మరో విదేశీ ప్రయాణికుడికి కొవిడ్‌

సింగపూర్‌ నుంచి రాష్ట్ర చిరునామాతో హైదరాబాద్‌ విమానాశ్రయానికి చేరిన ప్రయాణికుల్లో ఒకరికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది.

Published : 09 Dec 2021 03:13 IST

ఈనాడు, అమరావతి: సింగపూర్‌ నుంచి రాష్ట్ర చిరునామాతో హైదరాబాద్‌ విమానాశ్రయానికి చేరిన ప్రయాణికుల్లో ఒకరికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. విమానాశ్రయ అధికారులు, వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఆ ప్రయాణికుడిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు. నమూనాను జీనోమ్‌ స్వీకెన్స్‌ కోసం సీసీఎంబీకి పంపారు.  

24 గంటల్లో 181 కేసులు: రాష్ట్రంలో 24 గంటల్లో 181 కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య 31,957 నమూనాలు పరీక్షించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని