రాజకీయ హత్యల.. రావణకాష్ఠం
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ హత్యలు మళ్లీ పెచ్చరిల్లుతున్నాయి. తమ ఆధిపత్యానికి అడ్డంగా ఉన్నారంటూ ప్రత్యర్థులను అంతం చేస్తున్నారు. ప్రతిపక్ష తెదేపా నాయకులే లక్ష్యంగా ఈ వరుస హత్యలు జరుగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా గుండ్లపాడులో తెదేపా నాయకుడు తోట చంద్రయ్య హత్యతో ఇలాంటి దారుణాలు మరోమారు చర్చనీయాంశం అయ్యాయి.
ఆధిపత్యానికి అడ్డంగా ఉన్నారని అంతం చేస్తున్నారు
ప్రతిపక్ష తెదేపా నాయకులే లక్ష్యంగా వరుస హత్యలు
వెంటాడి చంపుతున్న ఘోరం
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ హత్యలు మళ్లీ పెచ్చరిల్లుతున్నాయి. తమ ఆధిపత్యానికి అడ్డంగా ఉన్నారంటూ ప్రత్యర్థులను అంతం చేస్తున్నారు. ప్రతిపక్ష తెదేపా నాయకులే లక్ష్యంగా ఈ వరుస హత్యలు జరుగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా గుండ్లపాడులో తెదేపా నాయకుడు తోట చంద్రయ్య హత్యతో ఇలాంటి దారుణాలు మరోమారు చర్చనీయాంశం అయ్యాయి. రాజకీయంగా అడ్డు తొలగించుకోవడమే లక్ష్యంగా వేటాడి, వెంటాడి మరీ చంపిన ఉదంతాలు గత రెండున్నరేళ్లలో అనేకం చోటుచేసుకున్నాయి. ఫలితంగా పచ్చని పల్లెలు పగలు, ప్రతీకారాలతో రగిలిపోతున్నాయి. వరుస ఘటనలు జరుగుతున్నా పోలీసులు వాటిని నిలువరించట్లేదని, కొందరి ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా తగిన భద్రతా చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
వరుస హత్యలు.. చర్యలు శూన్యం
* కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో తెదేపా నాయకులు వడ్డి నాగేశ్వరరెడ్డి, వడ్డి ప్రతాప్రెడ్డిలను వాహనంతో ఢీకొట్టి, వేట కొడవళ్లతో నరికి కిరాతకంగా హతమార్చారు. సోదరుడి కర్మకాండల కోసం శ్మశానానికి వెళ్లి వస్తుండగా దుండగులు వారిని వాహనంతో ఢీకొట్టారు. ఆ బృందం చెల్లాచెదురు కాగానే హత్య చేశారు. గతేడాది జూన్లో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన వైకాపా నాయకులే ఈ హత్యలు చేశారని అప్పట్లో బాధితుల కుటుంబసభ్యులు ఆరోపించారు.
* కడప జిల్లాలో తెదేపా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్యను 2020 డిసెంబరులో కొందరు హత్య చేశారు. ఆయన్ను ఇంటినుంచి బయటకు రప్పించి కళ్లల్లో కారం కొట్టి, చుట్టుముట్టి వేట కొడవళ్లతో నరికేశారు. ఈ ఘటన జరగటానికి అయిదు రోజుల ముందు ఆయన ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డిపై పలు ఆరోపణలు చేస్తూ వీడియోలు రూపొందించి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. తన భర్త హత్యకు ప్రజాప్రతినిధి, ఆయన బావమరిదే కారణమంటూ సుబ్బయ్య భార్య అపరాజిత అప్పట్లో ఆరోపించారు.
* గుంటూరు జిల్లా దాచేపల్లిలో తెదేపా నేత పురంశెట్టి అంకులును గతేడాది జనవరి 3న కొందరు హతమార్చారు. అంకులుకు ఒక ఫోన్కాల్ రావటంతో రాత్రి 7 గంటలకు దాచేపల్లిలోని ఓ అపార్ట్మెంట్ వద్దకు ఒంటరిగా వెళ్లారు. ఆయన తిరిగి రాకపోవటంతో కారు డ్రైవర్ అపార్ట్మెంట్ లోపలికి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్న అంకులు కనిపించారు.
