పోలవరంలో పనులు చేశాం...

‘పోలవరంలో 2016నాటి కాంట్రాక్టు సంస్థ వద్ద ఉప కాంట్రాక్టర్లుగా పనిచేశాం. మాకు సుమారు రూ.40 కోట్ల మేర బిల్లులు రావాల్సి ఉంది...’అని పలువురు సబ్‌ కాంట్రాక్టర్లు మంగళవారం

Published : 08 Dec 2021 04:18 IST

బకాయిలు ఇప్పించండి

సజ్జలకు విన్నవించుకున్న పాత సబ్‌ కాంట్రాక్టర్లు

ఈనాడు, అమరావతి: ‘పోలవరంలో 2016నాటి కాంట్రాక్టు సంస్థ వద్ద ఉప కాంట్రాక్టర్లుగా పనిచేశాం. మాకు సుమారు రూ.40 కోట్ల మేర బిల్లులు రావాల్సి ఉంది...’అని పలువురు సబ్‌ కాంట్రాక్టర్లు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని వైకాపా కేంద్ర కార్యాలయంలో కలిసి తెలిపారు. తమ సమస్యను ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని కోరారు. ‘ఆ రూ.40 కోట్లలో సగం చెల్లిస్తామని దానికి మా నుంచి బలవంతంగా సమ్మతి పత్రాలను అప్పట్లో తీసుకున్నారు. ఆ డబ్బు ఇవ్వలేదు. నాలుగైదేళ్లుగా గత ప్రభుత్వంలో, తర్వాత సంబంధిత అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు...’అని వారు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని