జన హారతులు.. ఘన స్వాగతాలు
రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు రాయలసీమ జనం బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామగ్రామాన రైతులు, యువత, మహిళలు...
రాయలసీమలో అమరావతి రైతుల మహాపాదయాత్రకు విశేష మద్దతు
చింతలపాలెం నుంచి శ్రీకాళహస్తికి సాగుతున్న పాదయాత్ర
ఈనాడు, తిరుపతి: రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు రాయలసీమ జనం బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామగ్రామాన రైతులు, యువత, మహిళలు... యాత్రలో పాల్గొంటున్న వారికి ఘన స్వాగతం పలుకుతున్నారు. చిత్తూరు జిల్లాలో సాగుతున్న పాదయాత్రకు సీమలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి సంఘీభావం తెలిపారు. నంద్యాలకు చెందిన మౌలానా ముస్తాక్ అహ్మద్తోపాటు పలువురు ముస్లిం సోదరులు శ్రీవేంకటేశ్వరస్వామి రథం ముందు నమాజు చేసి పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగాలని ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కుటుంబసభ్యులతో కలిసి యాత్ర పాల్గొన్నారు.
నారాయణ సంఘీభావం
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఇటీవల ఆయన కాలుకు దెబ్బతగిలింది. కాలుకు కట్టుతో ఉన్న ఆయన పాదయాత్రలోని శ్రీవేంకటేశ్వరస్వామి రథంపై కూర్చుని రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పోలీసులు అనుమతించకపోయినా 17న బహిరంగసభ జరిగి తీరుతుందన్నారు. తెదేపా చిత్తూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పులివర్తి నానితోపాటు జేడీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పాదయాత్రకు మద్దతు తెలుపుతున్న పులివెందుల అన్నదాతలు
పులివెందుల నియోజకవర్గం నుంచి..
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లికి చెందిన పలువురు రైతులు మహాయాత్రలో పాల్గొన్నారు. అమరావతికి మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
శ్రీకాళహస్తిలో ఆంక్షలు
శ్రీకాళహస్తి పట్టణంలో గురువారం చేపట్టనున్న పాదయాత్రపై పోలీసులు ఆంక్షలు విధించారు. బుధవారం యాత్ర జింగిలిపాలెం దాటాక తిరుపతి అర్బన్ ఇన్ఛార్జి ఎస్పీ విద్యాసాగర్నాయుడు... అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి, కో కన్వీనర్ తిరుపతిరావులను పిలిచి మాట్లాడారు. శ్రీకాళహస్తి మాడవీధుల్లో పాదయాత్ర వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున విరమించుకోవాలని, దేవస్థానంలో దర్శనం చేసుకునేందుకు అభ్యంతరం లేదన్నారు. శ్రీకాళహస్తిలో యథావిధిగా యాత్ర కొనసాగుతుందని పరిరక్షణ సమితి నేతలు స్పష్టం చేశారు.
కాలుకు కట్టుతో కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ
రైతుల బాధ ముందు నాదెంత!
పాదయాత్రలో బత్తయ్య
ఒక్క పైసా తీసుకోకుండా రాజధాని ఏర్పాటుకు వేల ఎకరాలు ఇచ్చి.. ఇప్పుడు ప్రజల భవిష్యత్తు కోసం మహాపాదయాత్ర చేస్తున్న రైతుల బాధ ముందు తనది ఎంతని వరదయ్యపాళెం మండలం సంతవెల్లూరుకు చెందిన రైతు పాటి బత్తయ్య పేర్కొన్నారు. వికలాంగుడైన బత్తయ్య మహాపాదయాత్రకు మద్దతుగా వెంకటగిరి నుంచి నడుస్తూ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడుతూ.. ‘వేల ఎకరాలు ఇచ్చిన రైతుల బతుకులు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. వారిని తలచుకుంటే నా గుండె చెరువవుతోంది. నాకు ఇటీవల వెన్నెముక ఆపరేషన్ అయింది. కరోనాతో ఇబ్బందులు పడ్డాను. అమరావతినే కొనసాగించాలంటూ పట్టుదలగా సాగుతున్న రైతుల ఇబ్బంది ముందు నా బాధ చిన్నది అనిపించింది. రైతులు, మహిళలు వందల కిలోమీటర్లు నడుస్తుంటే నేను కొంతదూరమైనా వారితో సాగకపోతే ఎలా... అనిపించింది. తిరుమల వరకు రైతులతో కలిసి పాదయాత్ర కొనసాగిస్తా’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?