పేదలకు ప్రభుత్వం షాక్!
అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్న పేదలకు... ఆ స్థలాల్ని క్రమబద్ధీకరించే ప్రక్రియను ప్రభుత్వం మరో ఓటీఎస్లా మార్చేసింది. 75 చదరపు గజాల వరకే ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని చెప్పిన ప్రభుత్వం...
ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు రూ.లక్షల్లో రుసుము
రెండు నెలల్లోపు కట్టకపోతే చర్యలు తప్పవని నోటీసులు
తీవ్ర ఆందోళనలో పేదలు
మండిపడుతున్న వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు
ఈనాడు, అమరావతి: అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్న పేదలకు... ఆ స్థలాల్ని క్రమబద్ధీకరించే ప్రక్రియను ప్రభుత్వం మరో ఓటీఎస్లా మార్చేసింది. 75 చదరపు గజాల వరకే ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని చెప్పిన ప్రభుత్వం, ఒక్క చ.గజం అదనంగా ఉన్నా... మొత్తం స్థలానికి నిర్దేశిత ధర కట్టాల్సిందేనని డిమాండ్ నోటీసులు పంపుతోంది. అది నగర, పట్టణ ప్రాంతాల్లో రూ.లక్షల్లో ఉండటంతో... పేద ప్రజలు ఖంగుతింటున్నారు. నోటీసు అందాక రెండు నెలల్లోగా మొత్తం రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించడం వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతానికి క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారికే ఈ నోటీసులు వస్తున్నాయి. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారికి వాటిని క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2021 ఆగస్టు 23న జారీ చేసిన జీవో నెం.225లోని నిబంధనలు పేదలను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని క్రమబద్ధీకరించుకోని వారి ఇళ్లను అక్కడి నుంచి తొలగిస్తామని ఆ జీవోలో ప్రభుత్వం పేర్కొంది. గ్రామ, వార్డు సచివాలయాల సహకారంతో సర్వే చేసి, ఆక్రమణలకు సంబంధించిన తుది జాబితా సిద్ధం చేయాలని తహసీల్దార్లను ఆదేశించింది. ప్రభుత్వ తీరు పేదలకు ద్రోహం చేసేదిగా ఉందని, 100 చదరపు గజాల వరకు ఒక రూపాయికే క్రమబద్ధీకరిస్తామంటూ ఇదే ప్రభుత్వం 2019లో జీవో జారీ చేసిందని, ఇప్పుడు దాన్ని తుంగలోతొక్కి 75 చ.గజాల వరకే ఉచితంగా క్రమబద్ధీకరిస్తామనడం పేదల్ని వంచించడమేనని వివిధ రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.
మొత్తం స్థలానికి డబ్బు కట్టమంటే ఎలా?
* అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్న వారికి గత ప్రభుత్వ హయాంలోనూ స్థలాల్ని క్రమబద్ధీకరించారు. అప్పట్లో స్థలాల ధర నిర్ణయించేందుకు ‘టెలిస్కోపిక్’ విధానం అమలు చేశారు. 2017 ఆగస్టు 24న జారీ చేసిన జీవో ప్రకారం... దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు 100 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించే వారు. దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న (ఏపీఎల్) కుటుంబాలకు 1-100 గజాల వరకు ఆ ప్రాంతంలోని స్థలాలకు రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించిన మూల విలువలో 7.5 శాతం ధర నిర్ణయించారు. 101 నుంచి 250 చ.గజాల వరకు బీపీఎల్, ఏపీఎల్ కుటుంబాలు రెండింటికీ స్థలం మూల విలువలో 15 శాతం ధర నిర్ణయించారు. అయితే... ఒక బీపీఎల్ కుటుంబం 125 చ.గజాల్లో ఇల్లు కట్టుకుంటే గనుక వారికి 100 చ.గజాల వరకు ఉచితమే. మిగతా 25 చ.గజాలకు మాత్రమే మూల విలువలో 15 శాతం కట్టాల్సి ఉంటుంది. అదే ఒక ఏపీఎల్ కుటుంబం 125 చ.గజాల్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుంటే 100 చ.గజాల వరకు 7.5 శాతం చొప్పున, మిగతా 25 చ.గజాలకు 15 శాతం చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. దీన్నే టెలిస్కోపిక్ విధానం అంటారు. అప్పట్లో 500 చ.గజాల వరకు స్థలాన్ని క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశమిచ్చింది.
* వైకాపా అధికారంలోకి వచ్చాక పాత నిబంధనలను సవరిస్తూ 2019 నవంబరు 6న ఒక జీవో నెం.463 జారీ చేసింది. గరిష్ఠంగా 300 చ.గజాల వరకే క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేసింది. బీపీఎల్ కుటుంబాలకు 100 చ.గజాల వరకు ఒక రూపాయికే చేస్తామని చెప్పింది. 100-300 చ.గజాల వరకు అక్కడి మార్కెట్ విలువను బట్టి జిల్లా కలెక్టర్ నిర్ణయించిన ధర చెల్లించాలని తెలిపింది. ఏపీఎల్ కుటుంబాలకు 300 చ.గజాల వరకు ఎంత విస్తీర్ణమైనా... మార్కెట్ విలువలో జిల్లా కలెక్టర్ నిర్ణయించిన ధర చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
* 2019లో తాను రూపొందించిన నిబంధనలనే పక్కనపెట్టి... 2021 ఆగస్టు 23న ప్రభుత్వం జీవో నెం.225 జారీ చేసింది. 100 చ.గజాల వరకు ఒక రూపాయికే క్రమబద్ధీకరిస్తామన్న ప్రభుత్వం... దాన్ని ఇప్పుడు 75 చ.గజాలకు కుదించేసింది. పైగా టెలిస్కోపిక్ విధానం ఉండదని స్పష్టం చేసింది. 75 చ.గజాల వరకు ఉన్న వారికి ఉచితంగా క్రమబద్ధీకరించి, డి-ఫాం పట్టా ఇస్తామని చెప్పింది. అది కూడా ఆరంచెల పరిశీలనలో అర్హులుగా తేలిన వారికే ఉచితం. ఆ పరిధిలో లేకపోయినా, 75 గజాలు దాటినా... మొత్తం స్థలానికి మూల విలువలో 75 శాతం చెల్లించాలని నిబంధన పెట్టింది. 150 గజాల్లోపు ఆక్రమించుకున్న వారు మూల విలువలో 75 శాతం, 150 నుంచి 300 గజాల వరకు నూరు శాతం చెల్లించాలని తెలిపింది.
పూరి గుడిసెలు ఉంటే క్రమబద్ధీకరించరు..!
గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జీవోలో ఇళ్లు ఉన్నా, తాటాకు గుడిసెలు ఉన్నా క్రమబద్ధీకరిస్తామని చెప్పింది. ఈ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోలో... ఇటుకలతో కట్టిన గోడలపై ఆర్సీసీ లేదా ఆస్బెస్టాస్ పైకప్పు ఉన్న ఇళ్లనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. కేవలం స్థలాన్ని కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో వేసిన పూరి గుడిసెలను పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొంది.
గజం 1.29 లక్షల రూపాయలన్న మాట..!
పేదలకు క్రమబద్ధీకరించే స్థలం కనీస పరిమితిని 100 చ.గజాల నుంచి 75 చ.గజాలకు కుదించడంతో పాటు, ధర లెక్కించేందుకు టెలిస్కోపిక్ విధానాన్ని అనుసరించకపోవడం వల్ల పేదలపై పెనుభారం పడుతోంది. ఉదాహరణకు విజయవాడ సమీపంలోని ముత్యాలంపాడులో ఒక వ్యక్తి 88 చ.గజాల స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారు. ఆ స్థలాన్ని క్రమబద్ధీకరించమని 2021 అక్టోబరు 20న దరఖాస్తు చేసుకున్నారు. దాన్ని క్రమబద్ధీకరించాలంటే రూ.16.83 లక్షలు చెల్లించాలని, అది కూడా ఓకే విడతలో ప్రభుత్వానికి కట్టాలని విజయవాడ ఉత్తర మండలం తహసీల్దారు కార్యాలయం నుంచి డిమాండ్ నోటీసు వచ్చింది. ఈ నోటీసు అందిన రెండు నెలల్లోగా డబ్బు కట్టకపోతే అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే టెలిస్కోపిక్ విధానం అమల్లో ఉంటే... అదే ఇంటి యజమాని 13 చ.గజాలకు మాత్రమే ధర చెల్లిస్తే సరిపోయేది. అంటే ఇప్పుడు అతను 13 చ.గజాలు ఎక్కువ ఉన్నందుకు ఒక్కో చ.గజానికి రూ.1.29 లక్షల చొప్పున కట్టాల్సి వస్తోందన్న మాట. అంత ధర విజయవాడ నగరం నడిబొడ్డున కూడా ఉండదు. పోనీ ఆ 16.83 లక్షల మొత్తాన్ని 88 గజాలకు లెక్క వేసినా... గజం ధర రూ.19,125 పడుతోంది. ఒక్క గజం స్థలం కూడా కొనుక్కునే స్థోమత లేకే కదా అతను ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు అతన్ని చ.గజానికి రూ.19,125 చొప్పున ప్రభుత్వం కట్టమంటే... పెనుభారం వేసినట్టే కదా? అని పలు వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
* 75 చ.గజాలు దాటిన వారు స్థలాల్ని క్రమబద్ధీకరించుకోవాలంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరలు మరీ అసాధారణంగా ఉన్నాయని, పేదలు అంత మొత్తం ఎలా చెల్లించగలరని పలు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.
పేదల్ని హింసించి... డబ్బు గుంజడమేంటి?
‘‘నిలువనీడలేని పేదలు కొంత ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలే తప్ప, దాన్ని కూడా ఒక ఆదాయమార్గంగా చూడటం దారుణం. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన భారీ రుసుము చెల్లించి క్రమబద్ధీకరించుకోవడమంటే... పేదలు తాము కట్టుకున్న ఇంటినే భారీ మొత్తం చెల్లించి ప్రభుత్వం నుంచి కొనుక్కున్నట్టవుతుంది. అసలే పేదలు... వారిని రూ.లక్షల్లో డబ్బు కట్టమంటే ఎక్కడి నుంచి తెస్తారు. ఇది పేదల సంక్షేమాన్ని చూసే ప్రభుత్వం కాదు. వారిని హింసించే ప్రభుత్వం. ప్రభుత్వానికి ఆదాయం కావాలంటే వేరే మార్గాలు చూసుకోవాలే తప్ప పేదలను ఇబ్బంది పెట్టడం తగదు. ప్రభుత్వం తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుని, 150 చ.గజాల వరకు పేదలకు ఉచితంగా క్రమబద్ధీకరించాలి. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం.’’
-బాబూరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్