సమగ్ర విచారణేది?
ఎవరైనా హత్యకు గురైనప్పుడు.. బాధిత కుటుంబసభ్యులు ఎవరిపైనైనా అనుమానం వ్యక్తం చేస్తే పోలీసులు వారికి నోటీసులిచ్చి విచారించి, వాస్తవాలు తేల్చాలి. రాజకీయ హత్యల విషయంలో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరి మీదైనా ఆరోపణలు చేస్తూ, ఫిర్యాదులిచ్చినా.. వారిని నిందితులుగా చేర్చటం లేదు. ప్రతిపక్ష నాయకుల హత్య కేసుల్లో అధికార పార్టీ వారు అనుమానితులుగా ఉంటే.. వారి పాత్రను నిగ్గు తేల్చేలా దర్యాప్తు సాగించట్లేదన్న విమర్శలున్నాయి.
హత్యోదంతాలు... ఇవిగో తార్కాణాలు
* తెదేపా నాయకుడు మంజుల వడ్డె సుబ్బారావును 2019 డిసెంబరు 17న కర్నూలు జిల్లా బెలుం గుహల వద్ద ప్రత్యర్థులు హతమార్చారు. కత్తితో నరికి, తలపై బండరాయితో మోది చంపారు. ఈ కేసులో వైకాపా నాయకులు నిందితులుగా ఉన్నారు.
* కృష్ణా జిల్లా నాగాయలంక మండలం పెదగౌడపాలేనికి చెందిన తెదేపా గ్రామ కమిటీ అధ్యక్షుడు, ఆ పార్టీ తరఫున స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తాతా సాంబశివరావు (33) 2020 జులై 1న దారుణ హత్యకు గురయ్యారు.
* గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం అంబాపురంలో దోమతోట విక్రమ్ (32) అనే తెదేపా కార్యకర్త 2020లో హత్యకు గురయ్యారు. వైకాపా వర్గీయుల దాడిలో ఆయన చనిపోయారని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.
* ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి ఎస్సీ కాలనీలో లక్కెపోగు సుబ్బారావుపై కొంతమంది మారణాయుధాలతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు.
* తెదేపా నాయకుడు ఉమాయాదవ్ను గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన ఇంటి ముందే కత్తులతో నరికి కొందరు చంపారు. 2019 జూన్లో ఈ ఘటన జరిగింది.
* కర్నూలు జిల్లా నిడ్జూరులో తెదేపా కార్యకర్త శ్రీనివాసరావును గతేడాది మే నెలలో కొందరు హతమార్చారు. తమ కుటుంబం ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి వైకాపా నాయకులు తమ కుటుంబసభ్యుల్ని వెంటాడారని.. చివరికి శ్రీనివాసరావును చంపేశారని అప్పట్లో బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు.
పాత కక్షలు, వ్యక్తిగత అంశాలే కారణమని తేల్చేస్తున్నారు
రాజకీయం ఆధిపత్యం చాటుకునేందుకు జరుగుతున్న హత్యలకూ పాతకక్షలు, వ్యక్తిగత అంశాలు, కుటుంబ వివాదాలే కారణాలంటూ పోలీసులు తేల్చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. రాజకీయంగా ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవాలన్న కసితో అధికార పార్టీ నాయకులే ఈ ఘాతుకాలు చేయిస్తున్నారని, పోలీసులు వారి ఒత్తిళ్లకు తలొగ్గి సూత్రధారుల్ని వదిలేస్తున్నారని ప్రతిపక్ష తెదేపా విమర్శిస్తోంది. ఉదాహరణకు నందం సుబ్బయ్య హత్య కేసులో ఎమ్మెల్యేకు సంబంధం ఉన్నట్లు నిర్ధారణ కాలేదని ఘటన జరిగిన రోజునే కడప జిల్లా ఎస్పీ అంబురాజన్ ప్రకటించారు. పురంశెట్టి అంకులు హత్యకు రాజకీయ కారణాలేవీ లేవని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ చెప్పారు. నాగాయలంక మండలంలో హత్యకు పాతకక్షలే కారణమని అక్కడి డీఎస్పీ చెప్పారు. సమగ్ర దర్యాప్తు చేయకుండానే ఆ హత్యలతో అధికార పార్టీ నాయకులకు సంబంధం లేదని చెప్పడమేంటని ప్రతిపక్ష తెదేపా ప్రశ్నిస్తోంది.
32 నెలల్లో 33 మంది..: తెదేపా
గత 32 నెలల్లో 31 మంది తెదేపా నాయకులు, కార్యకర్తలు హత్యకు గురయ్యారని, మరో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారని ఆ పార్టీ చెబుతోంది. పది రాజకీయ హత్యల ఉదంతాలతోపాటు మరో 23 మంది కూడా రాజకీయ హత్యలకు గురైనట్లు పేర్కొంటోంది. ఆ జాబితా ఇలా...
* చంద్రశేఖర్ - ధర్మవరం, అనంతపురం జిల్లా
* చింతా భాస్కర్రెడ్డి - వీరాపురం, తాడిపత్రి మండలం, అనంతపురం జిల్లా
*రాజప్ప - పత్యాపురం, బత్తలపల్లి మండలం, అనంతపురం జిల్లా
* బత్తుల సుబ్బులు - తంగెడ, దాచేపల్లి మండలం, గుంటూరు జిల్లా
*చిట్టిబోయిన వెంగయ్య - మినగల్లు, అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా
* పద్మ - వివస్త్రను చేసి ప్రాణాలు తీసుకునేలా చేశారు- రుద్రమాంబపురం, చినగంజాం మండలం, ప్రకాశం జిల్లా
*దత్తి వెంకటరావు - పెదపెంకి, బలిజిపేట మండలం, విజయనగరం జిల్లా
*కేళావతు రాజానాయక్ - భట్రుపాలెం, దాచేపల్లి మండలం, గుంటూరు జిల్లా
* సయ్యద్ జాన్ - తంగెడ, దాచేపల్లి మండలం, గుంటూరు జిల్లా
* మేలుపాక గోపి - తొట్టంబేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గం, చిత్తూరు జిల్లా
* తమ్మిశెట్టి నీలకంఠబాబు - నారాయణపురం, దాచేపల్లి మండలం, గుంటూరు జిల్లా
* గురప్ప - నరసాపురం, కాశినాయన మండలం, కడప జిల్లా
* భరత్యాదవ్ - తిరుపతి, చిత్తూరు జిల్లా
* ఊటుకూరి వీరబాబు- మండపం,శంఖవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా
* అరెద్దుల కోటయ్య - జంగమహేశ్వరపాడు, దుర్గి మండలం, గుంటూరు జిల్లా
* సబ్బెళ్ల శ్రీనివాసరెడ్డి - గొల్లలగుంట, జగ్గంపేట మండలం, తూర్పుగోదావరి జిల్లా
* అర్జున్ నాయక్ (అనుమానాస్పద మృతి) - కొత్తూరు గ్రామం, బల్లికురవ, ప్రకాశం జిల్లా
* ఆదినారాయణ (అనుమానాస్పద మృతి) - భైరవ్నగర్, అనంతపురం జిల్లా
* గరికపాటి కృష్ణారావు * పిచ్చయ్య యాదవ్
* పాలకొల్లు సొమయ్య - గొల్లలమంద, ఎ.కొండూరు, కృష్ణా జిల్లా
* గొల్ల గోపాల్ - మలకాపురం, రాయదుర్గం మండలం, అనంతపురం జిల్లా
* ఖాదర్ బాషా (మద్యంలో విషం పోసి చంపారు) - పిన్నెల్లి, గుంటూరు జిల్లా
- ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత