నరసరావుపేట రణరంగం
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో వైఎస్సార్ విగ్రహం తొలగింపు అనంతర పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. తెదేపా-వైకాపా నాయకుల పోటాపోటీ ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలతో జొన్నలగడ్డ, నరసరావుపేట పట్టణం రణరంగాన్ని తలపించాయి.
వైఎస్ విగ్రహం మాయంపై తమ కార్యకర్తలను అరెస్టు చేశారని తెదేపా ధర్నా
తోపులాటలో నియోజకవర్గ ఇన్ఛార్జి అరవిందబాబుకు అస్వస్థత
ఆయనను ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్సుపై వైకాపా కార్యకర్తల దాడి
తెదేపా రాష్ట్ర నేతల నిరసన..అరవిందబాబుకు పరామర్శ
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే-నరసరావుపేట పట్టణం: గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో వైఎస్సార్ విగ్రహం తొలగింపు అనంతర పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. తెదేపా-వైకాపా నాయకుల పోటాపోటీ ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలతో జొన్నలగడ్డ, నరసరావుపేట పట్టణం రణరంగాన్ని తలపించాయి. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబుపై పోలీసులు శనివారం చేయి చేసుకున్నారని, ఆయన ప్రయాణిస్తున్న అంబులెన్సుపై వైకాపా కార్యకర్తలు రాళ్లు రువ్వారని తెదేపా నేతలు ఆరోపించారు. పార్టీ నాయకులు ఆదివారం ఉదయాన్నే పేటకు చేరుకుని పోలీసు, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేశారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరవిందబాబును పరామర్శించారు.
వివాదం ఇదీ..
వైఎస్సార్ విగ్రహం తొలగింపు కేసులో తెదేపా కార్యకర్తలు జొన్నలగడ్డకు చెందిన అనిల్, రాజేష్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారిని విడుదల చేయాలని డాక్టర్ అరవిందబాబు శనివారం సాయంత్రం జొన్నలగడ్డ ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్ నిలిచిపోతోందని చెప్పినా ధర్నా కొనసాగించటంతో పోలీసులు ఆయనను బలవంతంగా అక్కడి నుంచి లేవదీస్తుండగా తెదేపా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఈ పెనుగులాటలో అరవిందబాబు కిందపడి, అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే పోలీసులు అంబులెన్సు రప్పించి నరసరావుపేట తరలిస్తుండగా దారిలో జొన్నలగడ్డ సాయిబాబా కాలనీ వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై వైకాపా కార్యకర్తలు దాడికి యత్నించారు. ఈ దాడిలో అంబులెన్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. అనంతరం అరవిందబాబును ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు. తెదేపా రాష్ట్ర నేతలు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, జవహర్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, సీనియర్ నేతలు యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, తెనాలి శ్రావణ్కుమార్, ఎమ్మెల్సీ అశోక్బాబు, పిల్లి మాణిక్యాలరావు తదితరులు ఆదివారం పేటకు వచ్చి అరవిందబాబును పరామర్శించారు.
ఇద్దరి అరెస్టు... విడుదల
వైఎస్ విగ్రహాన్ని తొలగించిన వారిని 24 గంటల్లో అరెస్టు చేయాలని గుంటూరు-కర్నూలు రహదారిపై నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ధర్నా చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితులను పట్టుకుంటామని హామీనిచ్చి డాగ్స్క్వాడ్తో జొన్నలగడ్డ, రంగారెడ్డిపాలెం గ్రామాల్లో తనిఖీలు చేయించారు. వేలిముద్రలు సేకరించారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలు తీసి వెతికారు. ఆ రోజు గ్రామానికి చెందిన ఇద్దరు తెదేపా కార్యకర్తలు బైకుపై విగ్రహం వద్దకు వెళ్లినట్లు నిర్ధారించుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు అరెస్టు చేసిన అనిల్, రాజేష్ షరతులతో కూడిన బెయిలుపై ఆదివారం విడుదలయ్యారు. వారిపై 153, 379, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ ఇంటివద్ద హాజరుపరచగా, ఆయన విచారించి, బెయిలు మంజూరు చేశారు.
దాడులన్నింటికీ చక్రవడ్డీ సహా చెల్లిస్తాం
వైకాపా పాలనలో తెదేపా నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న ప్రతి దాడికి భవిష్యత్తులో చక్రవడ్డీతో కలిపి చెల్లిస్తామని మాజీమంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. జొన్నలగడ్డ ఘటనపై తెదేపా ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ వైకాపా పాలనలో బీసీలపై దాడిని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ బలహీనవర్గాలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు వైకాపా నేతలు దాడులు చేస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, తెనాలి శ్రావణకుమార్ తదితరులు మాట్లాడారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ అరవిందబాబును పరామర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
-
AP News: తెలుగు రాద్దామనుకుంటే.. హిందీ ప్రశ్నపత్రం వచ్చింది
-
బస్సుల్లేక బాధలు.. తికమకలో మరో కేంద్రానికి విద్యార్థిని
-
cVIGIL: మీరు గానీ విజిలేస్తే.. మడతెట్టేస్తారు!
-
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు