కొనుగోలుదారులపై భారం రూ.217.50 కోట్లు
లేఅవుట్లో 5% స్థలాన్ని వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టుకు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో కొనుగోలుదారులపై ఏటా రూ.217.50 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా.
స్థిరాస్తి వ్యాపార వర్గాల్లో అసంతృప్తి
ఈనాడు, అమరావతి: లేఅవుట్లో 5% స్థలాన్ని వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టుకు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో కొనుగోలుదారులపై ఏటా రూ.217.50 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా. ఎకరాపై ఈ భారం రూ.7.25 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. స్థిరాస్తి వ్యాపార రంగం ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయంపై ఆయా వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం లేఅవుట్లో 30% స్థలాన్ని రహదారులు, కాలువలు, ఇతర సదుపాయాల కల్పనకు కేటాయిస్తున్నారు. మరో 10% స్థలాన్ని సామాజిక అవసరాలకు సంబంధిత పట్టణాభివృద్ధి సంస్థలు, పురపాలక సంస్థలకు బదలాయిస్తున్నారు. ఎకరా స్థలంలో 40 శాతం మినహాయిస్తే...మిగిలిన 60 శాతం (2,904 చదరపు గజాల స్థలం)లో ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. ఇందులో నుంచి మరో 5% స్థలాన్ని కేటాయించాలంటే దాదాపు 145 చ.గజాల స్థలాన్ని ఒదులుకోవాలి. మార్కెట్లో ప్రస్తుతం చ.గజం సగటున రూ.5 వేల ధరకు విక్రయిస్తున్నారు. అంటే ఎకరా స్థలంలోనే రూ.7.25 లక్షల విలువైన స్థలం కోల్పోవాల్సి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏటా 3 వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో కొత్త లేఅవుట్లకు అనుమతులిస్తున్నారు. అంటే వీటిలో నుంచి 5% స్థలం అంటే 4.35 లక్షల చదరపు గజాలు జగనన్న హౌసింగ్ ప్రాజెక్టుకి కేటాయించాలి. చ.గజం ధర రూ.5 వేల ప్రకారం లెక్కిస్తే ఈ స్థలం విలువ రూ.217.50 కోట్లుగా వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భారాన్ని భరించడానికి సిద్ధంగా లేమని...కొనుగోలుదారులపైనే వేస్తామంటున్నారు. ప్రస్తుతం విక్రయిస్తున్న ధరపై మరో రూ.వెయ్యి అదనంగా పెంచక తప్పదని విజయవాడకు చెందిన స్థిరాస్తి వ్యాపారి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏటా 300 నుంచి 400 లేఅవుట్లకు దరఖాస్తులొస్తున్నాయి. వీటిలో అత్యధికంగా విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉంటున్నాయి. తరువాత స్థానంలో ఉభయగోదావరి, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలు ఉన్నాయి.
కొవిడ్తో కొనుగోళ్లు బాగా తగ్గాయి
‘లేఅవుట్లో 5% స్థలాన్ని వ్యాపారులు కేటాయించాలంటే అంతిమంగా ఈ భారం కొనుగోలుదారులపై పడుతుంది. భూముల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అదే స్థాయిలో వ్యాపారం జరగడం లేదు. కొవిడ్తో కొనుగోళ్లు సైతం బాగా తగ్గాయి. ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నాం’.
- తాళ్లూరి శివాజీ, నెరెడ్కో విశాఖ ఛాప్టర్ వ్యవస్థాపక ఛైర్మన్
వెనక్కి తీసుకోవాలి
‘లేవుట్లలో ఐదు శాతం స్థలాన్ని కేటాయించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్థిరాస్తి వ్యాపార సంఘాలతో కలిసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. లేఅవుట్లో ఇప్పటికే 40% స్థలాన్ని ప్రజావసరాల కోసం కేటాయిస్తున్నాం. స్థిరాస్తి రంగం కూడా ఇబ్బందుల్లో ఉన్నందున మా విజ్ఞాపనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం’
-జి.హరిబాబు, జాతీయ స్థిరాస్తి వ్యాపార సమాఖ్య (నెరెడ్కో) రాష్ట్ర అధ్యక్షుడు
మూడు కిలో మీటర్లలో ఎక్కడైనా ఇవ్వొచ్చు కదా!
‘లేఅవుట్లోనే 5% స్థలాన్ని ఇవ్వాలని వ్యాపారులపై ఒత్తిడి తేవడం లేదు. మూడు కిలో మీటర్లలోపు ఎక్కడైనా ఇచ్చేలా వెసులుబాటు కల్పించాం. ఉమ్మడి రాష్ట్రంలోనూ లేఅవుట్లో 5% స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్నే అమలు చేస్తున్నాం తప్ప కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు. భాగస్వాములందరి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నాకే జీవో ఇచ్చాం’
- బొత్స సత్యనారాయణ, పురపాలకశాఖ మంత్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
సంక్షిప్త వార్తలు
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
చెరలోనే అనుమానితులు!
సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో వడ్డెర కాలనీకి చెందిన అనుమానితులు ఇంకా పోలీసుల చెరలోనే ఉన్నారు. వారి ఆచూకీ గురించి చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. -
సెలవుపై వెళ్లిన గృహనిర్మాణ సంస్థ ఎండీ
గృహనిర్మాణ సంస్థ ఎండీ వెంకటరమణారెడ్డి నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారు. ఆరోగ్యపరమైన కారణాలతో సెలవు కోసం ఆయన దరఖాస్తు చేసుకోగా.. ప్రభుత్వం అనుమతించింది. -
ఇదేనా బైబిల్కిచ్చే గౌరవం?
మ్యానిఫెస్టో అత్యంత పవిత్రమైంది... మాకది బైబిల్, ఖురాన్, భగవద్గీతలతో సమానం! ఇందులో ఇస్తున్న ప్రతి హామీని నెరవేర్చి తీరుతా... అమలు చేయలేని హామీని ఇవ్వను... ఇచ్చిన వాటిని మరెవ్వరికీ సాధ్యం కానట్లుగా అమలు చేస్తా... 2019 ఎన్నికలప్పుడు జగన్ ఊరూరా ఊదరగొట్టిన మాటలివి!! -
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పైపైకి!
రాష్ట్రంలో రోజురోజుకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం అత్యధికంగా నంద్యాల జిల్లా పెద్ద దేవళాపురంలో 44.9, పార్వతీపురం మన్యం జిల్లాలోని మక్కువ, వైయస్ఆర్ జిల్లాలోని సింహాద్రిపురంలో 44.3, అనకాపల్లి జిల్లా రావికమతం, విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం, తుమికాపల్లి, ప్రకాశం జిల్లాలోని దొనకొండ, తిరుపతి జిల్లాలోని మంగనెల్లూరులో 44.1, కర్నూలు జిల్లా వగరూరులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!