కొత్త పీఆర్సీ కన్నా పాత జీతాలే మిన్న
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. కొత్త వేతన సవరణతో తమకు ఒరిగేది ఏమీ లేదంటున్నారు. కొత్త వేతనాలు వస్తాయని ఎదురుచూస్తుంటే ప్రభుత్వం తమను నిరాశకు గురిచేసిందని
ఉద్యోగుల ఆవేదన
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. కొత్త వేతన సవరణతో తమకు ఒరిగేది ఏమీ లేదంటున్నారు. కొత్త వేతనాలు వస్తాయని ఎదురుచూస్తుంటే ప్రభుత్వం తమను నిరాశకు గురిచేసిందని ఆందోళన చెందుతున్నారు. డీఏలు ఒకేసారి ఇవ్వడం వల్ల జీతాల్లో పెరుగుదల తప్ప కొత్త వేతన సవరణతో అదనంగా అందే జీతం ఏమీలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ కోసం వేయి కళ్లతో వేచిచూసిన తమకు ఇంత నిరాశాజనక పరిస్థితులు ఎదురవుతాయని ఊహించలేదని ఆందోళన వ్యక్తంచేశారు. కొత్త పీఆర్సీ అమలు చేయడం కన్నా పాత పీఆర్సీ కొనసాగిస్తూ ఇదే మధ్యంతర భృతితో, డీఏలన్నీ అమలుచేస్తే ఇంతకన్నా ఎక్కువ జీతాలు వస్తాయని వారు విశ్లేషిస్తున్నారు. అమల్లో ఉన్న పాత పీఆర్సీ, 27% మధ్యంతర భృతి, ఎప్పటినుంచో పెండింగులో ఉన్న కరవుభత్యం, పాత ఇంటి అద్దెభత్యం కలిపి లెక్కిస్తే కొత్త జీతం కన్నా పాత జీతమే ఎక్కువని చెబుతున్నారు. రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగి మాట్లాడుతూ తమకు ఇంటి అద్దెభత్యం, ఐఆర్, సీసీఏ రూపంలో దాదాపు 21% కోత పెట్టి, డీఏల రూపంలో 20.02 ఇచ్చారని, అంతకన్నా సాధించింది ఏముందని వ్యాఖ్యానించారు.
కొందరు ఉద్యోగసంఘాల వారి విశ్లేషణ ఇలా..
* పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పనిచేస్తున్న ఒక ఉద్యోగి మూలవేతనం 30,580. పాత పీఆర్సీ ప్రకారం, ఐఆర్, మొత్తం డీఏలు, 20% హెచ్ఆర్ఏ కలిపి రూ.61,938 మొత్తం వేతనం వస్తుంది. ఈ ఉద్యోగికి డీఏ రూ.16,985, ఇంటి అద్దె భత్యం రూ.6,116, మధ్యంతర భృతి రూ.8,257 అందుతాయి. కొత్త పీఆర్సీ ప్రకారం ఆయనకు అందే మొత్తం జీతం రూ.60,284 మాత్రమే. అంటే రూ.1,654 నష్టపోతారు. ఈ ఉద్యోగికి కొత్త పీఆర్సీలో అన్ని లెక్కలూ వేశాక ఈయనకు వచ్చే మూలవేతనాన్ని తదుపరి దశలో ఉంచితే రూ.47,090గా ఉంటుంది. కరవుభత్యం రూ.9427, అద్దె భత్యం రూ.3,767 మాత్రమే అందుతాయి. ఇంతకుముందు అందుతున్న ఇంటి అద్దెభత్యం రూ.6,116గా ఉంటే తాజా పీఆర్సీలో రూ.3,767 మాత్రమే అందుతుంది. సీసీఏ లేనే లేదు.
* రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఒక సెక్షన్ ఆఫీసర్కు మూలవేతనం రూ.37,100. పాత పీఆర్సీ ప్రకారం ప్రస్తుతం అన్నీ డీఏలూ అమలుచేసి, మధ్యంతర భృతి 27% ఇస్తూ, అమల్లో ఉన్న 30% హెచ్ఆర్ఏ పరిగణనలోకి తీసుకుంటే రూ.10,017 మధ్యంతర భృతి, రూ.11,130 ఇంటి అద్దె భత్యం, రూ.20,607 డీఏ మొత్తంగా వస్తూ మొత్తం రూ.78,854 అందుకుంటారు. అదే కొత్త పీఆర్సీలో కొత్త స్కేలు రూ.57,100గా ఉంటుంది. డీఏ రూపంలో రూ.11,431, ఇంటి అద్దె భత్యం రూ.9,136గా ఉంటుంది. మొత్తం జీతం రూ.77,667గా చేతికి అందుతుందని లెక్కిస్తున్నారు. అంటే నెలకు రూ.1,187 నష్టపోతారు.
* కర్నూలు జిల్లాలోని ఒక మున్సిపాలిటీలో గతంలో ఇంటి అద్దె భత్యం 14.5%. అక్కడ పనిచేసే ఒక ఉద్యోగి మూలవేతనం రూ.20,050. పాత పీఆర్సీ ప్రకారం ఐఆర్, హెచ్ఆర్ఏ, ఇవ్వాల్సిన మొత్తం డీఏలు అమలుచేస్తే ఆ ఉద్యోగికి ఇప్పుడు రూ.39,508 వేతనం వచ్చేది. కొత్త పీఆర్సీ అమలు వల్ల ఆయనకు రూ.39,468 వేతనంగా దక్కుతుంది. అంటే ఈ ఉద్యోగి విషయంలోను నెలకు రూ.40 వరకు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
* ఇంతకుముందు 10% హెచ్ఆర్ఏ ఉండి, ప్రస్తుతం 8%కు పరిమితమైన వారికి వారి స్కేళ్లను బట్టి కొద్దిగా ప్రయోజనం కనిపిస్తోంది.
* పై లెక్కల్లో సీసీఏ వల్ల నష్టపోతున్న మొత్తాలను కలపలేదు. సీసీఏ అన్ని చోట్లా, అందరు ఉద్యోగులకూ వర్తించదు. సీసీఏ అమల్లో ఉన్నచోట ఆ రూపంలో మరికొందరు ఇంకొంత నష్టపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు