Covid: పండగ వేళ.. పారాహుషార్!
సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్న తరుణంలో కొవిడ్ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. కేసుల ఉద్ధృతికి తగ్గట్టే ఆస్పత్రుల్లో చేరుతున్న వారూ పెరుగుతున్నారు. పండగ సమయంలో కొవిడ్ నిబంధనలను పాటిస్తూ స్వీయరక్షణ పాటించాల్సిన అవసరాన్ని ఇది ప్రస్ఫుటం చేస్తోంది....
ఆస్పత్రుల్లో పెరుగుతున్న చేరికలు
19,610 మంది బాధితుల్లో 7.14% మంది చేరిక
డిసెంబరులోకంటే పెరిగిన ఇన్పేషెంట్లు
ఉదాసీనత వద్దు: వైద్య నిపుణులు
ఈనాడు, అమరావతి: సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్న తరుణంలో కొవిడ్ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. కేసుల ఉద్ధృతికి తగ్గట్టే ఆస్పత్రుల్లో చేరుతున్న వారూ పెరుగుతున్నారు. పండగ సమయంలో కొవిడ్ నిబంధనలను పాటిస్తూ స్వీయరక్షణ పాటించాల్సిన అవసరాన్ని ఇది ప్రస్ఫుటం చేస్తోంది. గతంలో డెల్టా వైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపి అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత కాస్త తక్కువగా ఉండటంతో బాధితులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరణాలు తక్కువగా నమోదవడం ఉపశమనాన్నిస్తోంది. ఒమిక్రాన్ మరింత విస్తరించి ప్రమాదకరంగా మారినట్లయితే ఆస్పత్రుల్లో పడకలు సరిపోని పరిస్థితులేర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత డిసెంబరులో 1,381 మంది కొవిడ్ ఆస్పత్రుల్లో చేరారు. జనవరి ఒకటి నుంచి 14వ తేదీవరకు 2వారాల్లోనే 1400 మంది ఆస్పత్రుల్లో చేరడం గమనార్హం. గతేడాది జూన్ తరువాత ఈ స్థాయిలో కేసుల నమోదు ఇదే తొలిసారి. ఈ లెక్కన నెలాఖరునాటికి ఆస్పత్రుల్లో చేరే కేసులు రెండు రెట్ల వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. జనవరి 1నుంచి 14వరకు 19,610 కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ప్రస్తుతం 7.14% (డిశ్ఛార్జిలు మినహాయిస్తే) మంది ఆస్పత్రుల్లోనే ఉన్నారు. గరిష్ఠంగా చిత్తూరు జిల్లాలో 362 మంది చికిత్స పొందుతున్నారు. విశాఖ జిల్లాలో వీరి సంఖ్య 172 వరకుంది. గుంటూరు జిల్లాలో 129 మంది బాధితులు దవాఖానాల్లో ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 49, విజయనగరం జిల్లాలో 18 మంది చొప్పున చికిత్స పొందుతున్నారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలలో ప్రస్తుతానికి 56 మంది చొప్పున ఇన్పేషెంట్లుగా ఉన్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 1400 మందిలో ఐసీయూలో 238, ఆక్సిజన్ పడకలపై 783, వెంటిలేటర్లపై 58, ఇతరులు జనరల్ వార్డుల్లో ఉన్నారు.
14 రోజుల్లో 13 మంది మృతి
రాష్ట్రంలో ప్రస్తుతం క్రియాశీల కేసులు 18,313 ఉన్నాయి. ఈనెల 1నుంచి శుక్రవారం వరకు కొవిడ్తో మరణించినవారు 13 మంది వరకున్నారు. డిసెంబరు31 నుంచి జనవరి 13లోగా 18ఏళ్లలోపు ఉండి ఆస్పత్రుల్లో చేరినవారు 61 మంది ఉన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోనూ భారీగా కేసులు
పట్టణాలు/నగరాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తొలి, మలివిడతలోకంటే ఈసారి వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. గురువారం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో గరిష్ఠంగా 27.88% కేసులు నమోదయ్యాయి.
తాడేపల్లిలో 21.63% కేసులు
ముఖ్యమంత్రి జగన్ నివాసమున్న గుంటూరు జిల్లా తాడేపల్లిలో 21.63%, నెల్లూరు జిల్లా ముత్తుకూరులో 21.61%, విశాఖ జిల్లా పరవాడ 20.33%, తిరుపతి 20.33%, మంగళగిరి 19.53%, కొత్తవలస (విజయనగరం) 18.70%, పాడేరు (విశాఖపట్నం) 18.49%, సబ్బవరం (విశాఖపట్టణం) 18.07%, భీమునిపట్నం (విశాఖపట్నం) 17.73%, రేణిగుంట (చిత్తూరు) 17.71% చోడవరం (విశాఖపట్నం) 17.56%, కాకినాడ (తూర్పుగోదావరి) 17.51%, ఆనందపురం (విశాఖపట్నం)లో 17.27% చొప్పున కేసులొచ్చాయి. ప్రకాశం జిల్లా పామూరులో 16.67%, కడప జిల్లా ఎర్రగుంట్ల ప్రాంతంలో 16.67%, రాజానగరం(తూర్పుగోదావరి)లో 15.19%, పెనమలూరు(కృష్ణా)లో 13.55%, కె.కోటపాడు (విశాఖ)లో 13.47% చొప్పున కేసులొచ్చాయి. మున్సిపాలిటీలపరంగా చూసినా సూళ్లూరుపేటలోనే కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
కొత్తగా 4,528 కేసులు
గురువారం ఉదయం 9నుంచి శుక్రవారం ఉదయం 9గంటల మధ్య 39,816 నమూనాలను పరీక్షించగా, 4,528 మందికి పాజిటివ్గా తేలింది. జనవరి ఒకటిన పాజిటివిటీ 0.57%గా ఉంది. 2వారాల వ్యవధిలో అదనంగా 10.8% పెరిగి 11.37శాతానికి పెరిగింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,027 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులు ఎక్కువగా తిరుపతిలోనే వస్తున్నాయి. అక్కడ ఇటీవల జాతీయస్థాయి కబడ్డీ పోటీలు జరిగాయి. క్రీడాకారులు, పోటీల నిర్వహణలో పాల్గొన్న సిబ్బంది పలువురు కరోనా బారినపడ్డారు. దీనికితోడు యాత్రికుల రద్దీ ఉన్నందున వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. చిత్తూరు జిల్లా తర్వాత విశాఖ జిల్లాలో 992 కేసులు రికార్డయ్యాయి. అనంతపురం జిల్లాలో 300, తూర్పుగోదావరి-327, గుంటూరు-377, నెల్లూరు-229, శ్రీకాకుళం-385, కడప-236 కేసులు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లోనూ వందకుపైబడే కేసులొచ్చాయి. ప్రకాశం జిల్లాలో కొవిడ్తో ఒకరు ప్రాణాలు విడిచారు.
జాగ్రత్తలు అవసరం
సంబరంగా జరుపుకొనే సంక్రాంతి, కనుమ సందర్భంగా చాలాచోట్ల గ్రామస్థులంతా ఒక్కచోట గుమిగూడే అవకాశాలెక్కువే. ఈ సమయంలో మాస్కు ధరించడం, ఇతర కరోనా మార్గదర్శకాలను తప్పక పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
వైద్యం కోసం..!
ఈ చిత్రంలోని మహిళ పేరు సుశీలమ్మ. ఊరు చిత్తూరు జిల్లా ఏర్పేడు. 3రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆయాసంగా ఉండటంతో గురువారం కొవిడ్ పరీక్ష చేయడంతో పాజిటివ్గా నిర్ధారణ అయింది. శుక్రవారం ఉదయం తిరుపతి స్విమ్స్ కొవిడ్ ఆసుపత్రికి తెచ్చారు. ఆసుపత్రిలో చేర్చుకునే వరకు వైద్యశాల బయట ఆక్సిజన్ ఏర్పాటుచేసి ఇలా ఉంచారు. కొవిడ్ కేసులు పెరిగిపోతున్నాయడానికి ఈ చిత్రం సాక్ష్యంగా నిలుస్తోంది. వ్యాధి మళ్లీ విజృంభిస్తున్నందున రుయా, స్విమ్స్లలో తిరిగి జర్మన్షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు.
- ఈనాడు, తిరుపతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు. -
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల విచారణ నుంచి...
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)