APIIC:ఐటీ సెజ్ భూములను కట్టబెట్టేశారు!
అది ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల తయారీ సంస్థ. దానికి నగరానికి దూరంగా ఎక్కడ భూములు ఇచ్చినా సరిపోతుంది. కానీ, కడప నగరానికి ఆనుకుని ఉన్న విలువైన భూములను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక
ఒకే దరఖాస్తు.. షిరిడీసాయి ఎలక్ట్రికల్స్కు 49.8 ఎకరాలు
మార్కెట్ ధర రూ.150 కోట్లు.. రూ.42.5 కోట్లకే ధారాదత్తం
ఈనాడు-అమరావతి, న్యూస్టుడే-కడప నగరపాలక: అది ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల తయారీ సంస్థ. దానికి నగరానికి దూరంగా ఎక్కడ భూములు ఇచ్చినా సరిపోతుంది. కానీ, కడప నగరానికి ఆనుకుని ఉన్న విలువైన భూములను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) కట్టబెట్టింది. పరిశ్రమకు కేటాయించిన భూముల చుట్టూ నివాస ప్రాంతాలే ఉన్నాయి. సింగపూర్ టౌన్షిప్, కేంద్రీయ విద్యాలయం, రామకృష్ణ మఠం, ప్రభుత్వాసుపత్రి, ప్రభుత్వం నిర్మిస్తున్న క్యాన్సర్ ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లాంటివి సుమారు అర కిలోమీటరు పరిధిలో చుట్టూ ఉన్నాయి. వాటిమధ్యలో పరిశ్రమ ఏర్పాటుకు భూములను కేటాయించటంపై స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒకే సంస్థకు ఐటీ సెజ్ భూములు
కడప నగరాన్ని అనుకుని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సమీపంలో సీపీ బ్రౌన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిటీ పేరిట ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలిని (ఐటీ సెజ్) 2007లో అప్పటి వైఎస్ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. దీనికోసం 52.76 ఎకరాలను పుట్లంపల్లి గ్రామ పరిధిలోని 260, 261, 264, 266, 267/1, 267/2 సర్వే నంబర్లలో ఉన్న భూములను ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వం సేకరించింది. ఇందులో 0.31 ఎకరాలను సబ్స్టేషన్ ఏర్పాటుకు దక్షిణప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు ఏపీఐఐసీ గతంలో కేటాయించింది. ఇది పోను ఇంకా 52.45 ఎకరాల భూములను 8 ఐటీ పరిశ్రమలకు కేటాయించేలా ఏపీఐఐసీ డీటీఎల్పీ నెం 9716/110/07/ఎ ద్వారా లే అవుట్ను రూపొందించింది. ఈ మేరకు ప్రతిపాదనను కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ ఆమోదానికి పంపి.. ఐటీ సెజ్ కింద అప్పటి ప్రభుత్వం నోటిఫై చేసింది.
మూడోవంతు ధరకే...
దాదాపు ఈ సెజ్ భూములన్నింటినీ కడపకు చెందిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనే సంస్థకు ఏపీఐఐసీ కట్టబెట్టింది. బహిరంగ మార్కెట్లో ఎకరా సుమారు రూ.3 కోట్లు ఉంటుంది. అంటే వాటి విలువ సుమారు రూ.150 కోట్లు అవుతుంది. ఈ భూములకు 2021 మార్చి 22న ప్లాట్ ధరను చదరపు కి.మీ. రూ.2,108 వంతున ఏపీఐఐసీ వీసీఎండీ ఫైల్ నెం-1337705 ద్వారా ఖరారు చేశారు. దీని ప్రకారం ఎకరా రూ.85.31 లక్షలు అవుతుంది. ఇవే భూములను ట్రాన్స్ఫార్మర్ల తయారీ పరిశ్రమకు రూ.42.48 కోట్లకు కేటాయిస్తూ 2021 అక్టోబరు 21న ప్రొవిజినల్ అలాట్మెంట్ ఉత్తర్వులను ఏపీఐఐసీ జారీచేసింది.
ఎస్ఐపీసీ పరిధికి రాకుండా..
