భో‘జన ఘోష’!
ఆదర్శ పాఠశాలల్లోని బాలికల వసతి గృహాలకు బిల్లుల చెల్లింపు నిలిచిపోవడంతో విద్యార్థులకు భోజనం అందించలేక ప్రిన్సిపాళ్లు చేతులెత్తేసున్నారు. వసతి గృహంలో ఉన్న పిల్లల్ని ఇళ్లకు
ఆదర్శ పాఠశాలల వసతి గృహాల్లో బిల్లుల పెండింగ్
సరకుల సరఫరా నిలిపివేస్తున్న గుత్తేదార్లు
భోజనం అందించలేక ఇబ్బందులు
సొంత డబ్బుతో పెట్టిన ప్రిన్సిపాల్పై సస్పెన్షన్ వేటు!
వసతి గృహం నుంచి వెళ్లిపోతున్న బాలికలు
ఈనాడు, అమరావతి: ఆదర్శ పాఠశాలల్లోని బాలికల వసతి గృహాలకు బిల్లుల చెల్లింపు నిలిచిపోవడంతో విద్యార్థులకు భోజనం అందించలేక ప్రిన్సిపాళ్లు చేతులెత్తేసున్నారు. వసతి గృహంలో ఉన్న పిల్లల్ని ఇళ్లకు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు గుత్తేదార్లకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్లో ఉండడంతో చాలాచోట్ల సరకుల సరఫరా నిలిపివేశారు. ఈ పరిస్థితుల్లో పిల్లలకు భోజనం అందించడం కష్టంగా ఉందంటూ ఈనెల 3న జిల్లా విద్యాధికారి, ఉన్నతాధికారులకు కడప జిల్లా ఖాజీపేట ప్రిన్సిపాల్ సమాచారం ఇచ్చారు. దీనిపై అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో సోమవారం రాత్రి నుంచి భోజనం అందించలేమని, పిల్లల్ని ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు. ఆరు నెలలుగా రూ.6 లక్షల వరకు బకాయిలు చెల్లించలేదని, గుత్తేదారు నిత్యావసర సరకులు పంపిణీ చేయలేదని, దీంతో వసతి గృహం మూసివేయాల్సి వచ్చిందని ప్రిన్సిపల్ సురేష్ తెలిపారు. పిల్లల భోజనానికి ఆయన ఇప్పటి వరకు రూ.80వేలు సొంత డబ్బును సైతం ఖర్చు చేశారు.
ఖాజీపేటలోని ఆదర్శ వసతి గృహం
ఈ విషయంపై ‘ఈటీవీ’లో కథనం రావడంతో స్పందించిన అధికారులు మంగళవారం రాత్రి అందుబాటులో ఉన్న 30 మంది విద్యార్థినులకు భోజనం అందించారు. బుధవారం నుంచి మిగిలిన పిల్లలూ వస్తారని చెప్పారు. అందరికీ భోజనం అందించాలని ప్రిన్సిపాల్ను వారు ఆదేశించారు. మరోవైపు వసతి గృహాన్ని మంగళవారం మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఖాజీపేట ఎంపీపీ అబుబుకార్ సిద్ధిక్, వైకాపా నాయకులతో కలిసి తనిఖీ చేసి బాలికలతో మాట్లాడారు. ప్రిన్సిపల్పై అనేక ఆరోపణలున్నాయని ఫోన్ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే డిమాండు చేశారు. దీంతో ప్రిన్సిపల్ ఎం.సురేష్బాబును సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆర్జేడీ ఎం.వెంకటకృష్ణారెడ్డి ఉత్తర్వులిచ్చారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై చట్టబద్ధమైన చర్యల్లో భాగంగా సస్పెండు చేసినట్లు చెప్పారు. విద్యార్థులకు భోజన వసతి కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, మెనూ ప్రకారం భోజనాలు అందించకపోవడం, నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో సస్పెండు చేసినట్లు ఆర్జేడీ తెలిపారు. ఇన్ఛార్జి ప్రిన్సిపల్గా అదే పాఠశాలలో పనిచేస్తున్న ఎకనమిక్స్ అధ్యాపకురాలు డి.విజయభారతిని నియమించారు. సొంతంగా ఖర్చు పెట్టి, ఇక భరించలేక పిల్లలకు భోజనం పెట్టలేనని ఇళ్లకు పంపిస్తే ఆ ప్రిన్సిపాల్ను సస్పెండు చేయడం ఏమిటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతూ మరోపక్క మెనూ ప్రకారం పిల్లలకు భోజనం పెట్టలేదని సస్పెండు చేయడం ఎంతవరకు సబబు అన్న ప్రశ్న వినిపిస్తోంది.
బాలికలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
ఇదీ పరిస్థితి..
రాష్ట్ర వ్యాప్తంగా 164 ఆదర్శ పాఠశాలలుండగా.. వీటికి అనుబంధంగా 145 బాలికల వసతి గృహాలు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 10వేల మంది విద్యార్థినులు ఉంటున్నారు. 9 నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదివేవారు ఇక్కడ వసతి పొందుతున్నారు. ఒక్కో విద్యార్థినికి మెస్ ఛార్జీల కింద నెలకు రూ.1,500 చొప్పున చెల్లిస్తారు. గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నెల బిల్లును ప్రభుత్వం చెల్లించలేదు. ఇది పెండింగ్లో ఉండగానే సెప్టెంబరు నుంచి మళ్లీ వసతి గృహాలను పునఃప్రారంభించారు. ఒక పక్క ధరలు పెరగడం, మరోపక్క బిల్లులు పెండింగ్లో ఉండడంతో పెట్టుబడి పెట్టలేక గుత్తేదారులు సరకుల సరఫరా నిలిపివేస్తున్నారు. కొన్నిచోట్ల అరకొరగా సరఫరా చేస్తున్నారు. దీంతో ప్రిన్సిపాళ్లు సొంత డబ్బులతోనో..అప్పులు చేసో పిల్లలకు మెనూ ప్రకారం భోజనం పెట్టాల్సి వస్తోంది. ఈ అప్పుల బాధలు భరించలేక కడప జిల్లా వల్లూరు ఆదర్శ పాఠశాలలో వసతి గృహాన్ని ఇప్పటి వరకు తెరవలేదు. పిల్లల భోజనాల కోసం ఈ ప్రిన్సిపల్ గత ఏడాది సుమారు రూ.2.40లక్షలు ఖర్చు చేశారు. ఈ బిల్లుల డబ్బు గుత్తేదారు ఖాతాలో పడగా.. ఆయన ప్రిన్సిపాల్కు ఇవ్వలేదు.
నిర్వహణ ఖర్చులు లేవు..
వసతి గృహాల్లో మరుగుదొడ్లు, గదుల శుభ్రత, తాగునీటి బోర్ల మరమ్మతులు, ఇతరాత్ర ఖర్చులకు ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు. నిర్వహణకు నిధులు ఇవ్వాలని ప్రిన్సిపాళ్లు ఇటీవల ఉన్నతాధికారులను కోరినా దీన్ని వారు పట్టించుకోలేదు. దీంతో నిర్వహణ కోసమూ ప్రిన్సిపాళ్లు జేబుల నుంచే డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది.
గుత్తేదారుకు బిల్లులు చెల్లించక.. బాలింతలకు ఆకలి చింత
ఆదోని ఆసుపత్రిలో భోజనం సరఫరా నిలిపివేత
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలు
ఆదోని పురపాలికం, న్యూస్టుడే: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో భోజనం సరఫరాను మంగళవారం నిలిపివేశారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు చేతులెత్తేశారు. సుమారు రూ.10 లక్షల వరకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. భోజనం పెట్టరని ముందుగా తెలియక బాలింతలు ఎంతో ఇబ్బందిపడ్డారు. 50 మంది వరకు హోటళ్ల నుంచి తెప్పించుకొని తిన్నారు. మూడు పూటలా భోజనాలకు ఒక్కొక్కరికీ రూ.300 ఖర్చయిందని, దూర ప్రాంతాల నుంచి వచ్చామని, తమను ఎవరూ పట్టించుకోలేదని ఉరుకుంద గ్రామానికి చెందిన ఉష వాపోయారు. సమస్యను ఆసుపత్రి పర్యవేక్షకురాలు మాధవీలత దృష్టికి తీసుకెళ్లగా భోజనం సరఫరా నిలిపివేస్తున్నట్లు గుత్తేదారు ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఆదోని ఆసుపత్రిలో 50 పడకలున్నాయి. నిత్యం 10 నుంచి 15 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఇక్కడే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల కేంద్రమూ ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!