ఇంటి అద్దె భత్యంలో భారీ కోత
ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)లో భారీ కోత పడింది. హెచ్ఆర్ఏ శ్లాబులను ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటివరకు జిల్లా కేంద్రాలు, నగరపాలక సంస్థల్లో 20%,
హెచ్ఆర్ఏను తగ్గించిన ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)లో భారీ కోత పడింది. హెచ్ఆర్ఏ శ్లాబులను ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటివరకు జిల్లా కేంద్రాలు, నగరపాలక సంస్థల్లో 20%, పురపాలిక సంఘాలు, 50వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో 14.5%, మిగతా ప్రాంతాల్లో 12% ఇస్తున్నారు. కొత్త విధానంలో 50 లక్షల జనాభాకు మించి ఉన్న నగరాల్లో 24%, 5-50 లక్షల జనాభా ఉంటే 16%, మిగతా ప్రాంతాలు, ఐదు లక్షల వరకూ జనాభా ఉండే చోట 8శాతం హెచ్ఆర్ఏను తీసుకొచ్చింది. 50లక్షలకు పైగా జనాభా ఉన్న నగరం ఏపీలో ఒక్కటీ లేదు. దిల్లీ, హైదరాబాద్ నగరాల్లోని ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే వారికి మాత్రమే 24శాతం వర్తిస్తుంది. విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, విజయవాడ నగరపాలక సంస్థలతో పాటు వెలగపూడి సచివాలయంలో పని చేసే వారికి 16శాతం, ఇతర ప్రాంతాల్లో పని చేసే వారికి 8శాతం వస్తుంది. కేంద్ర ప్రభుత్వ హెచ్ఆర్ఏ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు.
సచివాలయ ఉద్యోగులకు 14శాతం కోత..
హైదరాబాద్ నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం 30 శాతం హెచ్ఆర్ఏ తీసుకుంటుండగా.. కొత్త విధానం ప్రకారం వారికి 16శాతం మాత్రమే వస్తుంది. జనవరి వేతనంలో తగ్గిపోతుంది. ఒక్కో ఉద్యోగి 14శాతం నష్టపోతారు. ఈ మేరకు వేతనాల్లో కోత పడుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన విభాగాధిపతి కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకూ తగ్గిపోనుంది. ప్రస్తుతం వీరు 30శాతం తీసుకుంటుండగా.. శాఖాధిపతుల కార్యాలయాలు ఉన్న ప్రాంతాన్ని అనుసరించి 16శాతం, 8శాతం ఇవ్వనున్నారు. దీంతో వారికి 14శాతం నుంచి 22శాతం వరకు తగ్గిపోతుంది. సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేకంగా 16శాతం హెచ్ఆర్ఏను ఉత్తర్వుల్లో ప్రస్తావించగా.. శాఖాధిపతుల కార్యాలయాలకు స్థిర మొత్తాన్ని పేర్కొనలేదు.
పురపాలికల్లో శాఖాధిపతి కార్యాలయాలు..
విజయవాడ, గుంటూరు జిల్లాల్లో చాలా శాఖాధిపతి కార్యాలయాలు తాడేపల్లి, ఇబ్రహీంపట్నం పురపాలక సంఘాలు, ఈడ్పుగల్లు, గొల్లపూడి లాంటి పంచాయతీల పరిధిలో ఉన్నాయి. ఇలాంటి చోట 8శాతం మాత్రమే హెచ్ఆర్ఏ వస్తుంది. ఇప్పటివరకు 30శాతం తీసుకున్న ఉద్యోగులకు జనవరి నుంచి ఇచ్చే వేతనంలో 8శాతం మాత్రమే ఇస్తారు. ఈ లెక్కన వారు 22శాతం నష్టపోతారు. విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల పరిధిలోని వారికి 14శాతం తగ్గిపోతుంది.
* రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, నగరపాలక సంస్థల పరిధిలో పని చేసే ఉద్యోగులకు ప్రస్తుతం 20శాతం ఇస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, విజయవాడల్లో పని చేసే వారికి మాత్రమే 16శాతం వస్తుంది. ఈ నగరాల్లో పని చేసే వారు 4శాతం హెచ్ఆర్ఏను కోల్పోతారు. మిగతా జిల్లా కేంద్రాలు, నగరపాలక సంస్థల్లో పని చేసే వారికి 8శాతం మాత్రమే వర్తిస్తుంది. దీని ప్రకారం వారు 12శాతం నష్టపోతారు.
* 50వేలకుపైగా జనాభా ఉన్న పురపాలక సంఘాల పరిధిలో 14.5శాతం ఇస్తున్న హెచ్ఆర్ఏ స్థానంలో 8 శాతం మాత్రమే వస్తుంది. అయా ఉద్యోగులు 6.5శాతం నష్టపోతారు.
* గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం 12శాతం ఇస్తుండగా.. ఇక నుంచి 8శాతం మాత్రమే వస్తుంది. అయా ప్రాంతాల్లో పని చేసే వారు 4శాతం నష్టపోతారు.
నగర భత్యం (సీసీఏ) రద్దు
నగర భత్యాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడల్లో ఉన్న వారికి నెలకు రూ.250-700 వరకు సీసీఏ ఇస్తుండగా.. మిగతా ప్రాంతాల్లో రూ.200-రూ.500 వరకు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, చాలా రాష్ట్రాలు దీన్ని నిలిపివేసినందున ఏపీలోనూ నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు