తెలంగాణతో పోలిస్తే తగ్గిన వేతనాలు
పీఆర్సీ విషయంలో రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలతో తెలంగాణతో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులకు వేతనాల్లో చాలా వ్యత్యాసం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ 23 శాతమే ఫిట్మెంట్ ఇవ్వడం, ఇంటి
పోల్చిచూసుకుని ఉద్యోగుల ఆందోళన
ఈనాడు, అమరావతి: పీఆర్సీ విషయంలో రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలతో తెలంగాణతో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులకు వేతనాల్లో చాలా వ్యత్యాసం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ 23 శాతమే ఫిట్మెంట్ ఇవ్వడం, ఇంటి అద్దెభత్యం తగ్గించడం, సీసీఏ తొలగించడంతో తాము నష్టపోతున్నామని ఏపీ ఉద్యోగులు వాపోతున్నారు. సెక్షన్ ఆఫీసర్ కేడర్లో ఉన్న ఉద్యోగులకు వేతనంలో రూ.10వేలకు పైగా తేడా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు పదోవేతన సవరణ సంఘం సిఫారసుల్ని అమలుచేశాయి. రెండు ప్రభుత్వాలూ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చాయి. అయితే తెలంగాణ కంటే ఏపీలో మాస్టర్స్కేల్ మెరుగ్గా ఉండటం, కొన్ని ప్రాంతాల్లో హెచ్ఆర్ఏ ఎక్కువగా ఉండటంతో కొన్ని కేటగిరీల ఉద్యోగులకు ఏపీలోనే ఎక్కువ వేతనాలుండేవి. తర్వాత 11వ పీఆర్సీ సిఫారసుల అమల్లో భాగంగా 2021 మార్చిలో తెలంగాణ ప్రభుత్వం 30% ఫిట్మెంట్ ప్రకటించింది. ఏపీ 27% మధ్యంతర భృతి ఇస్తూ వచ్చింది. తాజాగా 23% ఫిట్మెంట్ ప్రకటించింది.
వేతనాల్లో వ్యత్యాసం ఇలా..
* హైదరాబాద్లో 2013 పీఆర్సీ ప్రకారం రూ.37,100 కనీస మూలవేతనం ఉన్న సెక్షన్ ఆఫీసర్ కేడర్ ఉద్యోగికి... 2018 పీఆర్సీ ప్రకారం 30% ఫిట్మెంట్, 2018 జులై 7 నాటికి 30.392% డీఏ ప్రాతిపదికన లెక్కిస్తే రూ.60,480 (మాస్టర్స్కేల్ ప్రకారం తదుపరి స్టేజ్లో పెట్టడం వల్ల) కనీస మూలవేతనం వస్తోంది. దానికి 24% హెచ్ఆర్ఏ, రూ.1,250 సీసీఏ కలిపితే రూ.76,245 వేతనం వస్తోంది. 2019 జనవరి 1 నుంచి 2021 జులై 1 వరకు పెండింగ్లో ఉన్న డీఏల్ని కలిపితే ఆ ఉద్యోగికి మొత్తం రూ.88,353 వేతనం వస్తుంది.
* ఆంధ్రప్రదేశ్లో 2013 పీఆర్సీ ప్రకారం రూ.37,100 కనీసం మూల వేతనం ఉన్న సెక్షన్ ఆఫీసర్ కేడర్ ఉద్యోగికి... 2018 పీఆర్సీ ప్రకారం 23% ఫిట్మెంట్, 30.392% డీఏ లెక్కిస్తే కనీస మూలవేతనం రూ.57,220 (మాస్టర్స్కేల్ ప్రకారం తదుపరి స్టేజ్లో పెట్టడంతో) అవుతుంది. దానికి 16% హెచ్ఆర్ఏ కలిపితే రూ.66,375 అవుతుంది. పెండింగ్ డీఏల్ని కలిపితే వేతనం రూ.77,831 అవుతుంది. అంటే తెలంగాణతో పోల్చితే రూ.10,522 తగ్గుతోంది.
* తెలంగాణలో సూపరింటెండెంట్ ర్యాంక్ ఉద్యోగికి 2013 పీఆర్సీ ప్రకారం కనీస మూలవేతనం రూ.28,940 ఉంటే... ప్రస్తుతం అది రూ.47,240కి చేరింది. దానికి 11% హెచ్ఆర్ఏ, పెండింగ్లో ఉన్న డీఏలు కలిపితే మొత్తం వేతనం రూ.61,893కి చేరుతుంది.
* ఆంధ్రప్రదేశ్లో 2013 పీఆర్సీ ప్రకారం రూ.28,940 కనీస మూలవేతనం ఉన్న అదే కేడర్ ఉద్యోగికి... 23% ఫిట్మెంట్, 30% డీఏ ప్రకారం అది రూ.44,570కి చేరుతుంది. కానీ ఇక్కడ హెచ్ఆర్ఏ 8 శాతమే. హెచ్ఆర్ఏతో పాటు, పెండింగ్ డీఏలు కలిపితే వచ్చే మొత్తం వేతనం రూ.57,059. అంటే తెలంగాణకు ఇక్కడికి రూ.4,834 వ్యత్యాసం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాకశాస్త్ర కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న తిరుపతిలోని భారత పాకశాస్త్ర సంస్థ (ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్)లో వివిధ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ శిక్షణ, ప్లేస్మెంట్ అధికారి చెల్లేశ్వరరావు తెలిపారు. -
ఎన్నికలకు ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
దేవాదాయశాఖ కమిషనర్పై సుమోటో కోర్టుధిక్కరణ కేసు
దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణపై సుమోటోగా కోర్టుధిక్కరణ కేసు నమోదుచేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట
స్కిల్ కేసులో రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
పప్పూబెల్లాల్లా ఉన్నత విద్యామండలి నిధులు
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేషీ నిర్వహణ, ప్రభుత్వ సలహాదారు (విద్య) సాంబశివారెడ్డి కారు బిల్లు, సచివాలయంలోని ఉన్నత విద్యాశాఖలో పని చేస్తున్న సిబ్బందికి జీతాభత్యాలకు ఉన్నత విద్యామండలి నిధులను పప్పూ బెల్లాల్లా ఖర్చు పెట్టేస్తున్నారు. -
ఎన్నికల వేళ రూ.530 కోట్ల ఎర
కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులనూ ఇతర అవసరాలకు మళ్లించి పట్టణ స్థానిక సంస్థలను తీవ్ర అవస్థలకు గురి చేసిన జగన్ సర్కార్ ఎన్నికల వేళ సొంత పార్టీకి చెందిన పాలక వర్గాలను బుజ్జగించేందుకు కొత్త ఎత్తుగడ వేసింది. -
తిరుపతి కలెక్టర్కు ఎన్నికల విధులు అప్పగించొద్దు
ఎన్నికల వేళ వైకాపా పంపిణీ చేసేందుకు తెచ్చిన తాయిలాలు శ్రీకాళహస్తిలో ఓ గోదాంలో దొరికినా తిరుపతి కలెక్టర్కు చీమకుట్టినట్లు కూడా లేదని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. -
వాలంటీర్లతో వైకాపా నాయకుడి రహస్య మంతనాలు
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా వాలంటీర్లతో విశాఖ తూర్పు వైకాపా నాయకుడు ఒకరు రహస్య సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. -
‘సాక్షి’ యాజమాన్యానికి సీఎం రమేష్ లీగల్ నోటీసు
‘సాక్షి’ టీవీ, పత్రిక యాజమాన్యానికి రాజ్యసభ సభ్యుడు, భాజపా అనకాపల్లి లోక్సభ అభ్యర్థి సీఎం రమేష్ లీగల్ నోటీసు పంపారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
సంక్షిప్త వార్తలు
తిరుమల శ్రీవారిని మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ గురువారం దర్శించుకున్నారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్