కోర్టులు చెప్పే వరకు కదలరా?
కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శించిన తాత్సార వైఖరిపై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సంజీవ్ఖన్నాలతో కూడిన ధర్మాసనం విరుచుకుపడింది. పదేపదే జారీ చేస్తున్న ఉత్తర్వులను పట్టించుకోరా? అని నిలదీసింది.
కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో ఏపీ తాత్సారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
హాజరై క్షమాపణలు చెప్పిన సీఎస్ సమీర్శర్మ
ఇకపై ఇలాంటిది జరగదని న్యాయస్థానానికి హామీ
ఈనాడు, దిల్లీ: కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శించిన తాత్సార వైఖరిపై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సంజీవ్ఖన్నాలతో కూడిన ధర్మాసనం విరుచుకుపడింది. పదేపదే జారీ చేస్తున్న ఉత్తర్వులను పట్టించుకోరా? అని నిలదీసింది. కోర్టులు చెప్పేంతవరకూ స్పందించే గుణం లేదా, ఆ మాత్రం సున్నితత్వం (సెన్సిటివిటీ) లేకుండా పోయిందా అని మండిపడింది. మధ్యాహ్నం 2 గంటలకు ఆ రెండు రాష్ట్రాల సీఎస్లు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించడంతో ఏపీ సీఎస్ సమీర్శర్మ, బిహార్ సీఎస్ అమిర్ సుభానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధర్మాసనం ముందు హాజరై క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
బుధవారం ఉదయం కేసు విచారణకు వచ్చినప్పుడు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ‘‘కొవిడ్తో మృతుల కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాలని పదేపదే ఉత్తర్వులు జారీచేసినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాత్సారం చేసింది. కొవిడ్తో 14,471 మంది మృతి చెందినట్లు రికార్డుల్లో నమోదైతే, పరిహారం కోసం 31 వేలకుపైగా దరఖాస్తులొచ్చినట్లు న్యాయవాది చెప్పారు. ఇప్పటివరకు 11వేల మందికే పరిహారం చెల్లించారు. అర్హులకు పరిహారం చెల్లించకపోవడం అంటే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడమే. ఇందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే బాధ్యత వహించాలి. సీఎస్ రెండు గంటలకు హాజరై, ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో సంజాయిషీ ఇవ్వాలి’’ అని జస్టిస్ ఎంఆర్ షా ఆదేశించారు. బిహార్ సీఎస్కూ ఇదే తరహా ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో రెండురాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు మధ్యాహ్నం 2 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. తొలుత ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది బసంత్ సమగ్ర వివరాలను మరోసారి కోర్టుకు వివరించారు.
ఇప్పటివరకు 23,895 క్లెయిమ్లకు క్లియర్ చేశామనగా జస్టిస్ ఎంఆర్షా అభ్యంతరం వ్యక్తంచేశారు. ఉదయం 11,494 క్లెయిమ్లే చెల్లించినట్లు చెప్పి, ఇప్పుడు 23వేల పైచిలుకు లెక్కలు చెబుతున్నారేంటి? అని ప్రశ్నించారు. న్యాయవాది బదులిస్తూ కొంత అయోమయంతో అలా చెప్పామని, ఇంకా చెల్లించాల్సిన క్లెయిమ్లు 10,894 మాత్రమే ఉన్నాయన్నారు. కోర్టు ఆరాటంతోనే ఇన్ని దరఖాస్తులు వచ్చాయని, అర్హమైన అన్నింటినీ క్లియర్ చేయడానికి రెండు వారాల సమయం కావాలని కోరారు. దాంతో జస్టిస్ ఎంఆర్ షా అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆరాటం కోర్టుకు తప్పితే మీకు లేదని వ్యాఖ్యానించగా న్యాయవాది స్పందిస్తూ... సీఎస్ ఇక్కడే ఉన్నారని, మీ ఆరాటాన్ని వారికి చెప్పి త్వరగా చర్యలు తీసుకొనేలా చేస్తామన్నారు. అందుకు జస్టిస్ ఎంఆర్షా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి విషయంలో కోర్టు చెప్పేంతవరకు ఎందుకు వేచిచూస్తున్నారు? పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఇప్పటివరకు మీ ముందుకు వచ్చిన క్లెయిమ్ల్లో రికార్డులపరంగా నమోదైన 14,471 కేసులను కలిపారా? లేదా? అని అడిగారు. వాటినీ కలిపామంటూనే సీఎస్ సమీర్శర్మ కూడా ఇక్కడే ఉన్నారని న్యాయవాది పేర్కొనగా... ఆయన తెరమీదికి వచ్చి కోర్టుకు క్షమాపణలు తెలిపారు. జరిగిన దానికి వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటున్నట్లు చెప్పారు. రికార్డులను తనిఖీచేస్తున్నామని కొన్నిచోట్ల పేర్లుంటే, మరికొన్నిచోట్ల వయసు మాత్రమే ఉందని, ఇంకొన్నింటిపై అడ్రస్ లేకపోవడంతో అన్నింటినీ తనిఖీ చేస్తున్నామని వివరించారు. దానిపై జస్టిస్ ఎంఆర్ షా తీవ్రంగా మండిపడ్డారు.
మీరు రికార్డులను అంత లోపభూయిష్టంగా నిర్వహిస్తున్నారన్నమాట అని అసహనంగా వ్యాఖ్యానించారు. కిందిస్థాయిలో జరిగిన తప్పులను సరిదిద్దుతున్నామని, ఇకపై ఏదైనా తప్పు జరిగితే కోర్టు ధిక్కరణ కింద శిక్ష ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉంటానని, మరో రెండు వారాల్లో అందరికీ పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అందుకు న్యాయమూర్తి స్పందిస్తూ మరోసారి ఇలా హాజరయ్యే పరిస్థితి రాకుండా చూసుకోవాలని సమీర్శర్మకు సూచించారు. సీఎస్ స్పందిస్తూ ‘‘ఇలా సుప్రీంకోర్టు ముందు హాజరుకావడం ఇదే తొలిసారి. చాలా అవమానకరంగా, టెరిబుల్గా ఉంది. మరోసారి ఈ పరిస్థితి రాకుండా చూసుకుంటా’’ అని హామీ ఇవ్వడంతో ధర్మాసనం వాదనలను ముగించి తదుపరి విచారణను ఫిబ్రవరి 4కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
అనాథలైన పిల్లలను ఆదుకోండి
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు పరిహారం కోసం 41,292 దరఖాస్తులు రాగా, అందులో 34,819 దరఖాస్తులకు పరిహారం పొందే అర్హత ఉన్నట్లు తేల్చారు. వీటిలో 23,895కి పరిహారం అందింది. 10,984 మందికి చెల్లించాల్సి ఉంది.
అందులో 5,141 క్లెయిమ్లను క్లియర్ చేశారు. వాటికి మూడురోజుల్లోపు చెల్లించేయాల్సి ఉంది. ఇప్పటివరకు తిరస్కరించిన 6,473 క్లెయిమ్లను సంబంధిత ఫిర్యాదుల పరిష్కార కమిటీలు సొంతంగా సమీక్షించి, దరఖాస్తుల్లోని లోపాలను సరిదిద్దుకొనే అవకాశమివ్వాలి. బాల్స్వరాజ్ పోర్టల్లో అప్లోడ్ చేసిన మేరకు కరోనా కారణంగా దేశవ్యాప్తంగా 10 వేల మందికి పైగా పిల్లలు అనాథలయ్యారు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే పోర్టల్లో పేర్లు నమోదైన పిల్లలను చేరుకొని వారికి పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రాల్లో వాస్తవంగా నమోదైన మరణాలు, బాల్స్వరాజ్ పోర్టల్లో నమోదైన వివరాలను అక్కడి ప్రభుత్వాలు స్థానిక లీగల్ సర్వీస్ అథారిటీకి అందించాలి. తల్లిదండ్రులు ఇద్దరినీ, ఎవరో ఒకరిని కోల్పోయిన పిల్లల వివరాలన్నీ సమర్పించాలి’’ అని జస్టిస్ ఎంఆర్షా ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
సంక్షిప్త వార్తలు
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారు?
రాజీనామా చేశాక వాలంటీర్, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల మధ్య అనుబంధం పోతుందని.. అలాంటప్పుడు వారి మాట విని ఏ లబ్ధిదారు ఓటేస్తారని హైకోర్టు వ్యాఖ్యానించింది.