యోగుల్ని కలిసేందుకు అనుమతించలేదు. దీంతో వారు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు వారిని అనుమతించారు.
* ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏలూరు పంపుల చెరువు, ఆర్టీసీ డిపో వద్ద ఉద్యోగులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కలెక్టరేట్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
* గుంటూరు కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసనలో ఐకాస ఛైర్మన్ శ్రీనివాసరావు, నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండు చేశారు.
* ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లోని కలెక్టరేట్లలో నల్లబ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు నిరసన తెలిపారు.
ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా విజయవాడలోని
నీటిపారుదల శాఖ కార్యాలయం ముందు నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు
చేస్తున్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!