సీఎంను తిడితే.. హెచ్ఆర్ఏ వచ్చేస్తుందా?
ఉద్యోగులు తమ సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప, ముఖ్యమంత్రిని బూతులు తిడితేనో, శాపనార్థాలు పెడితేనో ఫలితం ఉండదని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వ్యాఖ్యానించారు.
మంత్రి పేర్ని నాని
ఈనాడు, అమరావతి: ఉద్యోగులు తమ సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప, ముఖ్యమంత్రిని బూతులు తిడితేనో, శాపనార్థాలు పెడితేనో ఫలితం ఉండదని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వ్యాఖ్యానించారు. తెదేపా, భాజపాలు ఉద్యోగుల్ని ఎంత రెచ్చగొట్టినా ముఖ్యమంత్రి జగన్కు, ఉద్యోగులకు మధ్య తగాదా పెట్టలేవని స్పష్టం చేశారు. ‘ఉద్యోగులు, ఉపాధ్యాయులు చెప్పుడు మాటలువిని, ముఖ్యమంత్రి గురించి అసభ్యంగా మాట్లాడటం సరికాదు. ఇవేనా పిల్లలకు ఉపాధ్యాయులు నేర్పే పాఠాలు?’ అని ప్రశ్నించారు. శుక్రవారం సచివాలయంలో కేబినెట్ నిర్ణయాలను విలేకరులకు వెల్లడించాక.. వారు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మా ప్రభుత్వం సంప్రదింపులకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంచుతుంది. గత్యంతరంలేని పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల వల్లే ముఖ్యమంత్రి మానసికంగా ఎంతో నలిగిపోతూ ఆ నిర్ణయం తీసుకున్నారు?’ అని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు తమ జీతాలు తగ్గించుకోకుండా తమ వేతనాల్లో కోత పెట్టారని ఉద్యోగులు అంటున్నారు కదా? అన్న ప్రశ్నకు ‘బాగోలేనప్పుడు జగన్ అందరి జోలికీ వస్తారు’ అని మంత్రి బదులిచ్చారు.
జగన్, చిరంజీవి కుశలప్రశ్నలు వేసుకున్నారంతే!
సినిమా టిక్కెట్ల వ్యవహారంపై కేబినెట్లో చర్చ జరిగిందా? సీఎంతో సమావేశం సానుకూలంగా జరిగిందని అప్పట్లో చిరంజీవి చెప్పారు కదా? అన్న ప్రశ్నకు ‘సినిమా టిక్కెట్ల వ్యవహారం కేబినెట్ వరకు ఎందుకు? చిరంజీవి ఏదో భోజనానికి వచ్చారు. వారిద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. సంప్రదింపులు సచివాలయంలోనో జరుగుతాయిగానీ, ఇంట్లోనా? ఇదేమైనా చంద్రబాబు ప్రభుత్వమా’ అని బదులిచ్చారు.
తెదేపా నేతలేమైనా యోగులా?
గుడివాడలో తెదేపా నేతలపై దాడి గురించి ప్రస్తావించగా ‘వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ నిరసన చెప్పడానికి చంద్రబాబు ఇంటి దగ్గరున్న కరకట్ట మీదకు వెళ్తేనే కారు అద్దాలు పగలగొట్టి పంపించారు. ప్రైవేటు ఆస్తిలోకి వెళ్తే అద్దాలు పగులుతాయని వాళ్ల చర్యల ద్వారా నిరూపించిన తెదేపా నేతలు.. ఇప్పుడు గుడివాడలో వేరే వాళ్ల ప్రాపర్టీలోకి ఎలా వెళ్తారు? అక్కడ తప్పు జరిగిందనుకుంటే ఎస్పీకి ఫిర్యాదు చేయాలి. అయినా నిజనిర్ధారణ చేయడానికి వాళ్లేమైనా హిమాలయాల నుంచి వచ్చిన యోగులా?’ అని నాని వ్యాఖ్యానించారు. గుడివాడలో తప్పు జరిగి ఉంటే జగన్ ఎవర్నీ ఉపేక్షించరని తెలిపారు. పోలీసులపైనే ఎఫ్ఐఆర్ కట్టి జైల్లో వేయడం, సొంతఎమ్మెల్యే అయినా తప్పుచేస్తే కేసు పెట్టడం గతంలో ఏ ప్రభుత్వంలోనైనా చూశారా? అని ప్రశ్నించారు. జడ్జిని కూడా జైల్లో పెట్టారు కదా? అని ఒక విలేకరి అడగ్గా.. ‘తప్పు చేస్తే జడ్జినైనా లోపలేస్తారు. ఏం.. మిమ్మల్ని వేయరా? సినిమా యాక్టర్లను ఆపుతారా? పార్టీ పెట్టుకుంటే మాత్రం, పార్టీ అధ్యక్షుడు తప్పు చేస్తే ఆపుతారా?’ అని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్