ఏపీఐఐసీ నిబంధనల ప్రకారం.. పరిశ్రమల ఏర్పాటుకు 5 ఎకరాల్లోపు ప్లాట్ల కేటాయింపు ప్రతిపాదనలపై జిల్లా స్థాయిలోని పెట్టుబడులు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు చేసిన 60 రోజుల్లో కేటాయించకపోతే మాత్రమే ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలోని రాష్ట్రస్థాయి భూముల కేటాయింపు కమిటీ (ఎస్ఎల్ఏసీ) సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి. 5 నుంచి 50 ఎకరాల వరకు ఉన్న కేటాయింపు ప్రతిపాదనలపై ఎస్ఎల్ఏసీ సమావేశంలో సంస్థ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (వీసీఎండీ) నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ వీసీఎండీ నిర్ణయం తీసుకోవటంలో జాప్యం జరిగితే ఏపీఐఐసీ బోర్డు సమావేశంలో చర్చించాలి. 50 ఎకరాలకు మించిన ప్రతిపాదనలు ఏవైనా సరే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ), సీఎం ఛైర్మన్గా ఉన్న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ (ఎస్ఐపీబీ) నిర్ణయం తీసుకోవాలి. దీన్ని దృష్టిలో ఉంచుకునే షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్కు భూముల కేటాయింపు విషయంలో అధికారులు జాగ్రత్తపడ్డారు. దీనికోసం సెజ్కు ప్రతిపాదించిన భూముల్లో ఎస్పీడీసీఎల్కు కేటాయించిన 0.31 ఎకరాలు పోను మిగిలిన 52.45 ఎకరాల్లో షిరిడీ సాయి సంస్థకు పూర్తిగా కేటాయించకుండా.. 49.8 ఎకరాలను కేటాయిస్తూ ప్రొవిజినల్ అలాట్మెంట్ను ఏపీఐఐసీ జారీచేసింది. ఈ సంస్థకు డైరెక్టర్గా నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డి 11 ఏళ్లుగా వ్యవహరిస్తున్నారు. శరత్చంద్ర కొల్లా, వినోద్, విక్రం రవీంద్ర మామిడిపూడి, కనకధార శ్రీనివాసన్ గత రెండు మూడేళ్లలో డైరెక్టర్లుగా చేరారు. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్కు కేటాయించిన ప్లాట్ విస్తీర్ణం పోను మిగిలిన 2.65 ఎకరాలను ఎస్పీడీసీఎల్కు కేటాయించాలని నిర్ణయించినట్లు ఏపీఐఐసీ అధికారులు తెలిపారు.
ఒకే ఒక్క దరఖాస్తు
ఐటీ సెజ్ కింద నోటిఫై చేసిన తర్వాత.. దానికి మళ్లీ కేంద్రం నుంచే ఉపసంహరణ ఉత్తర్వులు రావాలి. దీనికోసం విశాఖలోని ఐటీ సెజ్ నుంచి ప్రతిపాదన వెళ్లింది. దీని ప్రకారం 2020 నవంబరు 18న కేంద్రం నుంచి డీ నోటిఫై ఆదేశాలు జారీ అయ్యాయి. అప్పటినుంచి ఆ భూములను ఇతర అవసరాలకు వినియోగించుకోటానికి కేటాయించే అధికారం ఏపీఐఐసీకి వస్తుంది. ఈ భూముల కేటాయింపు కోసం షిరిడీ సాయి సంస్థ దరఖాస్తు చేసుకుందని.. ఈ మేరకు ప్రతిపాదన పరిశీలించి లీజు ప్రాతిపదికన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్వోసీ) ఇచ్చామని ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదర్శన్ బాబు తెలిపారు. ఈ భూముల కోసం ఒకే సంస్థ దరఖాస్తు చేసుకుందని.. ఎక్కువ దరఖాస్తులు ఉంటే వేలం ద్వారా కేటాయించే వాళ్లమని పేర్కొన్నారు. ఐటీ సెజ్కు కేటాయించిన భూములను డీ నోటిఫై చేసి.. షిరిడీసాయి ఎలక్ట్రికల్స్కు కేటాయించినట్లు కడప ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ జయలక్ష్మి ‘ఈనాడు’కు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM