ఇప్పటికైనా అన్యాయాన్ని ప్రశ్నిస్తారా?
‘ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని ఇప్పటికైనా ప్రశ్నిస్తారా.. లేదా? పీఆర్సీపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చాక కూడా ఆందోళన చేయకుంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా కార్యాచరణ ప్రకటించాలి’ అని సచివాలయ
సచివాలయంలో వెంకట్రామిరెడ్డి నిలదీత
ఈనాడు, అమరావతి: ‘ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని ఇప్పటికైనా ప్రశ్నిస్తారా.. లేదా? పీఆర్సీపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చాక కూడా ఆందోళన చేయకుంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా కార్యాచరణ ప్రకటించాలి’ అని సచివాలయ ఉద్యోగులు తమ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని నిలదీశారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది భారీసంఖ్యలో సచివాలయంలోని మూడో బ్లాక్లోని సంఘ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని మీరు చెప్పటం వల్లనే నిరసనల్లో పాల్గొనలేదని, ఇప్పటికైనా నిరసన కార్యక్రమాలను ప్రకటిస్తారా.. లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తుందన్న సమాచారంతోనే ఇప్పటివరకు వేచి చూశామని వెంకట్రామిరెడ్డి వారికి చెప్పారు.
ఆందోళన చేస్తాం: వెంకట్రామిరెడ్డి
పీఆర్సీపై జీవోలను నిరసిస్తూ బుధవారం నుంచి ఆందోళన నిర్వహించనున్నట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. జీవోలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. సంఘ కార్యాలయంలో ఉద్యోగుల సమన్వయ సమావేశం సుమారు రెండు గంటలు నిర్వహించారు. అనంతరం సీఎస్ సమీర్శర్మను కలిసి వినతిపత్రం ఇవ్వాలని ప్రదర్శనగా వెళ్లారు. సీఎస్ లేకపోవటంతో ఆయన కార్యాలయంలో వినతిపత్రం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ‘పీఆర్సీసై ఇచ్చిన జీవోలను వెనక్కి తీసుకోవాలి. దీనివల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. దీనిపై దశలవారీగా ఆందోళన నిర్వహిస్తాం. గత రెండు నెలలుగా పీఆర్సీపై ప్రభుత్వం చర్చిస్తోంది. ఫిట్మెంట్ తక్కువైనా మిగిలిన విషయాల దృష్ట్యా అప్పట్లో అంగీకరించాం. హెచ్ఆర్ఏ తగ్గించటాన్ని అంగీకరించేది లేదు’ అన్నారు.
ఉద్యోగ సంఘాలన్నింటితో కలిసి కార్యాచరణ
ఉద్యోగుల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా పీఆర్సీపై ఇచ్చిన జీవోలను పునఃసమీక్షించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. సచివాలయంలో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ప్రకటించిన ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ వల్ల ఉద్యోగుల జీతంలో 4-12 శాతం కోతపడే అవకాశం ఉంది. మధ్యంతర భృతిని రికవరీ చేస్తామనడం ఏంటి? అధికారులు సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారు. మరో రెండు నెలలు ఆలస్యమైనా ఉద్యోగులకు మేలు జరిగేలా ప్రభుత్వం కసరత్తుచేయాలి. ప్రభుత్వతీరుపై పోరాటానికి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తాం’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు. -
పంచాయతీలపై రూ.23.08 కోట్ల వీల్ చైర్ల భారం!
పాడైన తాగునీటి మోటార్లు రిపేరు చేయించడానికి నిధుల్లేక బేల చూపులు చూస్తున్న గ్రామ పంచాయతీలపై మరో పిడుగు పడింది. -
విద్యాదీవెన అందక.. విద్యార్థుల విలవిల
మీరు ఇంజినీరింగ్ చదువుతారో.. ఇంకేం ఉన్నత చదువులు చదువుతారో చదవండి. ఆ చదువులకు అయ్యే ఫీజులను మీ మేనమామే చెల్లిస్తాడు’ గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా జగన్ చెప్పిన మాటలివి. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్ర సచివాలయంలో పదోన్నతుల్లో రిజర్వేషన్ల వివాదంపై ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశం నిర్వహించడంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా